అన్వేషించండి

UPI payments: యూపీఐ పేమెంట్స్‌కి ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ అవసరం లేదు.. RBI కొత్త ఫీచర్‌

UPI for Feature phone: దేశ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో వాడుతున్న యూపీఐ సర్వీసులు ఇప్పుడు ఫీచర్‌ ఫోన్లోనూ పని చేస్తాయి. అంటే ఇప్పుడు యూపీఐ విధానంలో నగదు చెల్లింపులు చేసేందుకు ఇంటర్నెట్‌, స్మార్ట్‌ ఫోన్ అవసరం లేదు.

RBI launches UPI for Feature Phones: డిజిటల్‌ బ్యాంకింగ్‌ (Digital Banking), ఫైనాన్షియల్‌ ఇంక్లూషన్‌ (Financial Inclusion)  పరంగా భారత్‌ మరో ముందడుగు వేసింది! దేశ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో వాడుతున్న యూపీఐ సర్వీసులు (UPI Services) ఇప్పుడు ఫీచర్‌ ఫోన్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఫీచర్‌ ఫ్లోనో (Feature Phones) యూపీఐ సేవలను రిజర్వు బ్యాంక్ ఆఫ్‌ ఇండియా మంగళవారం ఆరంభించింది. అంటే ఇప్పుడు యూపీఐ విధానంలో నగదు చెల్లింపులు చేసేందుకు ఇంటర్నెట్‌ (Internet), స్మార్ట్‌ ఫోన్ (smart Phone) మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు.

యూపీఐ సర్వీసులు దేశంలో సంచలనం సృష్టించాయనే చెప్పాలి. ఒకప్పుడు ఏదైనా కొనుగోలు చేయాలంటే కేవలం నగదు లేదా క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించాల్సి వచ్చేది. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులకు ఊపొచ్చింది. ఐదు రూపాయల వస్తువు కొనుకున్నా ఆ మొత్తాన్ని పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యాప్స్‌ ద్వారా చేసేస్తున్నారు. ఇందుకు యూపీఐ సర్వీసునే ఉపయోగించుకుంటున్నారు.

దేశంలో 180 కోట్ల మొబైల్‌ ఫోన్‌ యూజర్లు ఉన్నారని అంచనా. ఇందులో 78 కోట్లు మాత్రమే స్మార్ట్‌ఫోన్లు. మిగతావన్నీ ఫీచర్‌ ఫోన్లు. గతంలో వీరు యూపీఐ సర్వీసులు ఉపయోగించుకొనేందుకు వీలుండేది కాదు. వీరందరినీ డిజిటల్‌ పేమెంట్స్‌ మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ నడుం బిగించింది. UPI123Pay అనే యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌ను తీసుకొచ్చింది. మంగళవారం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ ఈ సేవలను ఆరంభించారు.

'యూపీఐ123పే దేశంలోని కోట్లాది మందిని డిజిటల్‌గా ఎంపవర్‌ చేయనుంది. రోజుకు వంద కోట్ల కన్నా ఎక్కువ లావాదేవీలు సాధించాలన్న ఎన్‌పీసీఐ కలను సాకారం చేస్తుంది' అని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) ఛైర్మన్‌ బిశ్వమోహన్‌ మాహాపాత్ర అన్నారు. 'డిజిటల్‌ చెల్లింపుల్లో మనమెంతో వృద్ధి సాధించాం. కానీ ఈ డిజిటైజేషన్‌ కేవలం స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారికే పరిమితమైంది. దేశంలో 40 కోట్లకు పైగా ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు ఉన్నారు. వారు డిజిటల్‌ చెల్లింపులు చేయలేకపోతున్నారు. వారినీ యూపీఐ పేమెంట్‌ మెథడ్‌ పరిధిలోకి తీసుకురావడమే మా లక్ష్యం' అని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ రవి శంకర్‌ అన్నారు.

UPI123Pay ద్వారా ఫీచర్‌ ఫోన్ల నుంచి యూపీఐ లావాదేవీలు చేపట్టేందుకు వీలవుతుంది. స్మార్ట్‌ఫోన్లలో స్కాన్ చేయడం మినహా మిగతా అన్ని ఆప్షన్లను ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఇంటర్నెట్‌ అవసరం లేదు. ఈ సేవలు వాడుకోవడానికి యూజర్లు ముందుగా తమ బ్యాంకు ఖాతాలను ఫీచర్‌ ఫోన్‌కు లింక్‌ చేసుకోవాలి. అప్పుడు UPI123Pay ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొకరికి, మర్చంట్స్‌కు పేమెంట్‌ చేయొచ్చు. ప్రస్తుతానికి UPI123Pay హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలో మిగతా భాషల్లోకి విస్తరించనుంది.

టాప్ హెడ్ లైన్స్

EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
FMCG Price Hike: ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
ధరలు పెంచడానికి రెడీ అవుతున్న ఎఫ్‌ఎంసిజి బ్రాండ్లు! మీ ఇంటి బడ్జెట్‌పై ఎఫెక్ట్‌! 
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget