అన్వేషించండి

Realtor Ramu Murder Case: రియల్టర్‌ రాము హత్యకు ఏడాది క్రితమే ప్లాన్‌- ఎనిమిది మంది అరెస్ట్‌

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాము హత్య కేసును చేధించిన పోలీసులు... ఇద్దరు మహిళలతో పాటు 8మందిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. రాము హత్యకు ఏడాది క్రితమే ప్లాన్‌ చేసినట్టు గుర్తించారు.

Hyderabad Crime News: హైదరాబాద్‌ (Hyderabad) యూసుఫ్‌గూడ(yusufguda)లో జరిగిన పుట్టా రాము(Putta Ramu) అలియాస్‌ సింగోటం రామన్న హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఏడుగురిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళతోపాటు ఆమె కుమార్తె కూడా ఉంది. 

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ సమీపంలోని సింగోటం గ్రామానికి చెందిన పుట్టా రాము అలియాస్‌ సింగోటం రామన్న... నిజాంపేటలోని బెవర్లీ ఫార్మ్స్‌ విల్లాలో నివాసం ఉంటున్నారు. బుధవారం (ఫిబ్రవరి 7వ తేదీ) రాత్రి 11 గంటల సమయంలో యూసుఫ్‌గూడలోని లక్ష్మీనరసింహనగర్‌లో హసీనా అనే మహిళ ఇంట్లో... రామన్న దారుణ హత్యకు గురయ్యాడు. కత్తులతో వచ్చిన 11 మంది... పుట్టా రామును హత్య చేసి పారిపోయారు. రామన్న బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు  పోలీసులు దర్యాప్తు చేశారు. పుట్టా రాము హత్య జరిగిన ఇంట్లో ఉంటున్న 40ఏళ్ల హిమాంబీ, ఆమె కుమార్తె నసీమాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హత్యకు ముందు రాముకు... నసీమా నుంచి ఫోన్‌ కాల్స్‌ వెళ్లినట్టు విచారణలో  తేలింది. దీనిపై ఆమెను ప్రశ్నించి పూర్తి వివరాలు సేకరించారు. అలాగే... సీసీ ఫుటేజీని కూడా సేకరించారు. హత్య తర్వాత నిందితులు పారిపోతున్న దృశ్యాలను గమనించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.  8మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. హసీనా, ఆమె కుమార్తె సాయంతో హనీట్రాప్‌ చేయించి... రామన్నను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. జీడిమెట్లలోని రాంరెడ్డినగర్‌లో ఉంటున్న డ్రైవర్‌ మణికంఠ ఏ1గా, చింతల్‌కు చెందిన అతడి  స్నేహితుడు దారావత్‌ వినోద్‌కుమార్‌ను ఏ2గా తేల్చారు.

జీడిమెట్లలో ఉంటున్న మణికంఠ రౌడీషీటర్‌. ఇదివరకు... రాము, మణికంఠ, వినోద్‌ స్నేహితులు. ఆ తర్వాత వ్యాపార విషయంలో... రాము, మణికంఠ గొడవలు వచ్చాయి. రెండేళ్ల క్రితం మణికంఠపై దాడి చేశాడు రామన్న. మణికంఠ మొహానికి తీవ్ర  గాయాలై ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ కేసులో రాము జైలుకు వెళ్లి.. బెయిల్‌పై వచ్చాడు. రాము తనను చంపేస్తాడన్న భయపడ్డారు మణికంఠ. రాము తనను చంపేలోపే... తానే రామును చంపేయాలని ప్లాన్‌ చేశారు. మరోవైపు...  వ్యభిచార గృహం నిర్వహిస్తున్న హిమాంబీతో శారీరక సంబంధం పెట్టుకున్న రాము.. ఆమె కుమార్తె నసీమాను కూడా లోబర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం నసీమా ప్రియుడైన వినోద్‌కు తెలిసింది. నసీమా, ఆమె తల్లి... ఈ విషయాన్ని  మణికంఠకు, వినోద్‌కు చెప్పారు. వారంతా కలిసి పుట్టా రామును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు పక్కాగా స్కెచ్‌ వేసుకున్నారు. వారి ప్లాన్‌లో భాగంగా... బుధవారం రాత్రి హిమాంబీ కూతురు నసీమాతో రాముకు ఫోన్‌ చేయించారు. పుట్టారామును వారి ఇంటికి రమ్మని పిలిచారు. దీంతో లక్ష్మీనరసింహనగర్‌ వచ్చిన పుట్టా రాము నసీమాతోపాటు గదిలోకి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న మణికంఠ, వినోద్‌తో సహా 11 మంది గదిలోకి వెళ్లి.. నసీమా ముందే విచక్షణా రహితంగా రాముని పొడిచేశారు. అతడి మర్మాంగాలను కోసేశాడు వినోద్‌. తీవ్రంగా గాయపడిన రాము అక్కడికక్కడే చనిపోయాడు. రాము హత్య తర్వాత.. అక్కడి నుంచి పరారయ్యారు నిందితులు.

రాము హత్య కేసులో లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులంతా జీడిమెట్ల రాంరెడ్డినగర్‌లో ఉన్నట్లు తెలుసుకున్నారు. మణికంఠ, వినోద్‌తోపాటు హత్యకు సహకరించిన మహ్మద్‌ ఖైసర్‌, బండ శివ, కప్పాల నిఖిల్‌, తున్న కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. వీరితోపాటు హిమాంబీ, ఆమె కుమార్తె నసీమాను కూడా అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. హిమామ్‌బీపై వ్యభిచార నిర్వహణ కేసు కూడా పెట్టారు పోలీసులు. 

టాప్ హెడ్ లైన్స్

నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
నా భర్తను చంపు.. లేకపోతే నేను చచ్చిపోతా.. లవర్‌తో భార్య చాటింగ్ చూసి భర్త షాక్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget