అన్వేషించండి

SBI Bonds: రూ.10,000 కోట్లు సమీకరించిన ఎస్బీఐ - షేర్ల మూమెంటమ్‌ ఎలా ఉందంటే?

SBI Bonds: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్‌ బ్యాంకు రూ.10,000 కోట్లను సమీకరించింది. 7.49శాతం కూపన్‌ రేటుతో నాలుగో దఫా మౌలిక సదుపాయాల బాండ్లను విడుదల చేసింది.

SBI Bonds: 

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు భారతీయ స్టేట్‌ బ్యాంకు రూ.10,000 కోట్లను సమీకరించింది. 7.49శాతం కూపన్‌ రేటుతో నాలుగో దఫా మౌలిక సదుపాయాల బాండ్లను విడుదల చేసింది. ప్రావిడెంట్‌ ఫండ్లు, పెన్షన్‌ ఫండ్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్‌ పండ్లు, కార్పొరేట్లు ఈ ఇష్యూకు పెట్టుబడిదారులుగా ఉన్నారు. తక్కువ ధర ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలకు సుదీర్ఘ కాలం ఈ నిధులను ఉపయోగిస్తామని ఎస్బీఐ తెలిపింది.

ఎస్బీఐ రూ.10,000 కోట్లు సమీకరిస్తున్న విషయం తెలిసినప్పటికీ కంపెనీ షేర్లు సోమవారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. నేటి ఉదయం రూ.601 మొదలైన షేర్లు ఇంట్రాడేలో రూ.590 వద్ద కనిష్ఠాన్ని తాకాయి. రూ.601 వద్ద గరిష్ఠాన్ని అందుకున్నాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నాలుగు రూపాయల నష్టంతో రూ.594 వద్ద ట్రేడవుతున్నాయి. 

భారతీయ స్టేట్‌ బ్యాంకు బాండ్ల జారీకి పెట్టుబడిదారుల నుంచి చక్కని స్పందన లభించింది. రూ.21,045 కోట్ల విలువైన బిడ్లు దాఖలు చేశారు. కనీస ఇష్యూ పరిమాణమైన రూ.4000 కోట్ల కన్నా ఐదు రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు.

'మొత్తం 134 బిడ్లు రావడాన్ని బట్టి ఎక్కువ మంది పోటీపడ్డారని తెలుస్తోంది. ప్రావిడెంట్‌ ఫండ్లు, పెన్షన్‌ ఫండ్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్లు, కార్పొరేట్‌ కంపెనీలు ఇన్వెస్టర్లుగా ఉన్నారు. ఈ నిధులను సుదీర్ఘ కాలంలో మౌలిక సదుపాయాలు, అందుబాటు ధర గృహాల రంగంలో వినియోగిస్తాం' అని ఎస్బీఐ చెప్పింది. కాగా కంపెనీ ఆగస్టు ఒకటిన రూ.10,000 కోట్లు, జనవరి 19న రూ.9,718 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం విడుదల చేసిన బాండ్లకు స్థానిక రేటింగ్‌ ఏజెన్సీలు AAA రేటింగ్‌ను ఇవ్వడం గమనార్హం. ఇప్పటి ఇష్యూతో మొత్తంగా ఎస్బీఐ విడుదల చేసిన సుదీర్ఘ కాలపు బాండ్ల విలువ రూ.39,718 కోట్లకు చేరుకుంది. బ్యాంకు ఎప్పుడు బాండ్లను విడుదల చేస్తున్నా ఇన్వెస్టర్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుండటం గమనార్హం.

'సుదీర్ఘ కాలం బాండ్‌ కర్వ్‌ను అభివృద్ధి చేయడం, ఇతర బ్యాంకులు సుదీర్ఘ కాలపు బాండ్లు జారీ చేసేలా ప్రోత్సహించేందుకు మా ఇష్యూ సాయపడుతుందని విశ్వసిస్తున్నాం' అని ఎస్బీఐ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో వివిధ రుణ సాధనాల ద్వారా రూ.50,000 కోట్లను సమీకరిస్తామని జూన్‌ నెలలో స్టేట్‌ బ్యాంకు తెలిపింది. కాగా ఏప్రిల్‌ - జూన్‌ త్రైమాసికంలో కంపెనీ ఒక త్రైమాసికంలో అత్యధిక నికర లాభం రూ.16,884 కోట్లు నమోదు చేయడం గమనార్హం. బ్రోకరేజీ కంపెనీ ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ ఎస్బీఐ టార్గెట్‌ను రూ.743కు సవరించిన సంగతి తెలిసిందే. 

Stock Market Opening 25 September 2023:

భారత స్టాక్‌ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. బెంచ్‌మార్క్‌ సూచీలు సోమవారమూ నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆసియాలో మెజారిటీ సూచీలన్నీ నష్టపోవడం నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. పైగా అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు తోడయ్యాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 56 పాయింట్లు తగ్గి 19,618 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 179 పాయింట్లు తగ్గి 65,829 వద్ద కొనసాగుతున్నాయి. వినియోగ వస్తువులు మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rushikonda Palace Usage: రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు; లగ్జరీ హోటల్స్‌గా మార్చే ప్లాన్‌, ప్రజల కోసం సాంస్కృతిక వేదికలు!
రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు; లగ్జరీ హోటల్స్‌గా మార్చే ప్లాన్‌, ప్రజల కోసం సాంస్కృతిక వేదికలు!
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Sivaji Comments : శివాజీ Vs సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ - 'మంగపతి' కామెంట్స్ వివాదానికి చెక్ ఎప్పుడు?
శివాజీ Vs సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ - 'మంగపతి' కామెంట్స్ వివాదానికి చెక్ ఎప్పుడు?
Bangladesh Violence: తారిక్ రెహమాన్ తిరిగి రాకముందే బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ! ఢాకాలో బాంబు పేలుడులో ఒక వ్యక్తి మృతి!
తారిక్ రెహమాన్ తిరిగి రాకముందే బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ! ఢాకాలో బాంబు పేలుడులో ఒక వ్యక్తి మృతి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rushikonda Palace Usage: రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు; లగ్జరీ హోటల్స్‌గా మార్చే ప్లాన్‌, ప్రజల కోసం సాంస్కృతిక వేదికలు!
రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు; లగ్జరీ హోటల్స్‌గా మార్చే ప్లాన్‌, ప్రజల కోసం సాంస్కృతిక వేదికలు!
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Sivaji Comments : శివాజీ Vs సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ - 'మంగపతి' కామెంట్స్ వివాదానికి చెక్ ఎప్పుడు?
శివాజీ Vs సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ - 'మంగపతి' కామెంట్స్ వివాదానికి చెక్ ఎప్పుడు?
Bangladesh Violence: తారిక్ రెహమాన్ తిరిగి రాకముందే బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ! ఢాకాలో బాంబు పేలుడులో ఒక వ్యక్తి మృతి!
తారిక్ రెహమాన్ తిరిగి రాకముందే బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ! ఢాకాలో బాంబు పేలుడులో ఒక వ్యక్తి మృతి!
Damaged Kidney Recovery : కిడ్నీ చెడిపోయినా ఆరోగ్యంగా మార్చవచ్చా? తాజా అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
కిడ్నీ చెడిపోయినా ఆరోగ్యంగా మార్చవచ్చా? తాజా అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Telangana News:తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
తెలంగాణలో గ్రామాలకు వరాలు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి!
Embed widget