అన్వేషించండి

Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి

Crime News: మొబైల్ గేమ్ ఆడుతూ సాంబార్ గిన్నెలో పడి కర్నూలు జిల్లాకు చెందిన బాలుడు మృతి చెందిన విషాద ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. అటు, ఒంగోలులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి చెందారు.

Boy Died Due To Falling Down In Sambar In Kurnool District: అన్నం తినేటప్పుడు మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపాలనో చాలామంది చిన్నారులకు సెల్ ఫోన్ అలవాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే అది వ్యసనంగా మారి చిన్నారులు మొబైళ్లకు బానిసవుతున్నారు. అలా మొబైల్‌లో గేమ్ ఆడుతూ కర్నూలు జిల్లాకు (Kurnool District) చెందిన బాలుడు ప్రమాదవశాత్తు సాంబారులో పడి మృతి చెందిన విషాద ఘటన గద్వాల జిల్లాలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా గోనెగండ్ల (Gonegandla) మండలం వేమూగోడుకు చెందిన జగదీష్ అమ్మానాన్నలతో కలిసి మేనమామ పెళ్లి కోసం గద్వాల జిల్లా (Gadwal District) వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామానికి వెళ్లాడు. అయితే, పెళ్లి కోసం సిద్ధం చేసిన వంటలను ఓ గదిలో ఉంచారు. మొబైల్‌లో గేమ్ ఆడుతున్న జగదీష్.. చూసుకోకుండా వెళ్లి సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. ఈ క్రమంలో గిన్నె మూత పక్కకు జరగడంతో వేడిగా ఉన్న సాంబారులో జగదీష్ పడిపోయాడు.

బాలుడి కేకలు విన్న బంధువులు వెంటనే స్పందించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని పలువురు పేర్కొంటున్నారు.

బాలుడిని ఢీకొన్న బస్సు

అటు, అనకాపల్లి జిల్లాలో ఓ ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఈ ఘటన జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మామిడిపల్లికి చెందిన దొగ్గ దేముళ్ల ఫార్మా సిటీలో పని చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. తండ్రి విధులకు వెళ్తుండగా.. ఆయనతో పాటు దగ్గర్లోని బస్టాప్‌నకు వెళ్లిన పవన్ కుమార్ హైవేపై డివైడర్‌ను దాటి తిరిగి వస్తుండగా.. ఫార్మా సిటీ నుంచి వస్తోన్న బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్ స్థానికంగా ఓ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. విగతజీవిగా పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో ముగ్గురు మృతి

మరోవైపు, ఒంగోలు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు సహా వారి స్నేహితుడు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని కొప్పోలు ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు స్కూటీపై వెళ్తుండగా కొప్పోలు దగ్గర వీరి బైక్‌ను నీటి ట్యాంకర్ ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు వికాస్ (12), విశాల్ (9), రేష్వంత్ (18)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.

Also Read: Kodali Nani: విశాఖలో కొడాలి నానిపై ఫిర్యాదు - సోషల్‌ మీడియా అనుచిత పోస్టుల కేసులో వచ్చే వారం కీలక పరిణామాలు!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget