అన్వేషించండి

RBI Monetary Policy: రెపో రేటును 0.25 శాతం పెంచిన ఆర్‌బీఐ, బ్యాంక్‌ రుణాల మీద వడ్డీ రేట్లూ పెరుగుతాయ్‌

ఈ ఆర్థిక సంవత్సరంలో లెండింగ్‌ రేట్లను ఆర్‌బీఐ పెంచడం ఇది వరుసగా ఆరోసారి.

RBI Monetary Policy: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) మరోమారు వడ్డీ రేట్లను పెంచింది. దేశం యావత్తు ముందు నుంచి ఊహించనట్లుగానే, రెపో రెటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీంతో, మొత్తం రెపో రేటు 6.50 శాతానికి (RBI Repo Rate) చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో (2022-23) ఇదే చివరి పెంపు. 

తాజా పెంపుతో కలిపి, రెపో రేటును ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 225 బేసిస్‌ పాయింట్ల మేర రిజర్వ్‌ బ్యాంక్‌ పెంచింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత కఠినంగా మారిన ఆర్థిక మారిన పరిస్థితుల నేపథ్యంలో, 2022 మే నెల నుంచి రెపో రేటు పెంపును ఆర్‌బీఐ ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో లెండింగ్‌ రేట్లను ఆర్‌బీఐ పెంచడం ఇది వరుసగా ఆరోసారి. 

సోమవారం (06 ఫిబ్రవరి 2023) ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee - MPC) సమావేశంలో కాసేపటి క్రితం (08 ఫిబ్రవరి 2023న) ముగిసింది. ఆ సమావేశంలో తీసుకున్న వివిధ నిర్ణయాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై అంచనాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ ‍‌(Shaktikant Das) ప్రకటించారు. మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాల్లో అతి కీలకం రెపో రేటు. దీనిని 0.25 శాతం ( 25 బేసిస్‌ పాయింట్లు) పెంచేందుకు నిర్ణయించినట్లు శక్తికాంత దాస్‌ వెల్లడించారు. 

రెపో రేటు అంటే?
దేశంలోని వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఇచ్చే రుణం మీద విధించే వడ్డీ రేటు. రెపో రేటు పెరిగితే, ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాల మీద వడ్డీ భారం పెరుగుతుంది. ఆ భారాన్ని ప్రజలకు మీదకు నెట్టేస్తాయి బ్యాంకులు. ప్రజలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకు తాము ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లను పెంచడం ద్వారా, రెపో రేటు భారాన్ని బ్యాంకులు తగ్గించుకుంటాయి. ఫైనల్‌గా, రెపో రేటు పెరిగితే, బ్యాంకులు ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. వడ్డీ రేట్ల పెంపును బ్యాంకులు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

MPC నిర్ణయం ప్రకారం రెపో రేటును 0.25 శాతం పెంచినట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్‌ దాస్ ప్రకటించారు. ఈ పెంపు తర్వాత, దేశంలో రెపో రేటు గతంలోని 6.25 శాతం నుంచి ఇప్పుడు 6.50 శాతానికి పెరిగింది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు 0.25 శాతం రెపో రేటు పెంపునకు అనుగుణంగా ఓటు వేశారు. 

కఠిన వైఖరి కొనసాగుతుందన్న సంకేతాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర మార్పులు, అభివృద్ధి చెందిన దేశాల్లో అధిక ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అయినా ప్రపంచ స్థూల పరిస్థితులు అనేక సవాళ్లను మన ముందుకు తీసుకొచ్చాయని చెప్పారు. దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. అంటే, స్నేహపూర్వక విధానం కొనసాగించడం కుదరదని, ఆర్‌బీఐ కఠిన వైఖరి కొనసాగుతుందని పరోక్షంగా సంకేతం ఇచ్చారు.

2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధిని (GDP) 7 శాతంగా అంచనా వేసినట్లు శక్తికాంత దాస్‌ వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో చిల్లర ద్రవ్యోల్బణం 6.5 శాతంగా ఉండవచ్చని; 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 5.3 శాతంగా ఉండొచ్చని వెల్లడించారు. బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉందని, దీనినిఆర్‌బీఐ నిశితంగా గమనిస్తోందని గవర్నర్ చెప్పారు.

ఇవాళ ముగిసిన ఎంపీసీ సమావేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ 2023-24 ప్రకటన తర్వాత జరిగిన మొదటి ద్రవ్య విధాన సమీక్ష ఇది. 31 మార్చి 2023న ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ బ్యాంక్ నిర్వహించే చివరి MPC సమావేశం కూడా ఇదే.

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget