అన్వేషించండి

EPFO Wage Ceiling: వేతన జీవులకు త్వరలోనే కేంద్రం గుడ్ న్యూస్ - ఈపీఎఫ్ఓ పరిమితి రూ.21 వేలకు పెంపు!

EPFO: ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఏ వేతన పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Union Government Soon To Raise EPFO Wage Ceiling: వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈపీఎఫ్ఓ (EPFO) వేతన పరిమితిని పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుతం ఈపీఎఓ గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలు ఉండగా.. దాన్ని రూ.21 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుని వీలైనంత త్వరగా ప్రకటన చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పలు జాతీయ మీడియా కథనాలు విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా వెల్లడించాయి. అలాగే, ఈపీఎఫ్ఓలో ఉద్యోగుల సంఖ్యను పట్టి కంపెనీల నమోదు తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని కూడా తగ్గించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం 20 అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న కంపెనీలు తప్పనిసరిగా ఈపీఎఫ్ఓలో చేరాల్సి ఉండగా.. ఆ సంఖ్యను 10 - 15కు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపైనా ఆ భారం పడుతుంది. కానీ, ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది.

ఉద్యోగులకు ప్రయోజనం ఇలా..

కంపెనీలు ఉద్యోగుల బేసిక్ సాలరీ, డీఏ ఆధారంగా ప్రావిడెంట్ ఫండ్‌కు నగదు మొత్తాలను నెల నెలా జమ చేస్తాయనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, దీనికి సమానంగా యాజమాన్యం ద్వారా మరో 12 శాతం పీఎఫ్ ఖాతాకు వెళ్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వేతన పరిమితిని పెంచితే దాని వల్ల ఉద్యోగుల పీఎఫ్ ఖాతాకు జమ అయ్యే మొత్తం పెరగనుంది. దీనికి సంబంధించిన వేతన పరిమితే ప్రస్తుతం రూ.15 వేలుగా ఉంది. దీన్నే రూ.21 వేలకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఇదే పెరిగితే ఇప్పటివరకూ రూ.15 వేలు ప్రాతిపదికన పీఎఫ్ ఖాతాకు జమవుతున్న మొత్తాలు.. ఇకపై రూ.21 వేల ప్రాతిపదికన జమవుతాయి.

దీంతో ఉద్యోగి రిటైర్మెంట్ ఫండ్‌కు నిధులు పెరుగుతాయి. ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు కంపెనీల ద్వారా వెళ్లే 12 శాతంలో 8.33 శాతం సొమ్ము సదరు ఉద్యోగి పెన్షన్ ఖాతాకు వెళ్తుంది. మిగతా 3.67 శాతం ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమవుతుంది. ఉద్యోగి నుంచి తీసుకునే మొత్తాలు మాత్రం పూర్తిగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలోకే వెళ్తాయి. గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేరకు ఉద్యోగి, యజమాని చెల్లించాల్సిన వాటా పెరుగుతుంది. దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన భవిష్యనిధి నిల్వలను పెంచుకోవడానికి వీలు పడుతుంది. అలాగే, ప్రభుత్వం నుంచి కూడా 1.16 శాతం ఉద్యోగుల పెన్షన్ పథకంలోకి వచ్చి చేరుతుంది.

2014లో చివరిసారిగా పెంపు..

కాగా, కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 2014లో శాలరీ లిమిట్‌ను పెంచింది. రూ.6,500గా ఉన్న పరిమితిని రూ.15 వేలకు మార్చింది. 1952లో ఈ పథకం ప్రారంభించగా.. అప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది సార్లు వేతన పరిమితిని పెంచారు.

Also Read: PM Internship Scheme : పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రిజిస్ట్రేషన్ గడువు పెంపు-రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
US Iran War: 48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
48 గంటల్లోగా హర్మూజ్ తెరుచుకోకపోతే ఊహించని విధ్వంసం... ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Embed widget