అన్వేషించండి

Crime News: ఏపీలో తీవ్ర విషాదాలు - కరెంట్ షాక్‌తో ఒకే రోజు తల్లీకొడుకు మృతి, రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం

Kakinada News: కరెంట్ షాక్‌తో గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. అటు, ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Mother And Son Died Due To Current Shock In Kakinada: ఏపీలో తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. కాకినాడ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఒకే రోజు తల్లీకొడుకు మృతి చెందగా.. ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా (Kakinada District) సామర్లకోటలోని 20వ వార్డులో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక వీర రాఘవపురం సత్తమ్మతల్లి ఆలయం సమీపంలో నివసిస్తోన్న చిట్టిమని పద్మ (40) శనివారం ఇంటి పక్కన ఉన్న కాల్వలోకి తుళ్లిపడి మృతి చెందారు. ఆదివారం ఆమె కుమారుడు విశ్వేస్ (23) కూడా అక్కడే దుస్తులు ఆరేసే తీగను ముట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. అయితే, పద్మ కూడా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెంది ఉండొచ్చని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గంటల వ్యవధిలోనే తల్లీకొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

రోడ్డు ప్రమాదంలో..

అటు, ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేట మండలం గరికపాడు జాతీయ రహదారిపై ఉన్న వంతెనపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. విజయవాడ - హైదరాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఇటీవల వచ్చిన వరదలకు గరికపాడు వంతెన దెబ్బతింది. ఈ క్రమంలో పోలీసులు వన్ వే ఏర్పాటు చేశారు. ఈ రహదారిలో ఎదురెదురుగా వస్తోన్న రెండు కార్లు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు, పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మొండికట్ట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. టాటా ఏస్ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టగా.. అది ఎదురుగా వస్తోన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వినుకొండ, నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఈతకు వెళ్లి విద్యార్థులు

అటు, కృష్ణా జిల్లాలో క్వారీ గుంతల్లో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. గన్నవరం మండలం మాదలవారిగూడెంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లారు. గుంతలు లోతుగా ఉండడాన్ని గమనించిన విద్యార్థులు నీటిలో దిగారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నీటిలో పడి తిరువూరుకు చెందిన దుర్గాప్రసాద్, హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్ రాజు అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Konaseema Crime News: దళిత యువకుడి హత్యకేసులో ఏ1గా వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Splendor Siddha Reddy Arrest: అతడి పేరు సిద్ధారెడ్డి..స్ప్లెండర్ సిద్ధారెడ్డి.. స్ప్లెండర్ బైకుల్ని మాత్రమే మాయం చేస్తాడు !
అతడి పేరు సిద్ధారెడ్డి..స్ప్లెండర్ సిద్ధారెడ్డి.. స్ప్లెండర్ బైకుల్ని మాత్రమే మాయం చేస్తాడు !
Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
Gade Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget