అన్వేషించండి

2000 Notes Deposit: రెండేళ్లు గడిచినా చెలాణిలో ఉన్న రూ.2000 నోట్లపై ఆర్బీఐ ప్రకటన

Reserve Bank of India : రెండేళ్లు గడిచినా చెలాణిలో ఉన్న రూ.2000 నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. వాటిని ఇంకా మార్చుకునే అవకాశం ఉంది.

Rs 2000 notes still in circulation | ముంబై: కేంద్ర ప్రభుత్వం రూ.2000 నోట్లను ఉపసంహరించుకుని రెండు సంవత్సరాలు గడిచినా వేలకోట్ల విలువ చేసే పెద్ద నోట్లు చెలామణిలో ఉన్నాయి. రూ.6,099 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో జూన్ నెలాఖరు నాటికి 98.29 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంకు తెలిపింది.

రూ.2000 నోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు మే 19, 2023న ప్రకటించింది. ఈ పెద్ద నోటును ఉపంసంహరణ ప్రకటన సమయంలో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రెండు వేల నోట్లు చెలామణిలో ఉన్నాయి. జూన్ 30, 2025 నాటికి వాటి విలువ రూ.6,099 కోట్లకు తగ్గిందని ఆర్‌బిఐ తాజా ప్రకటనలో తెలిపింది.

2000 నోట్లను ఎక్కడ డిపాజిట్ చేయాలి?
ఈ 2 వేల రూపాయల నోట్లను డిపాజిట్, మార్పిడి చేసుకునే సౌకర్యం అన్ని బ్యాంకు శాఖలలో 7 అక్టోబర్ 2023 వరకు అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం ఈ సౌకర్యం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కు చెందిన 19 కార్యాలయాలలో మాత్రమే అందుబాటులో ఉంది. RBI ఆఫీసులలో 9 అక్టోబర్ 2023 నుండి ప్రజలు లేదా సంస్థల నుండి 2000 రూపాయల నోట్లను వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. దాంతోపాటు దేశంలోని ఏ పోస్టాఫీసు నుండి అయినా ఇండియా పోస్ట్ ద్వారా ఏ RBI ఆఫీసులకు 2000 రూపాయల నోట్లను పంపి తమ బ్యాంకు ఖాతాలలో జమ చేసుకునే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది. 

100 శాతం నోట్లు రిటర్న్ రావడం వీలుపడదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్నినోట్లు ఎక్కడైనా భద్రపరిచి మరిచిపోవడం జరుగుతుంది. బ్లాక్ మనీ ఉన్నా కూడా వాటిని వైట్ మనీగా మార్చలేని కారణంగా డిపాజిట్ చేసి మార్చుకోకపోవచ్చు. కొన్ని నోట్లు మిస్సయ్యే అవకాశాలు లేకపోలేదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ITR Filing : మీరు ITR ఫైల్ చేయలేదా? పొరపాట్లు ఉన్నా సరే.. మార్చి 31లోపు సవరించుకోండి, పూర్తి డిటైల్స్ ఇవే
మీరు ITR ఫైల్ చేయలేదా? పొరపాట్లు ఉన్నా సరే.. మార్చి 31లోపు సవరించుకోండి, పూర్తి డిటైల్స్ ఇవే
LPG Cylinder Truck Theft: ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
ఎంతకు తెగించార్రా..! ఝాన్సీలో గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. 524 సిలిండర్లు మాయం
Gold Types: బంగారం పసుపు మాత్రమే కాదు నలుపు, గులాబీ రంగులో వస్తుంది! పసిడి ఎన్ని రకాలు? వాటి మధ్య తేడా ఏంటీ?
బంగారం పసుపు మాత్రమే కాదు నలుపు, గులాబీ రంగులో వస్తుంది! పసిడి ఎన్ని రకాలు? వాటి మధ్య తేడా ఏంటీ?
Deep Sea Oil Extraction: సముద్రం లోతుల నుంచి చమురు, వాయువును ఎలా తీస్తారు? ఆ ప్రక్రియ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సముద్రం లోతుల నుంచి చమురు, వాయువును ఎలా తీస్తారు? ఆ ప్రక్రియ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
Embed widget