అన్వేషించండి

Software Engineer Died: అమెరికాలో గుంటూరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి, ఔటింగ్‌కు వెళ్లడంతో తీవ్ర విషాదం

Software Engineer Died: గుంటూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్రీనాథ్ అమెరికాలో మృతి చెందారు. అయితే భార్యాభర్తలిద్దరూ ట్రెక్కింగ్ కోసం వెళ్లగా ప్రమాదవశాత్తు 200 అడుగుల ఎత్తు నుంచి పడి చనిపోయాడు.

Software Engineer Died: గుంటూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఒకరు అమెరికాలో మృతి చెందారు. గంగూరు శ్రీనాథ్(32 ) అమెరికాలో ఉంటున్నాడు. గుంటూరు వికాస్ నగర్ కు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాస రావు, రాజ శ్రీ దంపతుల కుమర్తె సాయి చరణి, రాజేంద్రనగర్ కు చెందిన శ్రీనాథ్ కు అయిదేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. గతంలో వీరు ఫ్లోరిడాలో ఉండేవారు. ఆరు నెలల కిందట శ్రీనాథ్, సాయి చరణి అట్లాంటాకు మారారు. ఆదివారం సెలవు కావడంతో ఔటింగ్ కు వెళ్లారు. దంపతులు ఇద్దరూ కలిసి అట్లాంటాలో ట్రెక్కింగ్ కు వెళ్లారు. క్లీవ్ లెన్స్ మౌంటెన్ హిల్స్ లో ఎత్తయిన ప్రదేశానికి చేరుకోగా.. అక్కడి నుండి శ్రీనాథ్ పట్టుతప్పి 200 అడుగుల లోతు ఉన్న లోయలో పడి పోయాడు. 

తీవ్ర గాయాలతో మృతి 
ఈ ప్రమాదంలో శ్రీనాథ్ కు తీవ్రగాయాలు అయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భర్త చనిపోయిన విషయాన్ని సాయి చరణి, అత్తా మామలకు చెప్పడంతో వారు గుండెలు పగిలేలా రోదించారు. అయితే శ్రీనాథ్ మృతదేహాన్ని అమెరికా నుండి గుంటూరుకు తీసుకువచ్చేందుకు దాదాపు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని శ్రీనాథ్ మామ సుఖవాసి శ్రీనివాస రావు తెలిపారు. అమెరికాలో ఉంటున్న గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, గుంటూరుకు చెందిన ప్రవాసాంధ్రులు మల్లిక్ మేదరమెట్ల, అశోక్ కొల్లా, సరేష్ కాకర్ల బాధిత కుటుంబానికి సాయం అందిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 

శ్రీనాథ్, సాయి చరణి దంపతులకు ఐదేళ్ల క్రితం వివాహం కాగా.. వారికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. శ్రీనాథ్.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో మాస్టర్స్ చేశాడు. అతను మిన్నెసోటాలోని ఒక ఫైనాన్షియల్ కంపెనీతో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా తన వృత్తిని ప్రారంభించాడు. అల్లుడి మరణంతో విషాదంలో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాస రావును టీడీపీ నేతలు పరామర్శించారు. అల్లుడి మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. 

వారం క్రితం అమెరికాలో ఓ తెలుగు యువకుడు మృతి చెందాడు. విహార యాత్రలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహార యాత్రకు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నెక్కలపు హరీష్ చౌదరిఘ(35) ప్రమాదవశాత్తు మృతిచెందాడు. విజయవాడ పోరంకి వసంత్ నగర్ కాలనీకి చెందిన నెక్కలపు హరీష్ చౌదరి కెనడానలో టూల్ మేకర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో హరీష్ కుటుంబసభ్యులతో కలిసి కలిసి న్యూయార్క్ విహార యాత్రకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఇతాకా జలపాతంలో జారిపడ్డాడు. ఈ దుర్ఘనటలో హరీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

ఆహ్లాదంగా సాగాల్సిన విహార యాత్ర విషాదాంతం కావాలంటే జాగ్రత్తలు పాటించాల్సిందే. విహార యాత్రలు విషాదాంతం కావడం వారం రోజుల్లో రెండు ఘటనలు జరిగాయి. విహారయాత్రలకు వెళ్లిన సమయంలో జాగ్రత్తగా మెలగడం చాలా ముఖ్యం. సేఫ్టీ గేర్ లేనిదే విహార యాత్రలకు వెళ్లవద్దని సూచిస్తుంటారు నిపుణులు. 

టాప్ హెడ్ లైన్స్

Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Doctor Murder Case: భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
భర్తను పొడిచి చంపేసింది - 8 ఏళ్ల కుమారుడికీ కత్తిపోట్లు - మహిళా డాక్టర్ కిరాతకం!
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget