అన్వేషించండి

Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం- నలుగురు మృతితో విషాదం, శిథిలాల కింద మరో 10 మంది

Delhi Crime News: ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.

ఢిల్లీ ముస్తఫాబాద్ భవనం కూలిపోయింది: ఢిల్లీలోని న్యూ ముస్తఫాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో 8 నుంచి 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే NDRF, అగ్నిమాపక శాఖ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్ మొదట కూలిన బిల్డింగ్ శిథిలాల నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

న్యూ ముస్తఫాబాద్‌లోని శక్తి విహార్‌లో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కూలిపోయినట్లు శుక్రవారం రాత్రి 2:50 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది, NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 40 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అథ్వాల్ మాట్లాడుతూ. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2:50 గంటలకు ఒక బిల్డింగ్ కూలిపోయినట్లు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాం. మొత్తం భవనం కూలిపోగా, కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు గుర్తించాము. NDRF టీమ్, ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయిని తెలిపారు.

శిథిలాల కింద మరో 10 మంది..

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకూ 10 మందిని శిథిలాల నుంచి బయటకు తీయగా అందులో నలుగురు మరణించారు. ఈశాన్య జిల్లా అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా మాట్లాడుతూ.. శిథిలాలలో ఇంకా 10 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. కుప్పకూలిన ఆ 4 అంతస్తుల భవనంలో దాదాపు 20 మంది వరకు నివసిస్తున్నారు. భవనం కుప్పకూలిపోవడం సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు తెలుస్తోంది. అధికారులు దాన్ని బట్టి అసలేం జరిగిందో ఓ అంచనాకు రానున్నారు.

మృతులలో ఒకరి బంధువు షహజాద్ అహ్మద్ మాట్లాడుతూ, "ఈ బిల్డింగ్ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత  దాదాపు 2.30 గంటలకు కూలిపోయింది. ఇది 4 అంతస్తుల భవనం. నా ఇద్దరు మేనల్లుళ్లు ప్రాణాలు కోల్పోయారు. నా సోదరి, బావతో పాటు మేనకోడలు కూడా గాయపడ్డారు. వారిని జిటిబి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అని తెలిపారు. భవనం కూలిపోయిన ప్రమాదంతో ఒక ప్రత్యక్ష సాక్షి స్పందించారు. "భవనంలో ఇద్దరు వ్యక్తులు, వారి కుటుంబాలు, అద్దెకు ఉంటున్నవారు నివసిస్తున్నారు. పెద్ద కోడలుకు ముగ్గురు పిల్లలు, చిన్న కోడలుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ వారు ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా శిథిలాల కిందే ఉన్నారా, ప్రాణాలతో బయట పడతారా తెలియడం లేదన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
Jubilee Hills Murder Case: జూబ్లీహిల్స్‌లో దారుణం- మాజీ డీజీపీ భార్య హత్య - నేపాలీ గ్యాంగ్ ఘాతుకం!
జూబ్లీహిల్స్‌లో దారుణం- మాజీ డీజీపీ భార్య హత్య - నేపాలీ గ్యాంగ్ ఘాతుకం!
Malkajgiri Police Commissioner Sumati: డ్రగ్స్ కట్టడికి మల్కాజిగిరి కమిషనర్ సుమతి ప్రత్యేక వ్యూహం - హాస్టల్స్‌ పై ఇక 24 గంటలూ నిఘా
డ్రగ్స్ కట్టడికి మల్కాజిగిరి కమిషనర్ సుమతి ప్రత్యేక వ్యూహం - హాస్టల్స్‌ పై ఇక 24 గంటలూ నిఘా

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget