అన్వేషించండి

Hyderabad Crime News: నరికి, తుపాకీతో కాల్చి.. హైదరాబాద్ లో రియల్టర్ దారుణహత్య.. పట్టపగలే నడిరోడ్డుపై ఘాతుకం

హైదరాబాద్ లో పట్టపగలు దారుణ హత్య సంచలనంగా మారింది. అందరూ చూస్తుండగానే కాల్పుల మోత జనాలను హడలెత్తించింది. కళ్ల ముందే కత్తులతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రాణాలు తీశారు.

మేడ్చెల్ జిల్లా , జవహార్ నగర్ పీఎస్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకట రత్నం అత్యంత కిరాతకంగా హత్యకు గురైయ్యారు. సాకేత్ కాలనీలో పోస్టల్ బిల్లా బాంగ్ స్కూల్ వద్ద తన కూతురుని యాక్టీవా బైక్ పై దింపి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  స్కూల్ లో పాపను దించి అలా స్కూల్ దాటిన  కొద్ది క్షణాల్లో తండ్రి వెంకట రత్నం ప్రాణాలు తీసారు. పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా స్కూల్ సమీపంలో మాటువేసిన దుండగులు , వెంకటరత్నం బైక్ ను వెంబడించారు. ఆటోలో నలుగురు, బైక్ పై మరో ఇద్దరు ఫాలో అవుతూ వచ్చారు. స్కూల్ దాటిన కొద్ది సేపటికే ముందుగా బైక్ పై ఉన్న దుండగులు వెంకటరత్నంపై తుపాకీతో కాల్పులు జరిపారు.

కాల్పుల దాటికి బైక్ పై నుండి క్రింద పడిన వెంకటరత్నంపై వెంటనే  ఆటోలో వచ్చిన నలుగురు దుండగలు, తమ వెంట తెచ్చుకున్న కత్తులతో అత్యంత కిరాతంగా నరికి చంపారు.నడి రోడ్డుపై చుట్టూ జనసంచారం ఉండగానే  రియల్టర్ హత్యకు గురుకావడంతో స్దానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హత్యను అడ్డుకునే సహాసం ఎవరూ చేయలేకపోయారు. కత్తిపోట్లకు వెంకటరత్నం ప్రాణాలు కోల్పోయాడని నిర్దారించుకున్న  తరువాత ఆటోలో అక్కడి పరారైయ్యారు నిందితులు..

హత్య వెనుక కారణాలివేనా..

రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటరత్నం హత్య జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా విజువల్స్ సేకరించిన పోలీసులు , నిందితులు వచ్చిన ఆటో, బైక్ లను గుర్తించారు. హత్య జరిగిన తీరును పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గతంలో దూల్ పేట్ లో మృతుడు వెంకటరత్నంపై జంట హత్యల కేసులో పలు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా దూల్ పేటలో జరిగిన  కొన్ని గొడవల కారణంగా రౌడీ షీట్ నమోదైయ్యింది. ఈ నేపథ్యంలో పాత కక్షలే రియల్టర్ ప్రాణాలు తీశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో ధూల్ పేట్ లో జంట హత్యల కేసులో వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గురైన వారి బంధువులు, స్నేహితుల సమాచారంపై కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉంటే వెంకటరత్నం హత్య విషయం తెలుసుకున్న బంధులు ఘటనాస్దలం వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్న ఘటన అందరికీ కలచివేసింది. బిడ్డను స్కూల్ కు పంపిన కొద్ది క్షణాల్లోనే తండ్రి విగతజీవిగా మారడంతో తీవ్ర విషాదం నెలకొంది. 

ఇటీవల కాలంలో గన్ కల్చర్ హైదరాబాద్ నగరంలో విపరీతంగా పెరిగిపోయింది. పట్టపగలు నాటు తుపాకీతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పగబడితే చాలు కత్తులతో జనసందోహం మధ్యలోనే దారుణంగా ప్రాణాలు తీస్తున్నారు. జవహార్ నగర్ లో రియల్టర్ హత్యను సీరియస్ గా తీసుకున్న పోలీసులు తుపాకీ ఎలా లభించింది, ఎప్పటి నుండి హత్యకు ప్లాన్ చేసుకున్నారు. పాత కక్షలు కాకుండా మరేఇతర కారణాలున్నాయా అనే కోణం కూడా విచారణ చేపట్టారు.సీసీ కెమెారాలో హత్య జరిగిన తీరు ,ఆధారాలను పరిశీలిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget