అన్వేషించండి

Hyderabad Crime News: చాంద్రాయణగుట్టలో దారుణం - వ్యక్తిని రాయితో కొట్టి హత్య చేసిన దుండగులు!

Hyderabad Crime News: హైదరాబాద్ చాంద్రాయాణగుట్టలో నివాసం ఉంటున్న కలీంఖాన్ ను మంగళవారం వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. రాళ్లతో మోది చంపారు. 

Hyderabad Crime News: హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో దారుణం జరిగింది. 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో మోది హత్య చేశారు. అతని ఇంటికే వెళ్లి అక్కడే చంపడం సంచలనంగా మారింది. అయితే ఘటనాస్థలంలో మతిస్థిమితం లేని మృతుడి సోదరి కూడా ఉన్నారు. 

అసలేం జరిగిందంటే..?

చాంద్రాయణగుట్ట ఇన్​ప్సెక్టర్​ ప్రసాద్​ వర్మ తెలిపిన వివరాల ప్రకారం ... పాతబస్తీ గుల్షన్​ ఇక్బాల్​ కాలనీకి చెందిన మొహమ్మద్​ కలీం ఖాన్​ (40) కు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఒక సోదరుడు ఆస్ట్రేలియాలో నివాసం ఉంటుండగా మరో ఇద్దరు సోదరులు రక్షాపురంలో ఉంటున్నారు. కలీంఖాన్​కు, అతని సోదరికి మతిస్థిమితం అంతంత మాత్రమే ఉండడంతో ఇద్దరు ఒకే దగ్గర పాతబడిన ఇంట్లో నివాసం ఉంటున్నారు. గంజాయికి అలవాటు పడ్డ కలీంఖాన్​ ఎలాంటి పనులు చేసేవాడు కాదు. మంగళవారం తెల్లవారు జామున సమయంలో కలీంఖాన్​ ను గుర్తు తెలియని వ్యక్తులు రాయితో కొట్టి హత్య చేశారు. సాయంత్రం సమయంలో స్థానికుల ద్వారా సమచారం అందుకున్న ఫలక్​నుమా ఏసీపీ షేక్​ జహంగీర్​, చాంద్రాయణగుట్ట ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ వర్మ తన బృందంతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు.

"చాంద్రాయణగుట్ట పరిధిలోని 40 ఏళ్ల వయసు ఉన్న కలీం ఖాన్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని సమాచారం ఇచ్చారు. ఈరోజు ఉదయం హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. దీని విషయంలో కేసు నమోదు చేసుకొని పరిశోధన చేస్తున్నాం. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎందువల్ల జరిగింది వంటివన్నీ కూడా పరిశోధన చేసిన తర్వాతే చెప్తాం. మాకు సమాచారం వచ్చింది కూడా సాయంత్రమే. క్లూస్ టీం వస్తది. దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన జరిపిస్తాం." - ప్రసాద్ వర్మ, చాంద్రాయణగుట్ట ఇన్ స్పెక్టర్ 

అతని ఇంట్లోనే రాయితో తలపై మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కలీంఖాన్​ ను ఎవరు, ఎందుకు హత్య చేశారు వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. గంజాయ్​ బ్యాచే ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాలుగు వందల కోసం గొడవ - లారీ కింద తోసేసి హత్య

క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ ఎక్కువ మాట్లాడుతుందని సవతి తండ్రి కూతురుని హత్య చేసిన ఘటన ఇటీవల జరిగింది. హైదరాబాద్ లో మరో ఘటన వెలుగుచూసింది. నాలుగు వందల కోసం హత్య చేశాడో వ్యక్తి. హైదరాబాద్ బాలానగర్ లో ఆ దారుణ హత్య జరిగింది. కూలీలుగా పని చేసే కాశీరాం, శ్రీనివాస్‌ల మధ్య డబ్బుల కోసం గొడవ జరిగింది. నర్సాపూర్ చౌరస్తా రోడ్డు పక్కన ఫుట్ పాత్‌పై వీళిద్దరూ గొడవపడ్డారు. ఈ గొడవ కాస్త పెద్దదై కాశీరాం, శ్రీనివాస్‌ను కర్రతో బలంగా కొట్టి, అటువైపు వెళ్తోన్న లారీ కిందకు తోసేశాడు. లారీ కిందపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget