అన్వేషించండి

Share Buyback: ₹12,000 కోట్లతో విప్రో షేర్ల బైబ్యాక్‌, ఒక్కో షేరుకు ₹71 లాభం

పెట్టుబడిదార్లు బైబ్యాక్‌లో తమ షేర్లను సరెండర్ చేయడం ద్వారా ఒక్కో షేరుకు 18 శాతం లేదా రూ. 70.5 లాభం పొందుతారు.

Wipro Q4 Results: 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకటనతో పాటు, షేర్ల బైబ్యాక్‌కు విప్రో డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రూ. 12,000 కోట్ల విలువకు సమానమైన షేర్లను ఈ ఐటీ మేజర్‌ బైబ్యాక్ ‍‌చేస్తుంది. ఒక్కో షేరును రూ. 445 ధర వద్ద తిరిగి కొనుగోలు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

నిన్న (గురువారం, 28 ఏప్రిల్‌ 2023), BSEలో, రూ. 374.50 వద్ద విప్రో షేర్‌ ముగిసింది. ఈ స్థాయితో పోలిస్తే, పెట్టుబడిదార్లు బైబ్యాక్‌లో తమ షేర్లను సరెండర్ చేయడం ద్వారా ఒక్కో షేరుకు 18 శాతం లేదా రూ. 70.5 లాభం పొందుతారు.

27 కోట్ల షేర్లు బైబ్యాక్‌
దాదాపు 27 కోట్ల (26,96,62,921) షేర్లను మార్కెట్‌ నుంచి తిరిగి కొనుగోలు చేయాలని బోర్డు సమావేశంలో డైరెక్టర్లు నిర్ణయించారు. ఇది, కంపెనీ పెయిడప్‌ ఈక్విటీ షేర్లలో 4.91 శాతానికి సమానం. 

టెండర్‌ రూట్‌లో షేర్‌ బైబ్యాక్‌
బైబ్యాక్‌ను టెండర్‌ మార్గంలో నిర్వహించాలని కంపెనీ నిర్ణయించింది. అంటే, విప్రో షేర్‌హోల్డర్లు తమ వాటాలను కంపెనీకి ఆఫర్‌ చేయాలి. ఇలా, టెండర్‌ రూట్‌లో వచ్చిన మొత్తం షేర్లను బట్టి, ఒక్కో షేర్‌హోల్డర్‌ నుంచి ఎంత శాతం షేర్లు కొనుగోలు చేయాలో కంపెనీ నిర్ణయిస్తుంది. బైబ్యాక్ ప్రక్రియ, రికార్డ్ తేదీ, టైమ్‌లైన్ సహా ఇతర వివరాలను విప్రో త్వరలోనే ప్రకటిస్తుంది. 

విప్రో కంపెనీ ప్రమోటర్లు కూడా బైబ్యాక్‌లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ద్వారా జరిగే వాటాదారుల ఆమోదంపై ఇది ఆధారపడి ఉంటుంది. కంపెనీ ప్రమోటర్లకు ప్రస్తుతం 72.92 శాతం వాటా ఉంది. కంపెనీలు విదేశీ ఇన్వెస్టర్లు (FIIలు) 6.42 శాతం, మ్యూచువల్ ఫండ్‌ మేనేజర్లు ‍‌(DIIలు) 2.74 శాతం కలిగి ఉన్నారు.

విప్రో స్టాక్ చాలా కాలంగా స్వల్ప పరిధిలోనే ట్రేడవుతోంది. ఈ షేరు గత ఒక ఏడాది కాలంలో 28 శాతం, రెండేళ్లలో 21 శాతం పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD) దాదాపు 5 శాతం నష్టపోయింది. విప్రో స్టాక్‌పై ఇన్వెస్టర్లు చాలాకాలంగా ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. దీంతో, సెంటిమెంట్‌ను మెరుగుపరచడానికి, ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపడానికి షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని ఈ ఐటీ కంపెనీ నిర్ణయించింది.

చివరిసారిగా, 2020 నవంబర్‌లో షేర్ బైబ్యాక్ స్కీమ్‌తో ముందుకు వచ్చింది విప్రో. అప్పుడు, రూ. 400 ధర వద్ద రూ. 9,156 కోట్ల విలువైన 22.89 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. అంతకుముందు, 2019లో, ఒక్కో షేరుకు రూ. 325 చొప్పున  రూ. 10,500 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేసింది.

మార్చి త్రైమాసికం ఫలితాలు
2022-23 మార్చి త్రైమాసికంలో రూ. 3075 కోట్ల నికర లాభాన్ని విప్రో ప్రకటించింది. అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలోని లాభం రూ. 3,087.3 కోట్లతో పోలిస్తే ఇది 0.4% తక్కువ. ఆదాయం 11.17% వృద్ధితో రూ. 23,190.3 కోట్లకు పెరిగింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభం 7.1% తగ్గి రూ. 11,350 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలంలో ఆదాయం 14.4% వృద్ధితో రూ. 90,487.6 కోట్లకు చేరింది. 

డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే, మార్చిలో సిబ్బంది వలసలు (అట్రిషన్‌) 330 bps తగ్గి 14.1 శాతానికి పరిమితమైంది. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీలో ఉద్యోగుల మొత్తం సంఖ్య 2,58,744గా ఉండగా... మార్చి చివరి నాటికి 1,823 తగ్గి 2,56,921కి పరిమితమైంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

FASTag Annual Pass Fees: వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
వాహనదారులకు షాక్: ఏప్రిల్ 1 నుండి ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ ధరల పెంపు
Adobe CEO Shantanu Narayen : అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా - ఏఐ ఎఫెక్టే ?
Sensex tumbles: మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
మార్కెట్‌పై వార్ ఎఫెక్ట్ - ఒక్క రోజే 16 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మాయం!
Iran war threat: యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?
యుద్ధం ప్రభావంతో చమురు మంటలు పైపైకి! టెన్షన్ పెడుతున్న బంగారం! సామాన్యుడిపై ప్రభావం ఎంత?

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget