అన్వేషించండి

Kuppam Crime: కుప్పంలో విషాదం, అంత్యక్రియల్లో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కుప్పం నియోజకవర్గంలో అంత్యక్రియలకు హాజరైన వారిపై విద్యుత్ తీగలు తెగి పడటంతో ముగ్గురు మృతి చెందారు.

Kuppam People dies with electrocuted while attends Funeral: చిత్తూరు : కుప్పం నియోజకవర్గంలోని తంబిగానిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. దహన సంస్కారాలకు వెళ్లిన వారు విద్యుత్ ఘాతుకానికి గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. విద్యుత్ తీగలు ఒక్కసారిగా వీరి మీద పడటంతో ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన మహిళ నిన్న రాత్రి చనిపోయింది. నిన్న మృతి చెందిన రాణెమ్మ అనే మహిళ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో తంబిగానిపల్లి ఎస్సీ కాలనీలో రాణెమ్మ పాడే మోస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తగిలాయి. పాడే మోస్తున్న మునెప్ప, తిరుపతిరావు, రవీంద్రలకు విద్యుత్ షాక్ తగలడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు.
కుటుంబసభ్యులు, బంధువులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పరీక్సించిన వైద్యులు ఆ ముగ్గురు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మాట్లాడుతూ.. రాణెమ్మ అంత్యక్రియల కోసం ఇనుముతో పాడె తయారు చేశారు. ఆమె పాడె మోస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. అసలే ఇనుము కావడంతో ఒక్కసారిగా కరెంట్ కొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. 

Kuppam Crime: కుప్పంలో విషాదం, అంత్యక్రియల్లో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

లైన్ మెన్, అధికారుల నిర్లక్ష్యమే కారణం..!
బాధితుల కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. లైన్ మెన్, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లైన్ మెన్ అధికారులకు సమాచారం అందించి వైర్లను పైకి కట్టించలేదని, దాని వల్ల ప్రాణ నష్టం జరిగిందన్నారు. చిన్న వయసు ఉన్న వాళ్లు, చిన్న పాప ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

‘విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్లే ముగ్గురి ప్రాణాలు పోయాయి. అధికారులకు గతంలోనే సమాచారం అందించినా పట్టించుకోని కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అధికారుల నిర్లక్ష్యంగానే దుర్ఘటన జరిగింది. సత్వరమే స్పందించి తమకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఉద్యమం చేసేందుకైనా వెనకాడమని’ బాధిత కుటుంబాలకు చెందిన ఒకరు అన్నారు.

Kuppam Crime: కుప్పంలో విషాదం, అంత్యక్రియల్లో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IAS groom turns Fake: ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
ఐఏఎస్ అని నమ్మించి మూడో పెళ్లి.. భార్యను అమ్మేందుకు ప్లాన్.. చివరకు దొరికిపోయాడు ఇలా!
UP Man Killed By Lover: ఇద్దరు భార్యలు 18 మంది పిల్లలున్నా వివాహేతర బంధం - అదే ప్రాణం తీసింది !
ఇద్దరు భార్యలు 18 మంది పిల్లలున్నా వివాహేతర బంధం - అదే ప్రాణం తీసింది !
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Air Canada Express Plane Crash: న్యూయార్క్ లోని ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. రన్‌వే పై ట్రక్కును ఢీకొన్న ఎయిర్ కెనడా విమానం
న్యూయార్క్ లోని ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. రన్‌వే పై ట్రక్కును ఢీకొన్న ఎయిర్ కెనడా విమానం

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget