అన్వేషించండి

Vizianagaram Crime News: వామ్మో ఇది మమూలు స్కెచ్ కాదు, సినిమా స్టైల్లో రూ.1.40 కోట్లు కాజేశారు

 Vizianagaram Crime News: విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో ఏటీఎంలలో నగదు పెట్టే ఏజన్సీ నుంచి రూ.1.40 కోట్లు దోచేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ దీపిక తెలిపారు.

 Vizianagaram Crime News: సినిమా స్టైల్లో రూ.1.40 కోట్లు కొల్లగొట్టిన దొంగలను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23న విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం గ్రామంలో బ్యాంకు ఏటీఎంలలో నగదు పెట్టే ఏజన్సీ నుంచి రూ.1.40 కోట్లు దోచేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ దీపిక తెలిపారు. నిందితుల నుంచి రూ. 80 లక్షలు రికవరీ చేసినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. 

ఎస్పీ దీపిక మీడియాతో మాట్లాడుతూ.. ‘సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్' అనే కంపెనీ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు వంటి జాతీయ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లో నగదు పెడుతుంటారు. ఈ కంపెనీలో కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న నలుగురు ఆగస్టు 23న రూ.1.40 కోట్లు తీసుకొని, రూట్ నంబరు 3, 4 లోగల ఏటీఎం కేంద్రాల్లో జమ చేసేందుకు బయలుదేరారు. కుమిలి గ్రామంలోని ఇండియా 1 ఏటీఎం కేంద్రంలో రూ. 4 లక్షలు జమ చేసి, మిగిలిన రూ.1.36 కోట్ల నగదుకు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. 

బ్యాంకు అధికారులు అనుమానం వచ్చి ఆగస్టు 24 నుంచి 26 వరకు క్యాష్ ఆడిట్ నిర్వహించి, సుమారు రూ.1,42,27,900 నగదు పోయినట్లుగా గుర్తించి గంట్యాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ‘సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ’ కంపెనీలో కస్టోడియన్స్ గా పని చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. విచారణలో 70:100 నిష్పత్తిలో రూ.2 కోట్ల రూ. 2 వేలు నోట్లు తీసుకొని, రూ.1.40 కోట్లు విలువ చేసే రూ.500ల నోట్లును వేరే వ్యక్తులకు ఇచ్చినట్లు తేలింది. వారి వద్ద నుంచి రూ.60 లక్షలు కమీషనుగా పొందాలని భావించారు. 

నిందితులు ముందుగా వేసుకున్న పథకంలో భాగంగా ఆగస్టు 23న రెండు బ్యాగుల్లో రూ. 1.40 కోట్లతో నలుగురు నిందితులు గంట్యాడ మండలం కొర్లాంలోని ఏటీఎం వద్దకు బైక్‌లపై బయల్దేరారు. గ్రామ శివార్లలో వారిపై సాలూరు మండలం మరుపల్లికి చెందిన రాయపల్లి వినోద్, రణస్థలం మండలం బోయపాలెంకు చెందినబోయ గోవింద రావు, పార్వతీపురం పట్టణానికి చెందిన అలజంగి సాయి అలియాస్ టాట్టూ సాయి, మరడ శివశంకర్, విజయనగరం పట్టణం బాబామెట్టకు చెందిన నక్క సంతోష్ దాడి చేశారు. రూ.1.40 కోట్ల నగదును దోచుకొని పరారయ్యారు.

ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ఎస్పీ దీపిక విజయనగరం రూరల్ సీఐ టీవీ తిరుపతిరావు, సీసీఎస్ సీఐ బుచ్చిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. రూ.1.40 కోట్లను దోచుకొనిపోయిన నిందితుల గురించి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టి, దోపిడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.80 లక్షల నగదును, ఒక బంగారు గొలుసు, మూడు సెల్ ఫోన్లు, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు కస్టోడిన్స్, దోపిడికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. 

దోపిడీకి పాల్పడిన వారికి కొందరు నిందితులు సహకరించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యిందని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎస్పీ దీపిక తెలిపారు. కేసులో ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. వీరందరికి త్వరలో ప్రోత్సాహక బహుమతులను అందజేస్తామన్నారు. ప్రజలు మోసగాళ్ల ఉచ్చులో పడవద్దని, నిబంధనల మేరకు రూ.2000 నోట్లను బ్యాంకుల్లోనే మార్చుకోవాలని ప్రజలకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేసారు. నోట్ల మార్పిడి పేరుతో మోసాలకు పాల్పడుతున్న మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ -  వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
America shut down: అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
YS Jagan Padayatra: 2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
Advertisement

వీడియోలు

వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ -  వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
America shut down: అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
YS Jagan Padayatra: 2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
Anasuya Bharadwaj : ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్
ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్
Borabanda Politics: బోరబండలో ఏం జరగబోతోంది? బండి సంజయ్ అల్లకల్లోలం సృష్టిస్తారా?
బోరబండలో ఏం జరగబోతోంది? బండి సంజయ్ అల్లకల్లోలం సృష్టిస్తారా?
Dies Irae Collection : 50 కోట్ల క్లబ్‌లో మోహన్ లాల్ కొడుకు మూవీ - అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'... తెలుగులోనూ రెడీ
50 కోట్ల క్లబ్‌లో మోహన్ లాల్ కొడుకు మూవీ - అదరగొట్టిన హారర్ థ్రిల్లర్ 'డీయస్ ఈరే'... తెలుగులోనూ రెడీ
Drishyam style murder: భర్తను చంపేసి కిచెన్‌లో పాతిపెట్టేసింది - చివరికి ఎలా కనిపెట్టారంటే ?
భర్తను చంపేసి కిచెన్‌లో పాతిపెట్టేసింది - చివరికి ఎలా కనిపెట్టారంటే ?
Embed widget