అన్వేషించండి

Ratan Tata Death Reason: రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?

Fact Behind Ratan Tata Death: రతన్‌ టాటా "లో బీపీ"తో (low blood pressure) ఇబ్బంది పడుతున్నారని ఆయన మరణానికి ముందు వార్తలు వచ్చాయి. అయితే, తన అనారోగ్య వార్తలను ఆయన స్వయంగా ఖండించారు.

Ratan Tata Died At 86 Years Old: రతన్‌ టాటా మరణం టాటా గ్రూప్‌నకే కాదు, యావత్‌ దేశానికీ కచ్చితంగా లోటే. దేశంలోనే అత్యంత విలువైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, వేల కోట్ల ఆస్తిపరుడు అయిన రతన్‌ నావల్‌ టాటా నిశ్చయంగా నిగర్వి, నిరాడంబరుడు, మేధావి, అసమాన నాయకుడు, మార్గదర్శి. వ్యాపారవేత్తగా ఉన్నప్పటికీ, నిరంతరం జన శ్రేయోభిలాషిగానే బతికారు. తనను విమర్శించిన వాళ్లకు కూడా మేలు చేసి అజాతశత్రువులా నిలిచారు. మనసా, వాచా, కర్మణా మహోన్నతుడైన రతన్‌ టాటా, 86 ఏళ్ల వయసులో శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.

రతన్‌ టాటా మరణానికి ముందు, అక్టోబర్ 7న, నేషనల్‌ మీడియా నివేదికల ప్రకారం, ప్రముఖ పారిశ్రామికవేత్త & టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ (Tata Group Former Chairman) రతన్‌ టాటా "లో బ్లడ్‌ప్రెజర్‌"తో బాధపడ్డారు. చికిత్స కోసం ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ICUలో రతన్‌ టాటాను అడ్మిట్‌ చేశారు. అయితే, అదే రోజున, సోషల్ మీడియా పోస్ట్‌లో, ఆ వార్తలను రతన్‌ టాటా తోసిపుచ్చారు. 

కేవలం వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ముంబై ఆసుపత్రిలో చేరానని, తాను బాగానే ఉన్నాడని X పోస్ట్‌లో చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన గురించి ఆలోచించినందుకు అందరికీ ధన్యవాదాలు అని రాశారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని ఆయన ప్రజలను, మీడియాను కోరారు. విషాదం ఏంటంటే, ఇది జరిగిన రెండు రోజులకే రతన్ టాటా మరణించారు.

రతన్ ఎన్ టాటా (86), బుధవారం (09 అక్టోబర్‌ 2024) రాత్రి 11.30 గంటల సమయంలో, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మరణవార్త యావత్‌ దేశాన్ని కుదిపేసింది. టాటా గ్రూప్‌ ఉద్యోగులు, అభిమానులు, ఆయన నుంచి సాయం పొందినవాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన చేరదీసిన శునకం కూడా మౌనంగా నివాళి అర్పించింది. రతన్ టాటా మృతిపై దేశ & అంతర్జాతీయ ప్రముఖులు స్పందించారు. అసమాన నాయకుడిని & మారదర్శిని కోల్పోయామంటూ బాధను వ్యక్తం చేశారు.

రతన్‌ టాటా ఎలా చనిపోయారు, ఆయన మరణానికి అసలు కారణం ఏంటి?

రతన్‌ టాటా చనిపోవడానికి రెండు రోజుల ముందు, అక్టోబర్‌ 7 నాటి మీడియా కథనాలే చివరకు నిజమయ్యేలా ఉన్నాయి. వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలకు లో బ్లడ్‌ప్రెజర్‌ తోడవడం వల్ల ఆయన చనిపోయినట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

అకస్మాత్తుగా రక్తపోటు తగ్గినప్పుడు ఏం జరుగుతుంది?

తక్కువ రక్తపోటును హైపోటెన్షన్ అని కూడా పిలుస్తారు. ఇదొక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇతర ప్రాణాంతక పరిస్థితులకు ఇది కారణమవుతుంది, ముఖ్యంగా పెద్దల్లో ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తుంది. దీనిని 'సైలెంట్ కిల్లర్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఈ పరిస్థితిని సాధారణంగా గుర్తించలేరు. హైపోటెన్షన్‌కు చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇతర ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది.

అకస్మాత్తుగా BP పడిపోయినప్పుడు శరీరంలో అసలు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. హై బీపీ లాగానే, రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదలను (లో బీపీ) కూడా సమయానికి నియంత్రించాలి. లేకపోతే అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. 

రక్తపోటులో ఆకస్మిక తగ్గుదల ఇలాంటి లక్షణాలకు దారి తీస్తుంది:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలా తక్కువ సందర్భాల్లోనే రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే, ఇది మెదడు సహా శరీరంలోని ఇతర కీలక అవయవాలకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. తద్వారా హార్ట్‌ స్ట్రోక్ (గుండెపోటు) వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.

ఇది కూడా చదవండి: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా? 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Embed widget