అన్వేషించండి

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

Loan Apps Cheating : లోన్ యాప్ నిర్వాహకుల ఆటకట్టించారు రాజమండ్రి పోలీసులు. దంపతులు ఆత్మహత్య కేసులో విచారణ చేపట్టి ఏడుగురిని అరెస్టు చేశారు.

Loan Apps Cheating : లోన్ యాప్ నిర్వాహకుల ఆటకట్టించారు రాజమండ్రి పోలీసులు. ఇటీవల లోన్ యాప్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో విచారణ చేపట్టి ఏడుగురిని అరెస్టు చేశారు. సెప్టెంబర్ 7వ తేదీన పురుగుల మందు తాగి కొల్లి దుర్గారావు, కొల్లి రమ్య లక్ష్మి అనే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాజమహేంద్రవరం 2వ పట్టణ పోలీసు స్టేషన్ లో పలు సెక్షన్లపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.  కొల్లి దుర్గారావు దంపతులు తమ అవసరాలకై చిన్న మొత్తాల లోన్ తీసుకున్నారు. అయితే ఈ లోన్ ను తిరిగి ఎక్కువ మొత్తంలో తీర్చమని, లేకపోతే వారి ఫోటోలును మార్చింగ్ చేసి సోషల్ మీడియాలో, బంధువులకు పెడతామని బెదిరించడంతో దుర్గారావు దంపతులు బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు.  మృతులను బెదిరింపులకు గురిచేసిన హాండీ లోన్, స్పీడ్ లోన్ అనే రెండు లోన్ యాప్ లలో పనిచేస్తున్న ఏడుగురుని అరెస్ట్ చేశామన్నారు.  

ఎస్పీ ఏమన్నారంటే? 

రాజమహేంద్రవరం స్థానిక దిశ పోలీస్ స్టేషన్లో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో రాజమండ్రి పోలీసులు దర్యాప్తు చేసి  లోన్ యాప్ నిర్వాహకులను గుర్తించారని తెలిపారు.  దర్యాప్తులో భాగంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలలో దర్యాప్తు చేసి మరో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారన్నారు.  నిర్వాహకులు చాకచక్యంగా మూడు దశలలో మల్టీ లెవెల్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ అకౌంట్లను సృష్టించి నిరుద్యోగులకు డబ్బు ఎరగా వేసి వారి బ్యాంక్ అకౌంట్ ద్వారా లోన్ యాప్ బాధితులకు చిన్న మొత్తంలో లోన్ ఇచ్చి రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. 

Loan Apps Cheating : రాజమండ్రి నుంచి గుజరాత్ వరకూ, లోన్ యాప్ నెట్ వర్క్ ను ఛేదించిన పోలీసులు!

(ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి) 

మూడు దశల్లో నగదు ట్రాన్స్ పర్ 

మొదటి దశలో సుమారు 80 నుంచి 100 సేవింగ్ ఖాతాలు సృష్టించి, ఒక్కో అకౌంట్ నుంచి ప్రతి నెల సుమారు 100 మందికి అప్పు ఇచ్చి దానికి రెండు, మూడు వంతులు అధికంగా వసూలు చేస్తున్నట్లు వెల్లడైందని ఎస్పీ తెలిపారు.  ఈ విధంగా బాధితుల నుంచి వసూలు చేసిన నగదును 2వ దశలో సుమారు 20 కంపెనీల పేర్లతో ఓపెన్ చేసిన కరెంటు అకౌంట్లకు బదిలీ చేస్తున్నారన్నారు. ఈ కరెంటు అకౌంట్ లావాదేవీలు పరిశీలించగా ఒక్కొక్క అకౌంట్లో ఒక నెలకు సుమారు రూ.15-20 కోట్ల వరకు ఈ విధంగా లోన్ యాప్ నుంచి అప్పు తీసుకున్న వారిని బెదిరించి వసూలు చేస్తున్నారని తెలిసిందన్నారు. ఈ సొమ్మును 3వ దశలో గుజరాత్ లో ఉన్న షెల్ కంపెనీల అకౌంట్లకు బదిలీ చేసి ఆ అకౌంట్ నుంచి విత్ డ్రా చేసి హవాల మార్గంలో లోన్ యాప్ ఓనర్స్ తీసుకున్నట్లు నిర్ధారించినట్లు ఎస్పీ చెప్పారు. 

తప్పించుకున్న ప్రధాన నిందితుడు 

గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన షెల్ కంపెనీ ఓనర్లలో ముగ్గుర్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. అరెస్ట్ చేసిన సమయంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు తృటిలో తప్పించుకున్నాడన్నారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని ఎస్పీ వెల్లడించారు. ఈ నిందితులను పట్టుకోవడం కోసం కె. లక్ష్మణ రెడ్డి, సీ.ఐ నల్లజర్ల  బృందం గుజరాత్ రాష్ట్రానికి, ఎ. శ్రీనివాస రావు, సి.ఐ దేవరపల్లి  బృందం మహారాష్ట్రకు, పి.ఈ. పవన్ కుమార్ రెడ్డి, సీ.ఐ ప్రకాష్ నగర్  బృందం కర్ణాటక రాష్ట్రాలలో పర్యటించి లోన్ యాప్ నిందితులను అరెస్ట్ చేశారని తెలిపారు. అదేవిధంగా ఈ లోన్ యాప్ నిర్వాహకులకు ఎవరైనా సహకరించినట్లయితే వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి యాప్ లను నమ్మి  వారి ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్, గ్యాలరీ, కాల్స్, మెసేజెస్ అండ్ ఫైల్స్ యాక్సెస్ ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు.  ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడినా, ఈ విధమైన లోన్ App ఏజెంట్లుగా పనిచేసినా, వారిపై Sec. 384, 386 IPC ప్రకారం 10 సం.లు వరకు జైలు శిక్షార్హులవుతారని,  వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Hyderabad Latest News: సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget