అన్వేషించండి

Crime News: తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ స్టోరీస్ - ఓ చోట భార్యను రాడ్‌తో కొట్టి చంపిన భర్త, మరో చోట సూసైడ్ లెటర్ రాసి మరీ దంపతుల అదృశ్యం

Telangana News: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం దారుణాలు, ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హతమార్చగా.. ఏపీలో దంపతులు అప్పులభారంతో అదృశ్యమయ్యారు.

Husband Killed His Wife In Nagarkurnool District: తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకున్నాయి. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన దంపతులు అప్పుల భారంతో సూసైడ్ లెటర్ రాసి మరీ అదృశ్యమయ్యారు. అటు, తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను ఐరన్ రాడ్‌తో కొట్టి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం అగ్రికల్చర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాజు, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 17 ఏళ్ల క్రితం వివాహం కాగా ఓ కుమార్తె. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. జ్యోతిని రాజు అనుమానించేవాడు. గురువారం ఇదే విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ఆగ్రహంతో ఊగిపోయిన రాజు ఆమెను అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె కింద పడిపోయినా ఆగకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

భార్యను హత్య చేసిన అనంతరం రాజు నేరుగా తన కూతురితో కలిసి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సూసైడ్ లెటర్ రాసి..

'మేం ఎక్కువగా అప్పులు చేశాం. తీర్చలేక వెళ్లిపోతున్నాం. మా కోసం వెతకొద్దు.' అంటూ దంపతులు అదృశ్యమైన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామానికి చెందిన కొబ్బరి ఒలుపు కార్మికుడు యార్లగడ్డ దుర్గారావు, సుశీల దంపతులు గురువారం నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అమలాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు దుర్గారావు తన సెల్ నుంచి పండు అనే వ్యక్తికి ఓ ఆడియో మెసేజ్ పంపినట్లు గుర్తించారు. మోటార్ సైకిల్ అంబాజీపేట కొబ్బరి గొడౌన్ వద్ద ఉందని.. తాళం కూడా అందులోనే పెట్టినట్లు దుర్గారావు అందులో చెప్పాడు. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఓ సూసైడ్ లెటర్‌ను సైతం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే, వారు ఆత్మహత్య చేసుకున్నారా.? లేక అదృశ్యమయ్యారా.? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ప్రమాద ఘటనలు

ఏపీలోని కడప జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పులివెందుల - కదిరి మార్గంలో శుక్రవారం ఉదయం ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో పులివెందుల ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆటోలో ఉన్న వారంతా సత్యసాయి జిల్లా బట్రెపల్లె వాసులుగా గుర్తించారు. వీరు కూలి పని కోసం పులివెందుల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో..

అటు, తెలంగాణలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ - రాయదుర్గం ఎఫ్‌డీడీఐ వద్ద నందిహిల్స్ నుంచి వేగంగా వచ్చిన కారు షేక్‌పేట్ ఫ్లై ఓవర్ పిల్లర్‌ను ఢీకొని నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న బీబీఏ విద్యార్థి చరణ్ (19) స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. అతను ఇక్ఫాయి యూనివర్శిటీలో చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget