అన్వేషించండి

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ స్టోరీస్ - ఓ చోట భార్యను రాడ్‌తో కొట్టి చంపిన భర్త, మరో చోట సూసైడ్ లెటర్ రాసి మరీ దంపతుల అదృశ్యం

Telangana News: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం దారుణాలు, ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చగా.. ఏపీలో దంపతులు అప్పులభారంతో అదృశ్యమయ్యారు.

Husband Killed His Wife In Nagarkurnool District: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన దంపతులు అప్పుల భారంతో సూసైడ్ లెటర్ రాసి మరీ అదృశ్యమయ్యారు. అటు, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను ఐరన్ రాడ్‌తో కొట్టి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాజు, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 17 ఏళ్ల క్రితం వివాహం కాగా ఓ కుమార్తె. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. జ్యోతిని రాజు అనుమానించేవాడు. గురువారం ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆగ్రహంతో ఊగిపోయిన రాజు ఆమెను అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయినా ఆగకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

భార్యను హత్య చేసిన అనంతరం రాజు నేరుగా తన కూతురితో కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సూసైడ్ లెటర్ రాసి..

'మేం ఎక్కువగా అప్పులు చేశాం. తీర్చలేక వెళ్లిపోతున్నాం. మా కోసం వెతకొద్దు.' అంటూ దంపతులు అదృశ్యమైన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన కొబ్బరి ఒలుపు కార్మికుడు యార్లగడ్డ దుర్గారావు, సుశీల దంపతులు గురువారం నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు దుర్గారావు తన సెల్ నుంచి పండు అనే వ్యక్తికి ఓ ఆడియో మెసేజ్ పంపినట్లు గుర్తించారు. మోటార్ సైకిల్ అంబాజీపేట కొబ్బరి గొడౌన్ వద్ద ఉందని.. తాళం కూడా అందులోనే పెట్టినట్లు దుర్గారావు అందులో చెప్పాడు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఓ సూసైడ్ లెటర్‌ను సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, వారు ఆత్మహత్య చేసుకున్నారా.? లేక అదృశ్యమయ్యారా.? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ప్రమాద ఘటనలు

ఏపీలోని కడప జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పులివెందుల - కదిరి మార్గంలో శుక్రవారం ఉదయం ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో పులివెందుల ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ఉన్న వారంతా సత్యసాయి జిల్లా బట్రెపల్లె వాసులుగా గుర్తించారు. వీరు కూలి పని కోసం పులివెందుల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో..

అటు, తెలంగాణలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ - రాయదుర్గం ఎఫ్‌డీడీఐ వద్ద నందిహిల్స్ నుంచి వేగంగా వచ్చిన కారు షేక్‌పేట్ ఫ్లై ఓవర్ పిల్లర్‌ను ఢీకొని నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న బీబీఏ విద్యార్థి చరణ్ (19) స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతను ఇక్ఫాయి యూనివర్శిటీలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget