Andhra Pradesh Investments: ఏపీవైపు బడా పారిశ్రామికవేత్తల చూపు - కడప, కర్నూలు, కాకినాడల్లో భారీ పెట్టుబడుల ప్రకటన
Invest Andhra Pradesh: కడప, కర్నూలు, కాకినాడల్లో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు, అయిల్ ప్లాంట్లు ఇందులో ఉన్నాయి.

Investments in Kadapa Kurnool and Kakinada: ఆంధ్రప్రదేశ్లో అనుకూల పారిశ్రామిక వాతావరణం ఉండటంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ (AWHCL) సబ్సిడియరీ సంస్థ అయిన ఆంటోనీ లారా ఎన్విరో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్లోని కడప , కర్నూలు క్లస్టర్లలో రూ. 3,200 కోట్ల విలువైన వేస్ట్-టు-ఎనర్జీ (WTE) ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (NREDCAP)తో ఒప్పందాలు చేసుకుంది.
కడప , కర్నూలు క్లస్టర్లలో ఒక్కొక్కటి సుమారు 15 మెగావాట్ల (MW) సామర్థ్యం కలిగిన రెండు వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లు నిర్మిస్తారు. ప్రతి ప్రాజెక్టు రూ. 1,600 కోట్ల విలువైనది, మొత్తం రూ. 3,200 కోట్లు. కన్సెషన్ ఒప్పందం సంతకం, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (PPA) అమలు, లేదా భూమి బదిలీ తేదీ నుంచి సుమారు 24 నెలల్లో నిర్మాణం పూర్తవుతుంది. రెండు ప్రాజెక్టులకు 20 సంవత్సరాల కన్సెషన్ వ్యవధి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) విద్యుత్ను కొనుగోలు చేస్తుంది. కడప, కర్నూలు ప్రాంతాలకు సరఫరా చేస్తారు. ప్రతి ప్లాంట్లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (MRF) ఏర్పాటు చేస్తారు. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ (MSW)ను ఆటోమేటెడ్ సార్టింగ్ ద్వారా రీసైక్లింగ్, ఆర్గానిక్ వేస్ట్ ట్రీట్మెంట్, థర్మల్ ట్రీట్మెంట్ కోసం ప్రాసెస్ చేస్తుంది. రీసైక్లింగ్ చేయలేని వ్యర్థాలను అధిక-సామర్థ్య ఇన్సినరేషన్ యూనిట్లలో శక్తిగా మార్చడానికి ఉపయోగిస్తారు.
ఈ ప్రాజెక్టులు రోజువారీ వేల టన్నుల వ్యర్థాలను ల్యాండ్ఫిల్ల నుంచి మళ్లిస్తాయి, మీథేన్ , CO₂ ఉద్గారాలను తగ్గిస్తాయి. స్వచ్ఛ భారత్ మిషన్ , భారతదేశ రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాలకు ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. కంపెనీ ఇప్పటికే 24 మున్సిపాలిటీలలో, ముంబై, నవీ ముంబై, ఢిల్లీ, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో వ్యర్థ నిర్వహణ సేవలను అందిస్తోంది.
🔥 Antony Waste Expands into Southern India with ₹3,200 Crore Waste-to-Energy Projects | MCap 1,642.61 Cr
— Investor Feed (@_Investor_Feed_) August 13, 2025
- Secured two new Waste-to-Energy (WTE) projects in Kadapa and Kurnool, Andhra Pradesh.
- Total contract value: ~₹3,200 crore (~₹1,600 crore per project).
- Each project… pic.twitter.com/7Bp5ZaYAkw
కాకినాడలో ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) రూ. 4,606.35 కోట్ల పెట్టుబడితో ఒక ప్రధాన ఆయిల్, గ్యాస్ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్-III (DSF-III) కింద ఆఫ్షోర్ బ్లాక్లను కవర్ చేస్తుంది. 10 డెవలప్మెంట్ వెల్స్ డ్రిల్లింగ్, 2 అన్మ్యాన్డ్ ఆఫ్షోర్ ప్లాట్ఫామ్ల ఏర్పాటు చేస్తారు. ఒడలరేవు టెర్మినల్ వద్ద ఆన్షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ నిర్మాణం జరుగుతుంది. మొత్తం 26.3 హెక్టార్ల భూమిలో 8.7 హెక్టార్లు గ్రీన్బెల్ట్గా అభివృద్ధి చేస్తారు. కోనసీమ జిల్లాలో ఆయిల్ , గ్యాస్ ఉత్పత్తిని పెంచడం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది.





















