అన్వేషించండి

Crime News: కడపలో కన్నీళ్లు పెట్టించే ఘటన- కరెంట్ వైర్లు తగిలి బాలుడి మృతి, మరొకరి పరిస్థితి విషమం

Andhra Pradesh Crime News | కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సైకిల్ పై వెళ్తుండగా కరెంట్ వైర్లు తగిలి, ఓ విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థి చికిత్స పొందుతున్నాడు.

Kadapa Tragedy | కడప: కడప జిల్లా కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్ కు గురై ఓ బాలుడు మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప నగరంలోని అగాడివీధిలో టైటానిక్ బిల్డింగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది. 

కడపలోని అగాడివీధిలో ఓ సైకిల్ పై తన్వీర్‌, ఆదాం అనే పదేళ్ల విద్యార్థులు వెళ్తున్నారు. టైటానిక్ బిల్డింగ్ వద్దకు రాగానే కరెంట్ తీగలు తగలడంతో వీరు సైకిల్ పైనుంచి పడిపోయారు. వెనుక వచ్చిన బైకు మీద నుంచి ఓ వ్యక్తి దిగి, వీరికి సహాయం చేసేందుకు ప్రయత్నించాడు. కానీ సెకన్ల వ్యవధిలోనే విద్యుత్ తీగలు సైకిల్ ను తాకి ఉండటంతో నిప్పు రవ్వలు వచ్చాయి. ఇద్దరికి తీవ్ర కాలిన గాయాలు కాగా, వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఓ బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మరో బాలుడైనా ప్రాణాలతో బయటపడాలని స్థానికులు కోరుకుంటున్నారు. 

కరెంట్ షాక్ తో విద్యార్థి మృతిచెందడంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారణ వ్యక్తం చేశారు. మరో బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనపై పోలీసులు, అధికారులను ఆమె ఆరా తీశారు. తీవ్ర గాయాలైన మరో బాలుడికి ఉచితంగా వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. డిష్ వైర్లు, కరెంట్ వైర్లు కిందకు వేలాడుతున్నాయని ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో సైకిల్ మీద వెళ్తున్న ఓ విద్యార్థి కరెంట్ షాక్ తో చనిపోగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
యమహా R2 నుంచి ఎలక్ట్రిక్‌ ఏరోక్స్‌ వరకు - 2026లో లాంచ్‌ కానున్న యమహా బైక్స్‌, స్కూటర్లు ఇవే
2026లో య'మహా' ప్లాన్‌ - రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, కొత్త R2 స్పోర్ట్‌ బైక్‌ రెడీ
Telangana Cabinet Decisions: మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికలకు ఆమోదం.. తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే
Revanth Reddy: హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
హార్వర్డ్‌ విద్యార్థిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో లీడర్‌షిప్‌పై కోర్స్‌
Champion OTT : ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'ఛాంపియన్' వచ్చేస్తున్నాడు - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget