అన్వేషించండి

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్య కేసులో షాకింగ్ విషయాలు, ప్రియుడితో కలిసి వివాహిత మర్డర్ ప్లాన్

భర్త శవాన్ని చూస్తూ బోరున ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులుకు అసలు విషయం తెలియడంతో ఆమెతో పాటు ప్రియుడ్ని కూడా కటకటాల వెనక్కు పంపారు.

ప్రియుడితో కలిసి నాటకమాడి పెళ్లయి ఏడాది తిరగకుండానే భర్తను హత్య చేయించింది ఓ వివాహిత. అంతటితో ఆగక అతి తెలివిగా భర్తను దారి దోపిడీ దొంగలు హత్య చేశారంటూ ఓ రేంజ్ లో నాటకం మాడింది. భర్త శవాన్ని చూస్తూ బోరున ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది ఆ మహానటి. తీరా అనుమానం వచ్చి ఆరా తీసిన పోలీసులుకు అసలు విషయం తెలియడంతో ఆమెతో పాటు ప్రియుడ్ని కూడా కటకటాల వెనక్కు పంపారు. చిత్తూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తో వివాహం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం, బత్తలపురం గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడైన దామోదరానికి పుంగనూరు నియోజకవర్గం, పెనుగొలక గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువతితో గత ఏడాది పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు తన తండ్రి చేసే  పాల వ్యాపారంలో పాల వ్యాన్ డ్రైవర్గా పని చేసిన నాగిరెడ్డిపల్లికు చెందిన గంగరాజుతో అక్రమ సంబంధం ఉంది. గంగరాజుకి అప్పటికే పెళ్లయి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. కానీ తన యజమాని కూతురుని ట్రాప్ చేసి ఆమెతో రిలేషన్ కొనసాగించాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో అనురాధ తండ్రి ఆమెకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. తండ్రి మాటను ఎదురించకుండా.. ప్రియుడితో ప్రేమాయణం నడుపుతూనే పెద్దలు కుదిరిచిన సంబంధాన్ని ఓకే చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా చేస్తున్న దామోదరంతో గత ఏడాది వివాహం ఘనంగా జరిపించారు. ఉద్యోగం చేస్తున్న భర్త, మంచిగా చూసుకునే అత్త మామలు ఉన్నా, ప్రియుడు గంగరాజుతో ఉన్న అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. భర్త ఇంట్లో లేని‌ సమయంలో అత్తమామలకు తెలియకుండా గంగరాజుతో ఫోన్లో‌ మాట్లాడుతూ ఉండేది. ఆమె బలహీనతను సొమ్ము చేసుకున్న గంగరాజు తరచు ఆమె దగ్గర డబ్బు నగలు అడిగి తీసుకునని తన అవసరాలకు వాడుకునేవాడు. 
నగలు పుట్టింట్లో ఉన్నాయని మాయ మాటలు
ప్రియుడు గంగరాజు మాయలో పడి భర్తను దూరం పెడుతూ వచ్చింది ఆ వివాహిత. ఆమెను ఎప్పటి‌ లాగానే తనకు డబ్బు అవసరం ఉందని మరోసారి కోరాడు గంగరాజు. దీంతో అనురాధ అత్తమామలు పెట్టిన బంగారు నెక్లెస్, చంద్రహారం తాకట్టు పెట్టుకోమని గంగరాజుకు ఇచ్చింది. అయితే కొన్ని రోజులకే దామోదరం పుంగనూరులో భూమి కొనుగోలు కోసం డబ్బు తక్కువ అయిందని తాము పెట్టిన నగలను తాకట్టు పెట్టుకునేందుకు ఇవ్వాలని భార్యను అడిగాడు దామోదరం. పుట్టింట్లో నగలు మరిచిపోయానని భర్తకు అబద్ధం చెప్పింది. భార్యను పుట్టింటికి తీసుకు వెళతానని నగలు తీసుకువద్దమని భర్త దామోదరం చెప్పాడు. దీంతో ఆమె ఆలోచనలో పడింది. భర్తకు నగలు పుట్టింట్లో లేవని, ప్రియుడికి ఇచ్చేసిన విషయం ఎలా దాచి ఉంచాలో అర్ధం కాలేదు. 
ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్
ప్రియుడు గంగరాజుకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది వివాహిత. తమ అక్రమ‌ సంబంధానికి అడ్డుగా ఉన్న దామోదరంను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా దామోదరంను చంపేందుకు పక్కా ప్లాన్ ను తయారు చేశారు. అక్టోబర్ 31వ తేదీన  కర్ణాటక సరిహద్దులోని భార్య స్వగ్రామమైన పెనుగొలకకు భర్త దామోదరం బైక్ పై ఆమెను తీసుకు వెళ్ళాడు.‌ నగలు తీసుకువచ్చానంటూ ఓ డబ్బాను భర్తకు అనురాధ చూపించింది. తిరుగు ప్రయాణంలో స్థానికంగా జరిగే వివాహ వేడుక చూసి వెళ్దామని చెప్పింది. ఆమె మాటలు నమ్మిన దామోదరం భార్య పన్నిన కుట్రను పసిగట్టలేక పోయాడు. వివాహ వేడుక పూర్తి కాగానే తిరుగు ప్రయాణంలో షాపింగ్ అంటూ దామోదరంను ఇటు అటు తిప్పింది. 

చీకటి పడ్డాక పెద్దపంజాణి మండలం, గొల్లపల్లి గ్రామ సమీపంలో నాగలగుంటచెరువు కట్టపైకు బైక్ రాగానే, చెరువు కట్టపైనే కాపు కాసిన గంగరాజు ఒక్కసారిగా కారం పొడిని దామోదరం పైకి చల్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణ రహితంగా పొడుస్తూ దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే దామోదరం మృతి చెందాడు. ఎవరికి అనుమానం రాకుండా భర్త రక్తాన్ని తాను ఒళ్ళంతా పూసుకుంది భార్య. అలాగే చేతిపై ఆమెకు గంగరాజు చిన్నపాటి గాయం చేసి పరారయ్యాడు. ప్రియుడు పరార్ అవ్వగానే అరుపులతో కేకలతో అత్తవారింటికి వెళ్లి భర్తతో కలిసి తాను బైక్ పై వస్తుండగా ముగ్గురు దోపిడీ దొంగలు దాడి చేశారని, వారిని అడ్డుకోబోయిన దామోదరంను పొడిచి చంపి నగలతో పారిపోయారని దొంగ కన్నీళ్లు కార్చింది. అత్తమామలను, బంధువులను గ్రామస్తులను హత్య చేసిన ప్రాంతానికి తీసుకు వెళ్లి భర్త సమయం ముందు బోరును ఏడ్చింది. 

ఆమె కుట్రను గ్రహించలేని అత్తమామలు బోరున ఏడుస్తున్న కోడల్ని ఓదార్చారు. దామోదరం తండ్రి పెద్ద రెడ్డప్ప ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యక్ష సాక్షిగా భావించి అతడి భార్యను విచారించారు. అయితే ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అనుమానం వచ్చి తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో అసలు విషయం చెప్పేసింది. ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేయించానని ఒప్పుకుంది. దీంతో రెండు రోజుల్లోనే హత్య కేసును చేదించిన పోలీసులు ఏ1 నిందితుడుగా గంగరాజుతో పాటు ఏ2 నిందితురాలుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దామోదరం భార్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Bail: సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
IPL 2025 Fand Park: ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Bail: సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
సీఐడీ కేసులోనూ పోసానికి బెయిల్ - ఈ సారైనా బయటకు వస్తారా?
CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు
IPL 2025 Fand Park: ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?
10th Examinations 2025: తెలుగు పరీక్ష కోసం వెళ్తే హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు- మంచిర్యాల జిల్లాలో షాక్ తిన్న విద్యార్థులు
తెలుగు పరీక్ష కోసం వెళ్తే హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు- మంచిర్యాల జిల్లాలో షాక్ తిన్న విద్యార్థులు
Karnataka Honey Trap Politics: కర్ణాటక రాజకీయ నేతలకు హనీ ట్రాప్ భయం - అంత ఈజీగా పడిపోతారా- అసలేం జరుగుతోంది ?
కర్ణాటక రాజకీయ నేతలకు హనీ ట్రాప్ భయం - అంత ఈజీగా పడిపోతారా- అసలేం జరుగుతోంది ?
Dhanashree Verma: క్రికెటర్ చాహల్‌తో విడాకులు - గృహహింసపై ధనశ్రీ వర్మ కొత్త పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
క్రికెటర్ చాహల్‌తో విడాకులు - గృహహింసపై ధనశ్రీ వర్మ కొత్త పాట.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
Delhi High Court Judge Issue: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు - రాజ్యసభలోనూ చర్చ - విచారణ కమిటీ నియమించిన సీజేఐ
ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు - రాజ్యసభలోనూ చర్చ - విచారణ కమిటీ నియమించిన సీజేఐ
Embed widget