అన్వేషించండి

Kuppam Crime: కుప్పంలో విషాదం, అంత్యక్రియల్లో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కుప్పం నియోజకవర్గంలో అంత్యక్రియలకు హాజరైన వారిపై విద్యుత్ తీగలు తెగి పడటంతో ముగ్గురు మృతి చెందారు.

Kuppam People dies with electrocuted while attends Funeral: చిత్తూరు : కుప్పం నియోజకవర్గంలోని తంబిగానిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. దహన సంస్కారాలకు వెళ్లిన వారు విద్యుత్ ఘాతుకానికి గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దహన సంస్కారాల కోసం శ్మశాన వాటికకు తీసుకెళ్తున్న సమయంలో ఘటన జరిగింది. విద్యుత్ తీగలు ఒక్కసారిగా వీరి మీద పడటంతో ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన మహిళ నిన్న రాత్రి చనిపోయింది. నిన్న మృతి చెందిన రాణెమ్మ అనే మహిళ అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో తంబిగానిపల్లి ఎస్సీ కాలనీలో రాణెమ్మ పాడే మోస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తగిలాయి. పాడే మోస్తున్న మునెప్ప, తిరుపతిరావు, రవీంద్రలకు విద్యుత్ షాక్ తగలడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు.
కుటుంబసభ్యులు, బంధువులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పరీక్సించిన వైద్యులు ఆ ముగ్గురు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు మాట్లాడుతూ.. రాణెమ్మ అంత్యక్రియల కోసం ఇనుముతో పాడె తయారు చేశారు. ఆమె పాడె మోస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. అసలే ఇనుము కావడంతో ఒక్కసారిగా కరెంట్ కొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. 

Kuppam Crime: కుప్పంలో విషాదం, అంత్యక్రియల్లో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

లైన్ మెన్, అధికారుల నిర్లక్ష్యమే కారణం..!
బాధితుల కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. లైన్ మెన్, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లైన్ మెన్ అధికారులకు సమాచారం అందించి వైర్లను పైకి కట్టించలేదని, దాని వల్ల ప్రాణ నష్టం జరిగిందన్నారు. చిన్న వయసు ఉన్న వాళ్లు, చిన్న పాప ఉన్నవాళ్లు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

‘విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్లే ముగ్గురి ప్రాణాలు పోయాయి. అధికారులకు గతంలోనే సమాచారం అందించినా పట్టించుకోని కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అధికారుల నిర్లక్ష్యంగానే దుర్ఘటన జరిగింది. సత్వరమే స్పందించి తమకు న్యాయం చేయాలని లేనిపక్షంలో ఉద్యమం చేసేందుకైనా వెనకాడమని’ బాధిత కుటుంబాలకు చెందిన ఒకరు అన్నారు.

Kuppam Crime: కుప్పంలో విషాదం, అంత్యక్రియల్లో కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి

 

టాప్ హెడ్ లైన్స్

Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Mohali Woman Stabbed to Death: ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
ప్రేమించలేదని ఆఫీసులోనే నరికేశాడు రాక్షసుడు - పంజాబ్‌లో ఘోరం
Bolla Brahma Naidu Arrest: గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!
గండిపేట భూకబ్జా కేసు - వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కాంచీపురంలో అరెస్ట్!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Kalvakuntla Kavitha: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే- కవిత సంచలన వ్యాఖ్యలు
IND VS AFG 1st Test Day 1 Update: తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
తొలి టెస్టులో ప‌రుగుల పండుగ.. సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా, రాణించిన సుద‌ర్శ‌న్, పంత్, తేలిపోయిన ఆఫ్గాన్ బౌల‌ర్లు
Andhra Pradesh Rains: ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ.. ఇక వర్షాలకు వేళాయే.. ఎండల నుంచి ఉపశమనం
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Ram Charan OTT Movies : పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
పెద్ది గాడి టాప్ 7 యాక్షన్ మూవీస్ - ఈ ఓటీటీల్లో ఇప్పుడే చూసెయ్యండి
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Embed widget