అన్వేషించండి

Rahul reply to YS Jagan: స్టోరీలొద్దు ..రాహుల్‌తో కలిసి పోరాడు - జగన్‌కు కాంగ్రెస్ ఠాగూర్ రిప్లై - లాజిక్కేగా?

Congress leader Tagore: చంద్రబాబు, రేవంత్, రాహుల్ మధ్య హాట్ లైన్ ఉందన్న జగన్ వ్యాఖ్యలపై మాణిగం ఠాగూర్ స్పందించారు. ఓట్ చోరీపై రాహుల్ తో కలసి పోరాడాలని పిలుపునిచ్చారు.

Congress leader Tagore on Jagan:  స్టోరీలు వద్దు.. ఓట్ల చోరీ అంశంపై రాహుల్ పోరాటాన్ని అభినందించాలి.  మద్దతు పలకాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూడా ఓట్ చోరీ జరిగిందని కానీ రాహుల్ ఇక్కడి అంశాలపై మాట్లాడటం లేదన్నారు . చంద్రబాబు, రేవంత్, మోదీ మధ్య హాట్ లైన్ ఉందన్నారు. అందుకే మాట్లాడటం లేదన్నారు. అలాగే ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఏపీలో జరుగుతున్న అవినీతిపై మాట్లాడటం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ వెంటనే స్పందించారు. 

నిజాయితీ ఉంటే షర్మిల ర్యాలీలో పాల్గొనాలి! 
 
కథలు చెప్పవద్దని.. ధైర్యం ఉంటే రాహుల్ గాంధీకి మద్దతుగా పోరాటానికి రావాలని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ పిలుపునిచ్చారు.  గురువారం విజయవాడలో ఓటు చోరీకి వ్యతిరేకంగా షర్మిల ర్యాలీ చేస్తున్నారని అందులో పాల్గొనాలన్నారు.   రాహుల్ గాంధీ.. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నారని.. రాజకీయం కోసం కాదన్నారు. కేసుల కోసం అమిత్ షా ,మోదీకి సరెండర్ అయిపోయి రాహుల్ పై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించరాు.  జగన్ మోహన్ రెడ్డిలా రాహుల్ గాంధీ ఎవరికీ సరెండర్ కాలేదన్నారు. సోషల్ మీడియాలో ఈ మేరకు వీడియో విడుదల చేశారు. 

ఎన్నికల్లో తప్పులు జరిగిదే మోదీ, షా, ఈసీని కదా ప్రశ్నించాల్సింది !

జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయాక  జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు.  ఏపీ ఎన్నికల్లో ఓట్ల చోరీ అక్రమాలు జరిగితే., తప్పులు జరిగితే ఈసీ, మోదీ, షాను తప్పు పట్టాలి.. రాహుల్ ను కలిసి పోరాడుతున్న దానికి మద్దతు పలకాలి కానీ ఇలా మాట్లాడుతున్నారేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

రాహుల్ ఓట్ల చోరీ పోరాటానికి మద్దతు తెలుపని జగన్ మోహన్ రెడ్డి 

ఎన్నికల్లో ఓట్ల అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపిస్తున్నారు. ఈవీఎంలతోనే ఓడిపోయామని అంటున్నారు. కానీ రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓట్ల చోరీ ఉద్యమానికి ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. కానీ ఏపీలో లోపాలు జరిగాయని వాటిపై రాహుల్ స్పందించడం లేదని అంటున్నారు.  ఏపీలో అక్రమాలు జరిగాయని అంటున్న ఆయన మాత్రం మోదీ , ఈసీ, అమిత్ షాలపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా.. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడాలని అంటున్నారు. ఇదే రాజకీయవర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. అలా మాట్లాడకపోతే..  చంద్రబాబు, రేవంత్, రాహుల్ మధ్య హాట్ లైన్ ఉన్నట్లేనని చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ అంశంపై ఏపీలోనూ కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పుడు జగన్ మద్దతు పలకాలని కాంగ్రెస్ నేతలంటున్నారు. కానీ కాంగ్రెస్ కు మద్దతు తెలిపితే బీజేపీకి కోపం వస్తుందని జగన్ .. ధైర్యం చేయలేకపోతున్నారని అంటున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
YS Jagan: తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
తల్లి, చెల్లికి జగన్‌ అన్యాయం - వైసీపీకి ఇదే పెద్ద సమస్య - జగన్ ఏం పరిష్కారం వెదుకుతారు?
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
This Week OTT Movies : శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
Online Scams : ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
ఆన్​లైన్​ మోసాల నుంచి తప్పించుకోవాలంటే.. ఈ 5 టిప్స్ గుర్తుంచుకోండి, లేకపోతే భారీ నష్టం తప్పదు
Embed widget