అన్వేషించండి

Paytm Shares: రూ.2150కి అమ్మి రూ.640కి షేర్లు కొన్న పేటీఎం ఎండీ!!

Paytm Shares: పేటీఎం ఎండీ విజయ శేఖర శర్మ తన కంపెనీ షేర్లను తిరిగి కొనుగోలు చేశారు. ఓపెన్‌ మార్కెట్లో రూ.11 కోట్ల విలువైన 1.7 లక్షల కోట్ల షేర్లను తీసుకున్నారు.

Paytm Shares:  పేటీఎం ఎండీ విజయ శేఖర శర్మ తన కంపెనీ షేర్లను తిరిగి కొనుగోలు చేశారు. ఓపెన్‌ మార్కెట్లో రూ.11 కోట్ల విలువైన 1.7 లక్షల కోట్ల షేర్లను తీసుకున్నారు. మే 30, 31న ఆయన షేర్లు కొనుగోలు చేశారని సెబీ పత్రాల ద్వారా తెలిసింది. మే 30న రూ.6.31 కోట్లతో 100,552 షేర్లు, మే 31న రూ.4.68 కోట్లతో 71,469 షేర్లను ఆయన కొన్నారు.

గతేడాది నవంబర్లో పేటీఎం ఐపీవోకు (Paytm) వచ్చింది. నిబంధనల ప్రకారం ఇష్యూకు వచ్చిన ఆరు నెలల వరకు కంపెనీ యాజమాన్యం తమ షేర్లను కొనుగోలు చేయకూడదు. ఈ గడువు ముగియడంతో విజయ శేఖర శర్మ షేర్లను కొన్నారు. మరో ఆరు నెలల్లో పేటీఎం ఎబిటా బ్రేక్‌ఈవెన్‌ అవుతుందని మార్చిలో ఆయన షేర్‌హోల్డర్లతో చెప్పారు. అభివృద్ధి ప్రణాళికల విషయంలో ఏ మాత్రం రాజీ పడబోమని స్పష్టం చేశారు. పేటీఎం షేర్లను కొనుగోలు చేయొచ్చని ఈ మధ్యే గోల్డ్‌మన్‌ సాచెస్‌ సైతం రికమెండ్‌ చేయడం గమనార్హం.

భారత్‌లోని అతిపెద్ద ఐపీవోల్లో ఒకటిగా పేటీఎం నిలిచింది. రూ.2,150ను ఇష్యూ ధరతో మార్కెట్లో నమోదైంది. ఈ ఫిన్‌టెక్‌ కంపెనీ వాల్యుయేషన్స్‌ ఎక్కువగా భావించడంతో ఆ తర్వాత షేర్ల ధర పతనమైంది. కొన్ని రోజుల క్రితం రూ.511 వద్ద ఆల్‌టైం కనిష్ఠాన్ని నమోదు చేసింది. శుక్రవారం రూ.613 వద్ద ఓపెనై రూ.32 లాభంతో రూ.646 వద్ద ముగిసింది. పేటీఎం షేరు మే 30న రూ.630, మే 31న రూ.652 వద్ద ముగిసింది. రూ.640ని సగటు ధరగా తీసుకున్నా పేటీఎం సీఈవోకు ఒక్కో షేరుపై రూ.1510 లాభం వచ్చినట్టే! మొత్తంగా రూ.11 కోట్లు లాభం.

Also Read: అంబానీ మరో మాస్టర్‌ ప్లాన్‌! ఆ అమెరికా కంపెనీని కొంటున్నారా!

పేటీఎం 2022 Q2 ఫలితాలు

2021, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.481 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాస్‌ను నమోదు చేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికం నష్టం రూ.376 కోట్లతో పోలిస్తే ఇది మరింత ఎక్కువ కావడం గమనార్హం. ఇక గతేడాది ఇదే త్రైమాసికంతో పేటీఎం రూ.435 కోట్ల నష్టం నమోదు చేసింది.

వార్షిక కార్యనిర్వాహక రాబడి 64 శాతం పెరిగి రూ.1086 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ఇది రూ.663 కోట్లు కావడం గమనార్హం. యూపీఐ యేతర చెల్లింపుల్లో ఆదాయం 52 శాతం పెరగ్గా ఇతర సేవలు, ఆర్థిక సేవల్లో మూడు రెట్లు పెరిగింది. పేటీఎం స్టాక్‌ మార్కెట్లో నమోదైన తర్వాత ఫలితాలు విడుదల చేయడం ఇదే మొదటి సారి.

వార్షిక ప్రాదిపదికన చెల్లింపులు, ఆర్థిక సేవల ఆదాయం 69 శాతం పెరిగి రూ.842 కోట్లు నమోదైంది. కామర్స్‌, క్లౌడ్‌ సేవలు ఆదాయం 47 శాతం పెరిగి రూ.243 కోట్లుగా ఉంది. ఈ క్వార్టర్లో ఆర్థిక సేవల, ఇతర రాబడి 250 శాతం పెరిగి రూ.88.70 కోట్లుగా ఉంది. తమ గ్రాస్‌ మర్చండైజ్‌ విలువ (GMV) వార్షిక ప్రాతిపదికన 107 శాతం పెరిగి రూ.1,95,600 కోట్లుగా ఉంది. అక్టోబర్‌లో జీఎంవీ రూ.83,200 కోట్లుగా ఉండేది. ఇక నెలవారీ జీఎంవీ సగటున రూ.11,369 కోట్లుగా ఉంటోందని కంపెనీ తెలిపింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget