అన్వేషించండి

Couple Suicide: రెండు ప్రాణాలు తీసిన రూ.500, గుడివాడలో విషాదం

AP Crime News: కృష్ణాజిల్లా గుడివాడ వాసవి నగర్‌లో విషాద ఘటన జరిగింది. 500 రూపాయల విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఇద్దరి ప్రాణాలను తీసింది.

Couple Committed Suicide In Gudivada: రూపాయి రూపాయి నువ్వేం చేస్తావు అని అడిగితే.. ‘హరిచంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను! భార్య భర్తల మధ్య చిచ్చు పెడతాను! తండ్రి బిడ్డలను విడదీస్తాను! అన్నదమ్ముల మధ్య వైరం పెడతాను! ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను! ఆఖరికి ప్రాణాలు కూడా తీస్తాను!’ అని అందట. డబ్బుకు అంత పవర్ ఉంది మరి. గుడివాడ పట్టణంలో రూ.500 చిచ్చుపెట్టింది. రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.

కృష్ణాజిల్లా గుడివాడ వాసవి నగర్‌లో విషాద ఘటన జరిగింది. 500 రూపాయల విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఇద్దరి ప్రాణాలను తీసింది. వివరాలు.. గుడివాడ వాసవి నగర్‌కు చెందిన కొలుసు రాంబాబు, కనకదుర్గ దంపతులు. రాంబాబు ఏలూరులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌లో బస్సు డ్రైవర్‌​గా పనిచేస్తున్నాడు. శనివారం మద్యం తాగిన రాంబాబు ఇంటికి వచ్చాడు. భార్యను రూ.500 ఇవ్వాలని అడిగాడు. అయితే తనదగ్గర డబ్బులేదని కనకదుర్గ సమాధానం ఇచ్చింది. ఈ విషయంలో భార్యా భర్తల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. 

భార్య రూ.500 అడిగితే ఇవ్వలేదని మనస్థాపం చెందిన రాంబాబు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య గమనించి వెంటనే తన కొడుకుకు సమాచారం ఇచ్చింది. హుటాహుటిన అక్కడికి వచ్చిన కొడుకు ఉరి వేసుకున్న తండ్రిని కారులో ఆస్పత్రికి తరలించాడు. పరీశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. దీంతో కొడుకు ఇంటికి ఫోన్ చేసి తండ్రి రాంబాబు చనిపోయినట్లు తల్లి కనకదుర్గకు చెప్పాడు.

భర్త మరణంతో తీవ్ర వేదనకు గురైన కనకదుర్గ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మృతదేహాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి తల్లి ఉరివేసుకొని వేలాడటాన్ని చూసిన షాక్‌కు గురయ్యాడు. ఆమెను కాపాడుకోవాలనుకున్న కొడుకు ఉరికి వేలాడుతున్న తల్లిని కిందకు దింపి పరిశీలించగా అప్పటికే ఆమె చనిపోయింది. తల్లిదండ్రుల మరణ వార్తను సోదరి, బంధువులకు తెలియజేశాడు. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న వన్ టౌన్ సీఐ భార్యాభర్తల మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గంటల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఆ కొడుకును చూసి స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

లోన్ యాప్ వేధింపులు తాళలేక సూసైడ్
లోన్​ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తాళలేక పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామానికి చెందిన యువకుడు శనివారం సూసైడ్ చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు .. పరగటిచర్లకు చెందిన గుడిపూడి శ్యాం ప్రసాద్ కుమారుడు విజ్ఞేష్ (22) అనే ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. తన ఫోన్​లోని లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లించలేకపోవడంతో రుణ యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. 

సెలవులకు ఇంటికి వచ్చిన విజ్ఞేష్ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన విజ్ఞేష్ తల్లిదండ్రులు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న రొంపిచర్ల పోలీసులు విజ్ఞేష్ ఆత్మహత్య చేసుకున్న తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని తండ్రి శ్యాం ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget