అన్వేషించండి

Couple Suicide: రెండు ప్రాణాలు తీసిన రూ.500, గుడివాడలో విషాదం

AP Crime News: కృష్ణాజిల్లా గుడివాడ వాసవి నగర్‌లో విషాద ఘటన జరిగింది. 500 రూపాయల విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఇద్దరి ప్రాణాలను తీసింది.

Couple Committed Suicide In Gudivada: రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే.. ‘హరిచంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను! భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాను! తండ్రి బిడ్డలను విడదీస్తాను! అన్నదమ్ముల మధ్య వైరం పెడతాను! ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను! ఆఖరికి ప్రాణాలు కూడా తీస్తాను!’ అని అందట. డబ్బుకు అంత పవర్ ఉంది మరి. గుడివాడ పట్టణంలో రూ.500 చిచ్చుపెట్టింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

కృష్ణాజిల్లా గుడివాడ వాసవి నగర్‌లో విషాద ఘటన జరిగింది. 500 రూపాయల విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఇద్దరి ప్రాణాలను తీసింది. వివరాలు.. గుడివాడ వాసవి నగర్‌కు చెందిన కొలుసు రాంబాబు, కనకదుర్గ దంపతులు. రాంబాబు ఏలూరులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో బస్సు డ్రైవర్‌​గా పనిచేస్తున్నాడు. శనివారం మద్యం తాగిన రాంబాబు ఇంటికి వచ్చాడు. భార్యను రూ.500 ఇవ్వాలని అడిగాడు. అయితే తనదగ్గర డబ్బులేదని కనకదుర్గ సమాధానం ఇచ్చింది. ఈ విషయంలో భార్యా భర్తల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. 

భార్య రూ.500 అడిగితే ఇవ్వలేదని మనస్థాపం చెందిన రాంబాబు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య గమనించి వెంటనే తన కొడుకుకు సమాచారం ఇచ్చింది. హుటాహుటిన అక్కడికి వచ్చిన కొడుకు ఉరి వేసుకున్న తండ్రిని కారులో ఆస్పత్రికి తరలించాడు. పరీశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో కొడుకు ఇంటికి ఫోన్ చేసి తండ్రి రాంబాబు చనిపోయినట్లు తల్లి కనకదుర్గకు చెప్పాడు.

భర్త మరణంతో తీవ్ర వేదనకు గురైన కనకదుర్గ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి తల్లి ఉరివేసుకొని వేలాడటాన్ని చూసిన షాక్‌కు గురయ్యాడు. ఆమెను కాపాడుకోవాలనుకున్న కొడుకు ఉరికి వేలాడుతున్న తల్లిని కిందకు దింపి పరిశీలించగా అప్పటికే ఆమె చనిపోయింది. తల్లిదండ్రుల మరణ వార్తను సోదరి, బంధువులకు తెలియజేశాడు. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సీఐ భార్యాభర్తల మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గంటల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ కొడుకును చూసి స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

లోన్ యాప్ వేధింపులు తాళలేక సూసైడ్
లోన్​ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తాళలేక పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామానికి చెందిన యువకుడు శనివారం సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు .. పరగటిచర్లకు చెందిన గుడిపూడి శ్యాం ప్రసాద్ కుమారుడు విజ్ఞేష్ (22) అనే ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. తన ఫోన్​లోని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లించలేకపోవడంతో రుణ యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. 

సెలవులకు ఇంటికి వచ్చిన విజ్ఞేష్ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన విజ్ఞేష్ తల్లిదండ్రులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న రొంపిచర్ల పోలీసులు విజ్ఞేష్ ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని తండ్రి శ్యాం ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget