అన్వేషించండి

Indian Currency Notes: ఇండియన్ కరెన్సీ నోట్లపై సంతకం చేసిన తొలి ఆర్బీఐ గవర్నర్ ఆయనే

Indian Currency Notes: అన్ని భారతీయ కరెన్సీ నోట్లపై ఆర్బీఐ గవర్నర్ పేరు, సంతకం ఉంటుంది. అయితే ఆర్బీఐ తొలి నోటుపై ఏ గవర్నర్ పేరు ఉందో, ఎప్పుడు జారీ చేశారో తెలుసా? ఎప్పుడు విడుదలైందో తెలుసా ?

Indian Currency Notes : రూపాయి (Indian Rupee).. భారత అధికారిక మారక ద్రవ్యం. రూపాయి చెలామణీని భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రిస్తుంది. ₹, Rs, రూ. లను రూపాయికి గుర్తుగా వాడుతారు. ఇండియన్ కరెన్సీ అనగానే సాధారణంగా గుర్తొచ్చేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ గవర్నర్ సంతకం, నోటుపై ఉండే చిహ్నాలు, గాంధీ చిత్రం. వీటితో పాటు మరికొన్ని అంశాలు కూడా నోటుపై కనిపిస్తాయి. ప్రతి ఇండియన్ కరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంతకం ఉంటుంది. ఇది లేకుండా నోటు చెల్లదు. అయితే భారతీయ నోట్లపై తొలిసారిగా ఏ గవర్నర్ పేరును ముద్రించారు అని ఎప్పుడైనా ఆలోచించారా.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత విలువైన ఈ నోటు విలువను పెంచే గవర్నర్ సిగ్నేచర్ మొదటగా ఎవరు చేశారు.. దాని వెనుక స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నోట్లపై తొలిసారిగా కనిపించింది ఆయన పేరే

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 1935న స్థాపించినప్పటికీ.. స్థాపించిన మూడు సంవత్సరాల తర్వాత, జనవరి 1938లో, ఆర్హీఐ మొదటిసారిగా రూ.5 కరెన్సీ నోటును విడుదల చేసింది. ఈ నోటుపై 'కింగ్ జార్జ్ VI' చిత్రాన్ని ముద్రించారు. ఆ సమయంలో భారతదేశానికి రెండవ గవర్నర్ జేమ్స్ బ్రాడ్ టేలర్. అదే ఏడాది ఆర్‌బీఐ మళ్లీ రూ.10 నోట్లు, మార్చిలో రూ.100 నోట్లు, జూన్‌లో రూ.1,000, రూ.10,000 కరెన్సీ నోట్లను విడుదల చేసింది.

స్వాతంత్ర్యం తర్వాత నోటుపై మారిన చిత్రం

భారతదేశానికి స్వాతంత్యం వచ్చిన తర్వాత మొదటగా రూ.1 కరెన్సీ నోటును 1949లో రిజర్వ్ బ్యాంక్ జారీ చేసింది. 1947 సంవత్సరం వరకు రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన నోట్లపై బ్రిటీష్ రాజు జార్జ్ బొమ్మ ముద్రించారు. కానీ స్వతంత్ర భారతదేశంలో మొదటి 1 రూపాయి నోటుపై, కింగ్ జార్జ్ చిత్రం స్థానంలో సారనాథ్ నుండి అశోక స్తంభం సింహం రాజధాని చిహ్నంతో కొత్త బ్యాంకు నోట్లు జారీ చేశారు. అప్పుడు ఆర్బీఐ గవర్నర్ గా బెంగాల్ రామారావు ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1969లో గాంధీజీ స్మారకార్థం తొలిసారిగా రూ.100 నోట్లను విడుదల చేసింది.

గాంధీజి చిత్రాన్ని అప్పుడే చేర్చారు

గాంధీజీ 100వ జయంతి సందర్భంగా 1969 వరకు కరెన్సీ నోటుపై గాంధీజీ చిత్రం మొదటిసారి కనిపించింది. ఇందులో మహాత్మా గాంధీ కూర్చున్నట్లు కనిపించేవారు. సేవాగ్రామ్ ఆశ్రమం బ్యాగ్రౌండ్ లో ఉండేది. 1987లో మహాత్మా గాంధీ చిత్రపటం భారతీయ నోట్లపై సాధారణ అంశంగా మారింది. 1996లో, అప్పటి వరకు ముద్రించిన అన్ని బ్యాంకు నోట్ల స్థానంలో మహాత్మా గాంధీ ఫొటోతో నోట్లు విడుదల అయ్యాయి. 
భారతీయ కరెన్సీ నోట్లపై కనిపించే గాంధీ చిత్రాన్ని పెయింటింగ్ అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజానికి క్యారికేచర్ (Caricature) కాదు. 1946లో తీసిన గాంధీ ఫొటోలోని భాగాన్నే కరెన్సీ నోటుపై ముద్రించారు. అప్పుడు తీసిన ఫొటోలో, బ్రిటిష్ రాజకీయవేత్త లార్డ్ ఫ్రెడరిక్ విలియం పెథిక్-లారెన్స్‌తో గాంధీ నిలబడి ఉంటారు. గాంధీ చిరునవ్వుతో ఉన్న ఫొటో, మంచి ఎక్స్‌ప్రెషన్‌గా భావించి దీన్ని ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని కరెన్సీ నోట్లు గాంధీ చిత్రంతోనే విడుదల అవుతున్నాయి.

భారతదేశ మొదటి గవర్నర్

ఆర్బీఐ తొలి గవర్నర్ సర్ ఓస్బోర్న్ స్మిత్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1935, ఏప్రిల్ 1న స్థాపించారు. ఒస్బోర్న్ స్మిత్ 1 ఏప్రిల్ 1935న ఆర్బీఐ మొదటి గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో, స్మిత్ ఒక ప్రొఫెషనల్ బ్యాంకర్ గా ఉన్నారు. బ్యాంక్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో 20 సంవత్సరాలు పనిచేశారు. కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియాలో 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, స్మిత్.. 1926లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకమై భారతదేశానికి వచ్చాడు. అయితే ఆయన హయాంలో ఆర్బీఐ నోట్లను విడుదల చేయలేదు.

Also Read : Flight Journey Rules: ఫ్లైట్‌లో 7 కిలోల లగేజ్‌కు మాత్రమే అనుమతి - హ్యాండ్ బ్యాగ్ బరువును కూడా కలుపుతారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Advertisement

వీడియోలు

విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
హార్దిక్ కాళ్ళు మొక్కిన ఫ్యాన్ డేంజర్ లో పాండ్య, కోహ్లీ.. ఇంకా!
రివెంజ్‌ ముఖ్యం బిగిలు.. సిరీస్ కొట్టేయాలని పట్టుదలగా ఉన్న టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
India Team For South Africa T20 series: దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఆడే ఇండియా జట్టు ఇదే! తిరిగి టీంలోకి వచ్చిన శుభ్‌మన్ గిల్
దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఆడే ఇండియా జట్టు ఇదే! తిరిగి టీంలోకి వచ్చిన శుభ్‌మన్ గిల్
Embed widget