అన్వేషించండి

Byjus: బైజూస్‌కు మరో ఎదురు దెబ్బ, 53 కోట్ల డాలర్లు ఫ్రీజ్‌ చేసిన కోర్టు

Byjus: ఆ డబ్బును ఎడ్‌టెక్ సంస్థ ఉపయోగించకుండా చూడాలని, ఆ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని అమెరికన్‌ కోర్టుకు రుణదాతలు విజ్ఞప్తి చేశారు.

Byjus Crisis: ఊపిరాడని సమస్యల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. ఓ కేసు విషయంలో, బైజూస్‌ మాతృ సంస్థ 'థింక్ & లెర్న్‌'కు (Think & Learn) పిడుగు లాంటి ఆదేశం అందింది. శుక్రవారం, ఒక అమెరికన్ కోర్టు బైజూస్‌కు చెందిన 533 మిలియన్‌ డాలర్లను ఫ్రీజ్‌ చేసింది. ఆ డబ్బును ఎక్కడా ఉపయోగించరాదని తన ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. కంపెనీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్న రుణదాతల విజయంగా దీనిని చెప్పుకోవచ్చు. తాము ఇచ్చిన అప్పులను తిరిగి తీర్చడానికి మాత్రమే ఆ డబ్బును ఉపయోగించాలన్నది రుణదాతల డిమాండ్.

గుర్తు తెలియని చోటుకు డబ్బు బదిలీ
న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న తర్వాత, 'థింక్ అండ్ లెర్న్' ఈ 533 మిలియన్‌ డాలర్లను మోర్టాన్స్ హెడ్జ్ ఫండ్‌కు బదిలీ చేసిందని విచారణ సమయంలో రుణదాతలు ఆరోపించారు. ఆ తర్వాత ఆ డబ్బు పేరు లేని విదేశీ ట్రస్ట్‌కు బదిలీ అయిందని కోర్టుకు చెప్పారు. ఆ డబ్బును ఎడ్‌టెక్ సంస్థ ఉపయోగించకుండా చూడాలని, ఆ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని అమెరికన్‌ కోర్టుకు రుణదాతలు విజ్ఞప్తి చేశారు.

బైజు రవీంద్రన్ సోదరుడే టార్గెట్
బైజూ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు సోదరుడు, కంపెనీ డైరెక్టర్ రిజు రవీంద్రన్‌పై యూఎస్‌ కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. 533 మిలియన్‌ డాలర్లు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని ఆదేశించింది. ఆ డబ్బు గురించి తనకు తెలీదని రిజు రవీంద్రన్‌ చెప్పారు. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడుందో తెలీదన్న రిజు రవీంద్రన్‌ మాటల్ని తాను నమ్మలేకపోతున్నాను అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. డబ్బు ఎక్కడ ఉందన్న విషయంలో రుణదాతలకు 'థింక్ అండ్ లెర్న్' ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని పశ్నించారు. థింక్ అండ్ లెర్న్‌లో కొనసాగుతున్న సంక్షోభానికి రుణదాతలే బాధ్యులని రవీంద్రన్ తరఫు న్యాయవాది షారన్ కార్పస్ వాదించారు. ఆ వ్యక్తులే లోన్ డిఫాల్ట్ విషయంలో తమపై చాలా ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. డెలావేర్, న్యూయార్క్ కోర్టుల్లోనూ రుణదాతలతో బైజూస్‌ పోరాడుతోంది.

హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడు అరెస్ట్
గతంలో, థింక్ అండ్ లెర్న్ ద్వారా ఏర్పాటైన హోల్డింగ్ కంపెనీ 'ఆల్ఫా'ను రుణదాతలు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. 1.2 బిలియన్‌ డాలర్ల రుణ సేకరణ కోసం ఆల్ఫాను సృష్టించారు. ఆల్ఫా కంపెనీ, కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ కంపెనీని రుణదాతలు స్వాధీనం చేసుకోవడంపై రవీంద్రన్ డెలావేర్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 

మరోవైపు, ఫ్లోరిడా హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడిని అరెస్టు చేయాలని అమెరికన్‌ న్యాయస్థానం ఆదేశించింది. థింక్ అండ్ లెర్న్, 533 మిలియన్‌ డాలర్లను ఎక్కడ దాచిందో చెప్పడానికి అతను నిరాకరించాడు. ఆ డబ్బు గురించి సమాచారం ఇచ్చే వరకు, రోజుకు 10 వేల డాలర్ల చొప్పున జరిమానా చెల్లించాలని ఫ్లోరిడా హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడి కోర్టు ఆదేశించింది.

మరో ఆసక్తికర కథనం: 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Embed widget