అన్వేషించండి

Bhadradri Kottagudem: కూలీల వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్... పనికి వెళ్తూ అనంతలోకాలకు...నలుగురు మృతి, 8 మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలు ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు మృతి చెందారు.

తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని చండ్రుగొండ మండలం తిప్పనపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. చండ్రుగొండ మండలంలోని సుజాతనగర్‌కు చెందిన కూలీలు అన్నపరెడ్డిపల్లె మండలానికి పనికి బొలేరో వాహనంలో బయలుదేరారు. బొలేరో వాహనం తిప్పనపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొగ్గు టిప్పర్‌ ఈ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు కత్తి స్వాతి, సుజాత ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మొత్తం పది మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్రం లక్ష్మి, సాయమ్మ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ప్రమాదం సమాచారం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, సీఐ నాగరాజు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు అంటున్నారు. 

Bhadradri Kottagudem: కూలీల వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్... పనికి వెళ్తూ అనంతలోకాలకు...నలుగురు మృతి, 8 మందికి గాయాలు

Also Read: పోలీసుల చేతిలో వరుస చైన్ స్నాచింగ్‌ల దొంగ, గొలుసు లాక్కెళ్లేటప్పుడు ఎంతో తెలివి.. పోలీసులు వెల్లడి

అనంతపురంలో కూలీల ఆటో బోల్తా

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 12 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యలు తెలిపారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలం ఎన్.హనుమాపురం శివారులో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. కనేకల్ మండలం సొల్లాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు 15 మంది ఆటోలో ఉరవకొండ మండలం నెరిమెట్ల గ్రామంలోని పంటపొలాల్లో పనిచేసేందుకు వెళ్తున్నారు. గురువారం సాయంత్రం పనులు ముగించుకొని తిరిగి గ్రామానికి వస్తుండగా ఎన్‌.హనుమాపురం గ్రామం సమీపంలోని ఆర్ అండ్​బి రహదారిలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అంబులెన్స్​లో క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అయితే  ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు అనంతపురంలో ఆసుపత్రికి తరలించారు. ఆటోను అతివేగంతో అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు అంటున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న కనేకల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nandu World Insta Couple Scam: సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
సోషల్ మీడియా సెలబ్రిటీ జంటపై యూకే వీసా స్కాం ఆరోపణలు - ఎందుకు స్పందించడం లేదు?
IPL final match driving accident: ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
ఐపీఎల్ ఫైనల్ చూస్తూ డ్రైవింగ్ - బావిలోకి వెళ్లిపోయిన కారు - వ్యక్తి మృతి !
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Exit trafficking case: ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై ఎగ్జిట్ ట్రాఫికింగ్ కేసు - భార్యపై చేసిన కుట్రతోనే - ఇలాంటి పనులు కూడా చేస్తారా?

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Shocking FASTag Scam: ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
Embed widget