అన్వేషించండి

Khammam Crime News: ఖమ్మంలో దారుణం - పుట్టింటికి వెళ్లిన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

Khammam Crime News: భర్త, అత్తమామలతో గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిపోయిన ఓ భార్యపై భర్త దారుణానికి తెగబడ్డాడు. పెట్రోల్ పోసి మరీ నిప్పంటించాడు. 

Khammam Crime News: పెళ్లయిన కొద్ది రోజుల నుంచి ఆ దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. భర్తతో పాటు అత్తామామలు కూడా వేధించారు. అత్తింట్లో వేధింపులు భరించలేక ఆమె పుట్టింటికి వచ్చింది. సర్దిచెప్పి మళ్లీ అత్తారింటికి పంపారు. అయినా వారి వేధింపులు ఆగకపోవడంతో మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ క్రమంలోనే భార్యపై విపరీతమైన కోపం పెంచుకున్న భర్త.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం జరిగింది. 

అసలేం జరిగిందంటే..?

ఖమ్మం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కు చెందిన 24 ఏళ్ల లకావత్ స్నేహకు మహబూబాబాద్ జిల్లా గార్లల మండలం పోచారానికి చెందిన శ్రీధర్ తో 2021లో పెళ్లి జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. కొద్ది నెలల క్రితమే స్నేహ పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో పెద్ద మనుషుల పంచాయితీ పెట్టించి.. కూతురికి సర్ది చెప్పారు. మళ్లీ అత్తారింటికి పంపించారు. అక్కడకు వెళ్లిన తర్వాత కూడా భర్త, అత్త మామల్లో ఎలాంటి మార్పూ రాలేదు. వారు తీవ్రంగా వేధిస్తుండడంతో స్నేహ మూడు నెలల క్రితం మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుంచి ఆమె ఇక్కేడ ఉంటోంది. ఈక్రమంలోనే శనివారం శ్రీధర్ విద్యానగర్ కు వచ్చాడు. అయితే ఆ సయమంలో ఇంట్లో భార్య స్నేహ, ఆమె చెల్లెలు నేహా, తమ్ముడు డేవిడ్ ఉన్నారు. 

ఇంటికి వచ్చిన భర్త అన్నం పెట్టమని అడగడంతో.. స్నేహ ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలో తన వెంట సీసాలో తెచ్చుకున్న పెట్రోల్ ను శ్రీధర్ తన భార్యపై చల్లి నిప్పంటించాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది గమనించిన బాధితురాలి చెల్లెలు వెంటనే జరిగినదంతా తల్లిదండ్రులకు ఫోన్ లో చెప్పింది. వారు వెంటనే వచ్చి కుమార్తెను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అప్పటికే స్నేహకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుందని, పరిస్థితి విషమంగా ఉందని స్నేహ తండ్రి సైదులు చెబుతున్నారు. ఈక్రమంలోనే చుంచుపల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వారం రోజుల క్రితం కన్నకూతురిని నరికి చంపిన తండ్రి

వారం రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతురిని అతి కిరాతకంగా తండ్రి నరికి చంపిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, మంథని మండలం భట్టుపల్లి గ్రామంలో పదేళ్ల వయసుున్న కన్న కూతురు రజితను తండ్రి గుండ్ల సదయ్య గొడ్డలితో నరికి చంపాడు. అయితే, గత కొంత కాలంగా సదయ్య మానసిక స్థితి సరిగా ఉండట్లేదు. ఈ క్రమంలోనే గ్రామంలో జనాలపై తరచుగా దాడులు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. కూతురిని చంపిన తర్వాత అదే గ్రామానికి మరో వ్యక్తి.. దూపం శ్రీనివాస్ పై కూడా సదయ్య దాడికి చేశాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.