అన్వేషించండి

Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి

Crime News: మొబైల్ గేమ్ ఆడుతూ సాంబార్ గిన్నెలో పడి కర్నూలు జిల్లాకు చెందిన బాలుడు మృతి చెందిన విషాద ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. అటు, ఒంగోలులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి చెందారు.

Boy Died Due To Falling Down In Sambar In Kurnool District: అన్నం తినేటప్పుడు మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపాలనో చాలామంది చిన్నారులకు సెల్ ఫోన్ అలవాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే అది వ్యసనంగా మారి చిన్నారులు మొబైళ్లకు బానిసవుతున్నారు. అలా మొబైల్‌లో గేమ్ ఆడుతూ కర్నూలు జిల్లాకు (Kurnool District) చెందిన బాలుడు ప్రమాదవశాత్తు సాంబారులో పడి మృతి చెందిన విషాద ఘటన గద్వాల జిల్లాలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా గోనెగండ్ల (Gonegandla) మండలం వేమూగోడుకు చెందిన జగదీష్ అమ్మానాన్నలతో కలిసి మేనమామ పెళ్లి కోసం గద్వాల జిల్లా (Gadwal District) వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామానికి వెళ్లాడు. అయితే, పెళ్లి కోసం సిద్ధం చేసిన వంటలను ఓ గదిలో ఉంచారు. మొబైల్‌లో గేమ్ ఆడుతున్న జగదీష్.. చూసుకోకుండా వెళ్లి సాంబార్ గిన్నెపై కూర్చున్నాడు. ఈ క్రమంలో గిన్నె మూత పక్కకు జరగడంతో వేడిగా ఉన్న సాంబారులో జగదీష్ పడిపోయాడు.

బాలుడి కేకలు విన్న బంధువులు వెంటనే స్పందించి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని రక్షించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని పలువురు పేర్కొంటున్నారు.

బాలుడిని ఢీకొన్న బస్సు

అటు, అనకాపల్లి జిల్లాలో ఓ ఫార్మా కంపెనీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఏడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం ఈ ఘటన జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం మామిడిపల్లికి చెందిన దొగ్గ దేముళ్ల ఫార్మా సిటీలో పని చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. తండ్రి విధులకు వెళ్తుండగా.. ఆయనతో పాటు దగ్గర్లోని బస్టాప్‌నకు వెళ్లిన పవన్ కుమార్ హైవేపై డివైడర్‌ను దాటి తిరిగి వస్తుండగా.. ఫార్మా సిటీ నుంచి వస్తోన్న బస్సు వేగంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్ స్థానికంగా ఓ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. విగతజీవిగా పడి ఉన్న బాలుడిని చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రమాదంలో ముగ్గురు మృతి

మరోవైపు, ఒంగోలు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు సహా వారి స్నేహితుడు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని కొప్పోలు ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు స్కూటీపై వెళ్తుండగా కొప్పోలు దగ్గర వీరి బైక్‌ను నీటి ట్యాంకర్ ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు వికాస్ (12), విశాల్ (9), రేష్వంత్ (18)గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.

Also Read: Kodali Nani: విశాఖలో కొడాలి నానిపై ఫిర్యాదు - సోషల్‌ మీడియా అనుచిత పోస్టుల కేసులో వచ్చే వారం కీలక పరిణామాలు!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Attapur Kidnap: అత్తాపూర్ అమ్మాయి కిడ్నాప్ అంతా ఉత్తదే - ఇంత పని చేశారా?
అత్తాపూర్ అమ్మాయి కిడ్నాప్ అంతా ఉత్తదే - ఇంత పని చేశారా?
Hyderabad Airport Drug Bust: హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజా పట్టివేత- స్మగ్లర్లు అంతా కవర్ చేశారు కానీ చిన్న తప్పు చేశారు !
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా హైడ్రోపోనిక్ గంజా పట్టివేత- స్మగ్లర్లు అంతా కవర్ చేశారు కానీ చిన్న తప్పు చేశారు !
Hyderabad Kidnap: అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్ కలకలం - నిజమేనా? ప్రాంక్ వీడియోనా?
అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్ కలకలం నిజమేనా? ప్రాంక్ వీడియోనా?
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!
బండి భగీరథ్ కేసులో కీలక మలుపు! వెలుగులోకి మరికొందరు బాధితులు! సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై పోలీసుల ఫోకస్!

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minimum Wages in Telangana: తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం! జూన్ నుంచి అమలు!
తెలంగాణలో కార్మికుల కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం! జూన్ నుంచి అమలు!
TMC Political Crisis: చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్‌! మమత, అభిషేక్‌ వర్గాలుగా విడిపోయిన నేతలు! 
Tamil Nadu Chief Minister Vijay Cabinet Expansion: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ క్యాబినెట్‌లో చేరిన 23 మంది!  కొత్తగా ప్రమాణం చేసిన మంత్రుల జాబితా ఇదే!
Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
Kara OTT : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
New Ethanol Blending Standards: ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం
Mega 158 Movie : చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
చిరు మెగా 158 మూవీ లాంచ్ - అన్నయ్యకు క్లాప్ కొట్టిన పవన్ కల్యాణ్
Tea Benefits in Summer : వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
వేసవిలో టీ తాగితే కలిగే లాభాలు, నష్టాలు.. రోజుకి ఎన్నిసార్లు తాగితే మంచిది?
Embed widget