అన్వేషించండి

Selfie Video Viral: మైదుకూరు సీఐ బెదిరిస్తున్నారు... కుటుంబంతో సహా సూసైడ్ చేసుకుంటానని సెల్ఫీ వీడియో... ఘటనపై స్పందించిన సీఎం

నంద్యాలలో సలాం కుటుంబంతో ఆత్మహత్య ఘటన మరవక ముందే మరో సెల్ఫీ వీడియో కలకలంరేపుతోంది. తన భూమి ఆక్రమించుకున్నారని పోలీసుల దగ్గరికి వెళితే ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

నంద్యాలలో సలాం కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరవక ముందే ఇంకో ఘటన వెలుగులోకి వచ్చింది. తన భూమి ఆక్రమించుకున్నారని పోలీసుల దగ్గరికి వెళితే వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో పెట్టారు. పోలీసులు ఎన్ కౌంటర్ కన్నా ముందే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని అంటున్నాడు. 

వైసీపీ నేతతో భూవివాదం 

కడప జిల్లా మైదుకూరు రూరల్ సీఐ, డీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ల నుండి ప్రాణహాని ఉందని అక్బర్ బాషా అనే వ్యక్తి పెట్టిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఆయన సెల్ఫీ వీడియోలో తెలిపారు. దువ్వూరు మండలానికి చెందిన ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డితో జరుగుతున్న  భూవివాదంలో మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని  అక్బర్ బాషా ఆరోపించారు. తనకు న్యాయం చేయక పోగా స్టేషన్ లోనే ఎన్ కౌంటర్ చేస్తానని సీఐ కొండారెడ్డి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 

సీఎం స్పందించాలని వినతి

కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామానికి చెందిన మిద్దె అక్బర్ బాషకు దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామంలో దాన విక్రయం కిందట ఎకరం పొలం  రిజిస్టర్ చేయించుకున్నాడు. కానీ రెండు సంవత్సరాల క్రితం జోన్నవరం  రామలక్ష్మి రెడ్డి అనే వ్యక్తికి అదే పొలాన్ని అక్బర్ అత్త అమ్మడంతో వ్యవహారం కోర్టుకెక్కింది. ఈ కేసు విత్ డ్రా చేసుకోమని సీఐ కొండారెడ్డి, ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి తమను బెదిరిస్తున్నారని అక్బర్ ఆరోపిస్తున్నారు. కేసు వెనక్కి తీసుకోకపోతే తన కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కలగజేసుకుని 48 గంటల్లో తమకు న్యాయం చేయకుంటే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని అక్బర్ భాష ఇంటర్ నెట్ లో సెల్ఫీ వీడియో  పెట్టారు. 

చంద్రబాబు ట్వీట్ 

ఈ సెల్ఫీ వీడియోపై చంద్రబాబు స్పందించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోజుకో దారుణ వార్త వినాల్సి వస్తోందని ఆరోపించారు. మైదుకూరులో  వైసీపీ నేత తిరుపాల్ రెడ్డి ముస్లిం మైనారిటీ అయిన అక్బర్ బాషా భూమిని కబ్జా చేసినట్టు తెలిసిందన్నారు. ఈ మధ్య కొందరు పోలీసులు తమ విధుల్ని పక్కనపెట్టి సివిల్ పంచాయితీల్లో తలదూర్చడం మామూలైపోయిందని విమర్శించారు.

వారంలో పరిష్కరించాలని సీఎం ఆదేశం

కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ మైనార్టీ కుటుంబం సోషల్‌ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియో ఘటనపై సీఎం జగన్‌ మోహన్ రెడ్డి స్పందించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో మాట్లాడినట్లు సమాచారం. వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. మైదుకూరు గ్రామీణ సీఐ వ్యవహారంపై విచారణ జరిపి వారంలోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూమికి సంబంధించి వారంలో కలెక్టర్‌ విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

రాత్రే స్పందించాం: ఎస్పీ 

అంతకముందు సెల్ఫీ వీడియో చేసిన అక్బర్‌ బాషా కుటుంబంతో ఎస్పీ మాట్లాడారు. బాధిత కుటుంబం, కడప వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. అక్బర్‌బాషా సెల్ఫీ వీడియోపై శుక్రవారం రాత్రి 11.20 గంటలకు స్పందించామని తెలిపారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో అక్బర్‌ పిటిషన్‌ ఇచ్చారు. సీఐ వ్యవహారంపై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించామని ఎస్పీ తెలిపారు. సీఐ కొండారెడ్డిని 2 రోజుల పాటు విధుల నుంచి తప్పించామన్నారు. భూవివాదం పరిష్కరించాలని సీఎంవో కూడా ఆదేశాలిచ్చిందని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. 

 

Also Read: AP Crime: కడప జిల్లాలో దారుణం.. మహిళలపై ఆగంతకుల దాడి.. బంగారు గొలుసుల అపహరణ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget