అన్వేషించండి

TCS: టీసీఎస్‌ సీఈవో రాజీనామా, కొత్త బాస్‌ పేరును వెంటనే ప్రకటించిన కంపెనీ

రాజేష్ గోపీనాథన్ వారసుడిగా కె.కృతివాసన్‌ను తదుపరి సీఈవోగా తక్షణం నియమించింది.

TCS MD & CEO Rajesh Gopinathan Resigns: దేశంలోనే అతి పెద్ద IT కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో అత్యున్నత స్థాయి నాయకత్వ మార్పు జరిగింది. టీసీఎస్‌ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజేష్ గోపీనాథన్, తన రాజీనామా చేశారు. కంపెనీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రాజేష్ గోపీనాథన్ వారసుడిగా కె.కృతివాసన్‌ను తదుపరి సీఈవోగా తక్షణం నియమించింది. 

"2023 మార్చి 16 నుంచి అమల్లోకి వచ్చేలా కె.కృతివాసన్‌ తదుపరి CEOగా డైరెక్టర్ల బోర్డు నామినేట్‌ చేసింది. సంస్థలో 1989 నుంచి వివిధ హోదాల్లో ఉన్న వాసన్‌, 2023-24లో MD & CEOగా బాధ్యతలు స్వీకరిస్తారు" అని అధికారిక ప్రకటనలో TCS పేర్కొంది.

సెప్టెంబరు 15 వరకు అదే హోదా
రాజేష్ గోపీనాథన్ రాజీనామనా చేసినా, ఈ ఏడాది సెప్టెంబరు 15 వరకు అదే హోదాలో కొనసాగుతారు. CEO పీఠంపై కృతివాసన్‌ నిలదొక్కుకునేలా సూచనలు చేస్తారు. నాయకత్వ మార్పు సాఫీగా జరిగేలా చూస్తారు.

కె.కృతివాసన్ (K Krithivasan) ప్రస్తుతం కంపెనీ ప్రెసిడెంట్‌గా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్‌ ఇన్సూరెన్స్ (BFSI) బిజినెస్ గ్రూప్‌నకు గ్లోబల్ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత 34 సంవత్సరాలుగా TCSతో అనుబంధం కలిగి ఉన్నారు. 

రాజేష్ గోపీనాథన్‌ TCSలో 22 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. గత ఆరేళ్లుగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టీసీఎస్‌ సీఈవో ఛైర్‌ నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా 2017 ఫిబ్రవరిలో ఎన్‌.చంద్రశేఖరన్‌ బాధ్యతలు స్వీకరించిన సమయంలోనే, చంద్రశేఖరన్‌ వారసుడిగా గోపీనాథన్‌ వచ్చారు. అప్పటి నుంచి టీసీఎస్‌ను ముందుండి నడిపిస్తున్నారు.

కొత్త జీవితం కోసం రాజీనామా      
టీసీఎస్‌తో 22 ఏళ్ల ప్రయాణం చాలా ఉత్తేజకరమైనదని, రాజీనామా ప్రకటన తర్వాత రాజేష్ గోపీనాథన్ వెల్లడించారు. తన జీవితంలోని తదుపరి దశలో ఏం చేయాలన్నదానిపై తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయని, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి 2023 సరైన సమయమని, అందుకే టీసీఎస్‌ నుంచి బయటకు వెళుతున్నట్లు తెలిపారు. ఎన్.చంద్రశేఖరన్‌తో కలిసి పనిచేసిన అనుభవం చాలా ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. కె.కృతివాసన్‌తో కలిసి పనిచేసిన అనుభవాలపైనా మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా క్రితితో కలిసి పనిచేశానని, టీసీఎస్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లగల సమర్థుడని తాను నమ్ముతున్నానని, కృతి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తానని గోపీనాథన్ చెప్పారు.

రాజేష్ గోపీనాథన్ హయాంలో టీసీఎస్‌ బిజినెస్‌ 10 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగిందని, మార్కెట్‌ విలువ కూడా 70 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగిందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు

ఐటీ రంగంలో, కేవలం వారం రోజుల వ్యవధిలోనే దలాల్‌ స్ట్రీట్‌ చూసిన రెండో అతి పెద్ద నాయకత్వ మార్పు ఇది. ఇన్ఫోసిస్‌ (Infosys) ప్రెసిడెంట్‌ పదవికి గత వారం రాజీనామా చేసిన మోహిత్‌ జోషి, టెక్‌ మహీంద్రలో (Tech Mahindra) చేరారు. డిసెంబర్‌లో పదవీ విరమణ చేయనున్న సీపీ గుర్నానీ స్థానంలో ఆ కంపెనీ MD & CEO గా జోషి విధులు నిర్వహిస్తారు.        

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Kishan Reddy : ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
ఏడాదికే కాంగ్రెస్ పై అసంతృప్తి.. ఇక వచ్చేది బీజేపీనే - తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు : కిషన్ రెడ్డి
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Sai Pallavi: 'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
'జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉంది' - సాయిపల్లవి అమ్మమ్మ చీర సెంటిమెంట్ నెరవేరుతుందా?
Stampedes in Railway Stations: రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఇదే మొదటిసారి కాదు.. గతంలో ఎన్నో విషాదాలు!
Jayalalitha Assets: 1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
1.2 కిలోల వడ్డానం, 1.5 కిలోల ఖడ్గం.. చెన్నైకి చేరిన జయలలిత 27 కిలోల బంగారం
Yashasvi Jaiswal:  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్లేయర్ దూరం.. గాయం కారణంగా స్వదేశంలో..
New Delhi Railway Station Stampede: ఢిల్లీలో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాటపై రైల్వే శాఖ కీలక నిర్ణయం, విచారణ కమిటీ ఏర్పాటు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.