అన్వేషించండి

Kerala News: కేరళలో అదృశ్యమైన మహిళ, 15 ఏళ్ల తర్వాత అసలు విషయం చెప్పిన పోలీసులు

Mannar Missing Case : కాలా భర్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని కేరళ పోలీసులు ధృవీకరించారు. ఆమెను దాచి ఉంచినట్లు భావిస్తున్న ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో సోదాలు చేయగా కాలా అవశేషాలు బయటపడ్డాయి.

Kerala News : కేరళలోని మన్నార్‌లో 15 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిళ మృతదేహం కోసం వెతుకులాటలో పోలీసులు పురోగతి సాధించారు. మన్నార్‌లో 15 ఏళ్ల కిందట కాలా అనే మహిళ అదృశ్యం అయింది. మహిళ మృతదేహం కోసం చేస్తున్న అన్వేషణలో కొత్త ముందడుగు పడింది. కాలాను దాచి ఉంచినట్లు భావిస్తున్న ఇరమత్తూరులోని ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో సోదాలు చేయగా ఆమె అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు.  ప్రస్తుతం కేసులో సమగ్ర విచారణ కొనసాగుతోంది. ఐదుగురు వ్యక్తులు మహిళను హత్య చేసి మృతదేహాన్ని పాతిపెట్టినట్లు రెండు నెలల క్రితం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కాలా భర్త బావమరిది సహా నలుగురిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ ప్రారంభించారు. 

కాలా భర్తే కీచకుడు
కాలా భర్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని  కేరళ పోలీసులు ధృవీకరించారు. అయితే, ఆమె కొడుకు ఈ వాదనలను తిరస్కరించాడు. తన తల్లి కాలా ఇంకా అతని తల్లి కాలా ఇంకా బతికే ఉందని గట్టిగా వాదించాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో ఉన్న తన తండ్రి అనిల్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు.  ఈ ఆరోపణలు తమ కుటుంబానికి అవమానకరమని..  15 ఏళ్ల క్రితం ఏమీ జరగలేదని కొడుకు మీడియాతో తెలిపాడు. కొన్నాళ్ల క్రితం ఇంటి నుంచి కనిపించకుండా పోయిన తన తల్లి నుంచి ఎలాంటి సమాచారం లేదని.. అలాగని హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదన్నారు.

తన తండ్రిని సంప్రదించారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కొత్తగా జరుగుతున్న సంగతుల పట్ల అందోళన చెందవద్దని సూచించినట్లు కాలా కొడుకు తెలిపారు. అప్పుల కారణంగానే తిరిగి రాలేకపోతున్నట్లు  అనిల్ తన కుమారుడికి చెప్పినట్లు తెలుస్తోంది. 2009లో చివరిసారిగా  కనిపించకుండా పోయిన కాలా కేసు దర్యాప్తు చేస్తున్నందున తిరిగి రావాలని అనిల్‌ను పోలీసులు కోరారు. తాను పాలక్కాడ్‌లో మరో వ్యక్తితో కలిసి జీవిస్తున్నానని కాలా తనతో చెప్పిందని, ఇప్పటివరకు ఆమె సజీవంగా ఉందని నమ్ముతున్నట్లు ఆమె తరఫు బంధువులు పేర్కొన్నారు. 

ఏడు గంటల పాటు శోధన 
 కాలాను అనిల్ హత్య చేసి తన ఇంటిలోని సెప్టిక్ ట్యాంక్‌లో పాతిపెట్టాడని ఓ లేఖ  కొన్ని నెలల క్రితం పోలీసులకు అందడంతో కేసు మళ్లీ రీఓపెన్ అయింది.   20 ఏళ్ల వయసులో అలప్పుజాలోని మన్నార్‌లోని అనిల్ ఇంటి నుంచి కాలా అదృశ్యమైందని, ఆమె చనిపోయిందని మంగళవారం పోలీసులు తెలిపారు. అనిల్ ఇంటి వద్ద ఉన్న రెండు సెప్టిక్ ట్యాంకులతో ఏడు గంటలపాటు జరిపిన తనిఖీల్లో  కొన్ని ఆధారాలు లభించిన తర్వాతే పోలీసులు ఆమె చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో అనిల్‌పై కేసు నమోదు చేసినట్లు అలప్పుజా పోలీస్ సూపరింటెండెంట్ చైత్ర థెరిసా జాన్ తెలిపారు. మంగళవారం సెప్టిక్ ట్యాంక్‌ల నుండి కీలకమైన సాక్ష్యాలను సేకరించడంలో పోలీసులకు సహకరించిన సోమన్ అనే కార్మికుడు లోపల ఏదో రసాయనం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసినట్లు ప్రముఖ మీడియా నివేదించింది.   

ఎముకలు కరిగే రసాయనం 
‘‘ కొన్నేళ్లుగా నేను సెప్టిక్ ట్యాంక్ సంబంధిత పనులు చేస్తున్నాను. కాబట్టి ట్యాంక్‌లోకి దిగగానే అందులో ఏదైనా రసాయనాలు పోస్తే వెంటనే నాకు తెలిసిపోతుంది. దీనిలో రాళ్లు, మనుషుల ఎముకలను కూడా పౌడర్ చేసే రసాయనం పోశారు " అని కార్మికుడు సోమన్ మీడియాతో చెప్పుకొచ్చారు.  స్వాధీనం చేసుకున్న వాటిలో అనుమానాస్పద మానవ ఎముకలు, లాకెట్, హెయిర్ క్లిప్, డ్రస్ లకు సంబంధించిన ఎలాస్టిక్  ఉన్నాయని సోమన్ చెప్పారు. వీటిని పోలీసులకు అప్పగించారు.  కాలా సోదరుడు, ఆటో డ్రైవర్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన విషయాలు దిగ్భ్రాంతికి గురిచేశాయన్నారు. ఎన్నడూ అనిల్ పై తనకు ఎప్పుడూ సందేహం రాలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఐదుగురు వ్యక్తులు పోలీసు కస్టడీలో ఉన్నారు. వారి అరెస్టులను త్వరలో నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

రెండో పెళ్లి చేసుకున్న అనిల్
 అనిల్ 15 ఏళ్ల క్రితం మిస్సింగ్‌పై ఫిర్యాదు చేసినా ప్రాథమిక విచారణలో ఎలాంటి క్లూ లభించలేదు. కాలా తల్లిదండ్రులు అప్పటికే చనిపోయారు. ఆమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు, కానీ వారు కూడా ఫిర్యాదు చేయలేదు. ఇంతలో అనిల్ రెండో పెళ్లి చేసుకున్నాడు. చాలా ఏళ్లుగా కాలా గురించి ఎలాంటి సమాచారం లేదు. అనిల్, కాలా దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. అనిల్‌కి రెండో పెళ్లితో మరో ఇద్దరు పిల్లలు కలిగారు. నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అనిల్‌ రెండు నెలల క్రితం ఇజ్రాయెల్‌ వెళ్లాడు. ఈ కేసులో ఐదో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగించగా, ఐదో నిందితుడి ఆచూకీ లభించలేదు. మహిళను హత్య చేసి ఆమె మృతదేహాన్ని మన్నార్‌లో ఆమె నివసించే స్థలంలో పాతిపెట్టినట్లు సమాచారం. దీని ఆధారంగా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget