అన్వేషించండి

Crime News: బాత్రూంలో ఉండగా వీడియో తీసిన పీఈటీ - రోడ్డెక్కిన 500 మందికి పైగా విద్యార్థినులు

Siricilla News: తమను మహిళా పీఈటీ వేధిస్తున్నారని దాదాపు 500 మందికి పైగా విద్యార్థినులు రహదారిపై ఆందోళన నిర్వహించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. పోలీసులు, అధికారులు వారికి నచ్చచెప్పారు.

Girl Students Harassed By Staff In Rajanna Siricilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Siricilla District) దారుణం జరిగింది. తమను పీఈటీ వేధిస్తోందని దాదాపు 500 మందికి పైగా విద్యార్థినులు గురువారం రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో (Tribal Welfare Gurukul School) పని చేస్తోన్న పీఈటీ జ్యోత్స్న తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉదయం 5 గంటలకే సిద్ధిపేట ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. వందల మందికి పైగా విద్యార్థినులు ఉన్న పాఠశాలలో రెండు బాత్రూంలు మాత్రమే ఉన్నాయని వాపోయారు. నెలవారీ పీరియడ్స్ ఉన్న సమయంలోనూ బాత్రూంలో స్నానం చేస్తుంటే.. పీఈటీ టీచర్ లేట్ ఎందుకు అవుతుందని డోర్ పగలకొట్టి.. లోనికి వచ్చి తన ఫోన్‌తో వీడియో రికార్డు చేస్తూ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెట్టే ఇబ్బందులు భరించలేకపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

'ఆమె ఓ సైకో'

పీఈటీ ఓ సైకో అని.. బైపీసీ మొదటి సంవత్సర విద్యార్థినులు తీవ్రస్థాయిలో ఆమెపై మండిపడ్డారు. ఆమె ఆగడాలు భరించలేకే ధర్నాకు దిగామని వివరించారు. తాము బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో లోపలికి వచ్చి బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ దుర్భాషలాడుతూ, కొడుతూ తీసుకెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఈటీ కొట్టిన దెబ్బలను చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సైకో టీచర్‌ను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులకు నచ్చచెప్పారు. ఎంఈవో రఘుపతి ఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తప్పిస్తున్నామన్న డీఈవో హామీతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.

Also Read: Telangana: మీ ఇంటికొస్తానన్న కౌశిక్‌ రెడ్డి- రా తేల్చుకుందాం అంటూ అరికెపూడి గాంధీ సవాల్‌- హీటెక్కిన గ్రేటర్ పాలిటిక్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Mahakumbh 2025 : మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
Kandula Durgesh: ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Crime News: నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
Embed widget