అన్వేషించండి

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ స్టోరీస్ - ఓ చోట భార్యను రాడ్‌తో కొట్టి చంపిన భర్త, మరో చోట సూసైడ్ లెటర్ రాసి మరీ దంపతుల అదృశ్యం

Telangana News: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం దారుణాలు, ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చగా.. ఏపీలో దంపతులు అప్పులభారంతో అదృశ్యమయ్యారు.

Husband Killed His Wife In Nagarkurnool District: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన దంపతులు అప్పుల భారంతో సూసైడ్ లెటర్ రాసి మరీ అదృశ్యమయ్యారు. అటు, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను ఐరన్ రాడ్‌తో కొట్టి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాజు, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 17 ఏళ్ల క్రితం వివాహం కాగా ఓ కుమార్తె. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. జ్యోతిని రాజు అనుమానించేవాడు. గురువారం ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆగ్రహంతో ఊగిపోయిన రాజు ఆమెను అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయినా ఆగకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

భార్యను హత్య చేసిన అనంతరం రాజు నేరుగా తన కూతురితో కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సూసైడ్ లెటర్ రాసి..

'మేం ఎక్కువగా అప్పులు చేశాం. తీర్చలేక వెళ్లిపోతున్నాం. మా కోసం వెతకొద్దు.' అంటూ దంపతులు అదృశ్యమైన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన కొబ్బరి ఒలుపు కార్మికుడు యార్లగడ్డ దుర్గారావు, సుశీల దంపతులు గురువారం నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు దుర్గారావు తన సెల్ నుంచి పండు అనే వ్యక్తికి ఓ ఆడియో మెసేజ్ పంపినట్లు గుర్తించారు. మోటార్ సైకిల్ అంబాజీపేట కొబ్బరి గొడౌన్ వద్ద ఉందని.. తాళం కూడా అందులోనే పెట్టినట్లు దుర్గారావు అందులో చెప్పాడు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఓ సూసైడ్ లెటర్‌ను సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, వారు ఆత్మహత్య చేసుకున్నారా.? లేక అదృశ్యమయ్యారా.? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ప్రమాద ఘటనలు

ఏపీలోని కడప జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పులివెందుల - కదిరి మార్గంలో శుక్రవారం ఉదయం ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో పులివెందుల ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ఉన్న వారంతా సత్యసాయి జిల్లా బట్రెపల్లె వాసులుగా గుర్తించారు. వీరు కూలి పని కోసం పులివెందుల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో..

అటు, తెలంగాణలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ - రాయదుర్గం ఎఫ్‌డీడీఐ వద్ద నందిహిల్స్ నుంచి వేగంగా వచ్చిన కారు షేక్‌పేట్ ఫ్లై ఓవర్ పిల్లర్‌ను ఢీకొని నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న బీబీఏ విద్యార్థి చరణ్ (19) స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతను ఇక్ఫాయి యూనివర్శిటీలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget