అన్వేషించండి

Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!

Mobile Bill: టెలికాం కంపెనీలు 15 నుంచి 17 శాతం వరకు టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే, టెలికాం కంపెనీలు దీనిపై ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు.

Telecom Companies Likely To Hike Tariff: చాలా కాలం తర్వాత, ద్రవ్యోల్బణం (Inflation) దెబ్బ నుంచి మన దేశ ప్రజలు ఇప్పుడిప్పుడే కాస్త కోలుకోవడం ప్రారంభించారు. అయితే, మీ జేబుకు చిల్లుపడే మరో సమస్య త్వరలోనే ఎదురుకావచ్చు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త షాక్‌ తగలొచ్చు.

టారిఫ్‌ పెంచే ప్లాన్‌లో టెలికాం కంపెనీలు!
మన దేశంలో ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్‌ జియో ‍‌(Reliance Jio), ఎయిర్‌టెల్‌ (Airtel) తమ టారిఫ్‌లు పెంచే యోచనలో ఉన్నాయని సమాచారం. మన దేశంలో లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) పూర్తైన తర్వాత, ప్లాన్‌ రేట్లను పెంచుతూ ఈ కంపెనీలు ఏ నిమిషంలోనైనా ప్రకటన చేయవచ్చు. ఇదే జరిగితే, జూన్‌లో ముగిసే ఎన్నికల తర్వాత మొబైల్ ఫోన్ల వాడడం మరింత ఖరీదుగా మారుతుంది.

ఇటీవల, యాంటిక్ స్టాక్ బ్రోకింగ్‌ను ఉటంకిస్తూ పీటీఐ ఈ వార్తను రిపోర్ట్ చేసింది. రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ ప్లాన్‌ రేట్లను పెంచవచ్చని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అభిప్రాయపడింది. ఎన్నికల తర్వాత ఈ టెలికాం కంపెనీలు 15 నుంచి 17 శాతం వరకు టారిఫ్‌లు పెంచే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే, టెలికాం కంపెనీలు దీనిపై ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు.

యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ చెప్పిన ప్రకారం.. టారిఫ్‌లు పెంచడం వల్ల టెలికాం కంపెనీలు లాభపడబోతున్నాయి. భారతి ఎయిర్‌టెల్ అతి పెద్ద లబ్ధిదారుగా ఉంటుంది. ఎయిర్‌టెల్ ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ARPU) ప్రస్తుతం 208 రూపాయలుగా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇది 286 రూపాయలకు పెరగొచ్చని అంచనా. యాంటిక్ స్టాక్ బ్రోకింగ్‌ నివేదిక ప్రకారం, జియో ప్రస్తుతం టెలికాం పరిశ్రమలో అతి పెద్ద కంపెనీ. గత 5-6 సంవత్సరాల్లోనే జియో మార్కెట్ వాటా 21.6 శాతం నుంచి 39.7 శాతానికి పెరిగింది.

మూడు సర్కిళ్లలో కలిపి కోటి మందికి పైగా 5G వినియోగదార్లను యాడ్‌ చేసుకున్నట్లు భారతి ఎయిర్‌టెల్ ఇటీవల ప్రకటించింది. తమిళనాడులో 5.9 మిలియన్ల (59 లక్షల మంది) 5G యూజర్లు, గుజరాత్‌లో 3 మిలియన్ల (30 లక్షలు) యూజర్లు, జమ్ముకశ్మీర్ & లద్దాఖ్‌లో 1.2 మిలియన్ల (12 లక్షలు) వినియోగదార్లు తమ యూజర్‌ బేస్‌లో చేరినట్లు వెల్లడించింది.

జూన్ మొదటి వారం వరకు ఎన్నికలు 
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్‌ ఈ రోజు (19 ఏప్రిల్‌ 2024 ) నుంచి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ జూన్ మొదటి వారంలో పూర్తవుతుంది. జూన్ 01న చివరి (ఏడో) దశ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 04న వెల్లడవుతాయి.

ఈ ఏడాది మార్చి నెలలో, ద్రవ్యోల్బణం నుంచి సామాన్య ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 మార్చి నెలలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ రేట్‌ 5 శాతం దిగువకు వచ్చింది.

మరో ఆసక్తికర కథనం: యుద్ధ భయంతో పసిడికి రెక్కలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget