అన్వేషించండి

Crime News: భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్ - 45 రోజుల తరువాత వీడిన ట్రిపుల్ మర్డర్ మిస్టరీ

Khammam Triple murder Case : జీవితాంతం తోడు ఉండాల్సిన భర్తే తన భార్యను హత మార్చేశాడు. ఆలనా పాలనా చూడాల్సిన తండ్రే కాలేయముడుగా మారాడు. భార్య, ఇద్దరు పిల్లలను వైద్యుడు హతమార్చాడు.

Husband Killed Wife And Two Children :  కట్టుకున్న భర్తే కాల యముడిగా మారాడు. జీవితాంతం గుండెలపై పెట్టుకుని పెంచాల్సిన తండ్రే బిడ్డల గొంతు నులిమేశాడు. ప్రాణాలు పోసే వైద్యుడే కర్కోటకుడిగా మారి భార్య, ఇద్దరి పిల్లలను హతమార్చేశాడు. తన చేతులతోనే చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆఖరికి శవ పరీక్ష నిర్వహించడంతో హత్య వ్యవహారం బయటపడింది.

అసలేం జరిగిందంటే..
ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలంలో రెండు నెలలు కిందట తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన వ్యవహారం మిస్టరీగా మారింది. ఈ మృతిపై అనేక అనుమానాలు నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి శవ పరీక్ష నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వీరిని ఆమె భర్త బోడా ప్రవీణ్‌ కుమార్‌ హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్టు పోలీసులు నిర్ధారించారు. 45 రోజులు తరువాత నిర్వహించిన శవ పరీక్షలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విషం కలిపిన ఇంజెక్షన్‌ ఇచ్చి భార్యను సదరు వైద్యుడు హత్య చేశాడు. ఇదే విషయం పోస్టుమార్టం రిపోర్ట్‌లో వెల్లడైంది. 
ఈ ఏడాది మే 28న బాబోజీ తండాకు చెందిన డాక్టర్‌ బోడా ప్రవీణ్‌, తన భార్య కుమారి (25), కుమార్తె కృషిక (4), తనిష్క(3)తో కలిసి కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. కారుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. అనంతరం రహదారిపై వెళ్తున్నవారు కారులోని వారిని బయటకు తీసి అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. అప్పటికే కృషిక, తనిష్క మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో సిబ్బంది సహాయంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కుమారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

కుటుంబ సభ్యుల ఆందోళన 
ఈ ప్రమాద ఘటనలో ప్రవీణ్‌కు స్వల్ప గాయాలు కావడంతో అతని బంధువుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముందు ప్రవీణ్‌ ను బంధువులే ఆటోలో మరో ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం, వారి శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడం, ప్రవీణ్‌కు మాత్రం స్వల్ప గాయాలు కావడంతో కుమారి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. భర్త ప్రవీణే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడాని మృతిరాలి బంధువులు ఆరోపించారు. కుమారి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టరు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటన జరిగిన రోజు పోలీసులు కారును తనిఖీ చేశారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులకు ఖాళీ సిరంజి కారులో దొరికింది. 

ఆ సిరంజీని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించగా విషం కలిపిన ఇంజెక్షన్‌ ఇచ్చినట్టు తేలింది. దీంతో పోలీసులు అనుమానం మరింత రెట్టింపు అయింది. వెంటనే ప్రవీణ్‌ సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని పోలీసులు తనిఖీ చేయగా అందులో కూడా కీలక ఆధారం పోలీసులకు లభ్యమైంది. అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్‌ ఇస్తే ఎన్ని గంటల్లో చనిపోతారనే విషయాలను ప్రవీణ్‌ గూగుల్‌లో సెర్చ్‌ చేసినట్టు తేలింది. పోస్టుమార్టం నివేదిక, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఆధారంగా నిందితుడిపై హత్యకేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Koushik reddy vs Bandru Shobharani | పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ | ABP DesamPrakasam barrage boats Cutting | ప్రకాశం బ్యారేజ్ లో పడవలు తొలగిస్తున్న నిపుణుల బృందం | ABP DesamChiranjeevi Fan Eswar Royal Interview | ఒక అభిమానిని చిరంజీవి ఇంటికి ఎందుకు పిలిచారంటే.! | ABP DesamAdilabad 52Ft Ganesh Idol | ఆదిలాబాద్ లో కొలువు తీరిన 52అడుగుల మహాగణపతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
ఇన్సూరెన్స్‌ కంపెనీల వద్దకు విజయవాడ వరద బాధితుల క్యూ- బీమా సంస్థల కొర్రీలపై ప్రజల అసహనం
Telangana Cabinet :  తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ - రేవంత్ అనుకున్న వారికే పదవులు ఇవ్వగలరా ?
Chandrababu :  చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ?  కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
చంద్రబాబుకు క్లీన్‌చిట్‌లు రాజకీయ ప్రత్యర్థులే ఇప్పిస్తున్నారా ? కేసులు, పిటిషన్లలో తప్పులు చూపించలేకపోతున్నారా ?
Ayushman Bharat: కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
కేంద్ర కేబినెట్ గుడ్‌న్యూస్ - ఇక సీనియర్ సిటిజన్స్‌కూ ఆయుష్మాన్ భారత్
Devara Censor Report: దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
దేవర 3 గంటల పండగ, వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్
Brahmamudi Kavya: బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
బిగ్ బాస్ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ... ట్రోల్ అయ్యాక తీరిగ్గా క్షమాపణలా?
AP Floods Donation: వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
వరద బాధితులకు భారీ విరాళాలు, నేడు అత్యధికంగా రూ. 10.61 కోట్ల చెక్కు చంద్రబాబుకు అందజేత
Padi Kaushik Reddy : చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
చీర, గాజులు చూపించిన కౌశిక్ రెడ్డి - చెప్పు చూపించిన కాంగ్రెస్ మహిళా నేతలు - ఏం జరిగిందంటే ?
Embed widget