అన్వేషించండి

Ratan Tata Death Reason: రతన్‌ టాటా ఎలా చనిపోయారు, డాక్టర్ రిపోర్ట్‌లో ఏం ఉంది?

Fact Behind Ratan Tata Death: రతన్‌ టాటా "లో బీపీ"తో (low blood pressure) ఇబ్బంది పడుతున్నారని ఆయన మరణానికి ముందు వార్తలు వచ్చాయి. అయితే, తన అనారోగ్య వార్తలను ఆయన స్వయంగా ఖండించారు.

Ratan Tata Died At 86 Years Old: రతన్‌ టాటా మరణం టాటా గ్రూప్‌నకే కాదు, యావత్‌ దేశానికీ కచ్చితంగా లోటే. దేశంలోనే అత్యంత విలువైన వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, వేల కోట్ల ఆస్తిపరుడు అయిన రతన్‌ నావల్‌ టాటా నిశ్చయంగా నిగర్వి, నిరాడంబరుడు, మేధావి, అసమాన నాయకుడు, మార్గదర్శి. వ్యాపారవేత్తగా ఉన్నప్పటికీ, నిరంతరం జన శ్రేయోభిలాషిగానే బతికారు. తనను విమర్శించిన వాళ్లకు కూడా మేలు చేసి అజాతశత్రువులా నిలిచారు. మనసా, వాచా, కర్మణా మహోన్నతుడైన రతన్‌ టాటా, 86 ఏళ్ల వయసులో శాశ్వతంగా సెలవు తీసుకున్నారు.

రతన్‌ టాటా మరణానికి ముందు, అక్టోబర్ 7న, నేషనల్‌ మీడియా నివేదికల ప్రకారం, ప్రముఖ పారిశ్రామికవేత్త & టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ (Tata Group Former Chairman) రతన్‌ టాటా "లో బ్లడ్‌ప్రెజర్‌"తో బాధపడ్డారు. చికిత్స కోసం ఆయన్ను ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ICUలో రతన్‌ టాటాను అడ్మిట్‌ చేశారు. అయితే, అదే రోజున, సోషల్ మీడియా పోస్ట్‌లో, ఆ వార్తలను రతన్‌ టాటా తోసిపుచ్చారు. 

కేవలం వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ముంబై ఆసుపత్రిలో చేరానని, తాను బాగానే ఉన్నాడని X పోస్ట్‌లో చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన గురించి ఆలోచించినందుకు అందరికీ ధన్యవాదాలు అని రాశారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని ఆయన ప్రజలను, మీడియాను కోరారు. విషాదం ఏంటంటే, ఇది జరిగిన రెండు రోజులకే రతన్ టాటా మరణించారు.

రతన్ ఎన్ టాటా (86), బుధవారం (09 అక్టోబర్‌ 2024) రాత్రి 11.30 గంటల సమయంలో, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన మరణవార్త యావత్‌ దేశాన్ని కుదిపేసింది. టాటా గ్రూప్‌ ఉద్యోగులు, అభిమానులు, ఆయన నుంచి సాయం పొందినవాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన చేరదీసిన శునకం కూడా మౌనంగా నివాళి అర్పించింది. రతన్ టాటా మృతిపై దేశ & అంతర్జాతీయ ప్రముఖులు స్పందించారు. అసమాన నాయకుడిని & మారదర్శిని కోల్పోయామంటూ బాధను వ్యక్తం చేశారు.

రతన్‌ టాటా ఎలా చనిపోయారు, ఆయన మరణానికి అసలు కారణం ఏంటి?

రతన్‌ టాటా చనిపోవడానికి రెండు రోజుల ముందు, అక్టోబర్‌ 7 నాటి మీడియా కథనాలే చివరకు నిజమయ్యేలా ఉన్నాయి. వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలకు లో బ్లడ్‌ప్రెజర్‌ తోడవడం వల్ల ఆయన చనిపోయినట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

అకస్మాత్తుగా రక్తపోటు తగ్గినప్పుడు ఏం జరుగుతుంది?

తక్కువ రక్తపోటును హైపోటెన్షన్ అని కూడా పిలుస్తారు. ఇదొక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇతర ప్రాణాంతక పరిస్థితులకు ఇది కారణమవుతుంది, ముఖ్యంగా పెద్దల్లో ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తుంది. దీనిని 'సైలెంట్ కిల్లర్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, ఈ పరిస్థితిని సాధారణంగా గుర్తించలేరు. హైపోటెన్షన్‌కు చికిత్స చేయకుండా వదిలేస్తే, ఇతర ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది.

అకస్మాత్తుగా BP పడిపోయినప్పుడు శరీరంలో అసలు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. హై బీపీ లాగానే, రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదలను (లో బీపీ) కూడా సమయానికి నియంత్రించాలి. లేకపోతే అది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. 

రక్తపోటులో ఆకస్మిక తగ్గుదల ఇలాంటి లక్షణాలకు దారి తీస్తుంది:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలా తక్కువ సందర్భాల్లోనే రక్తపోటులో అకస్మాత్తుగా తగ్గుదల ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే, ఇది మెదడు సహా శరీరంలోని ఇతర కీలక అవయవాలకు ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. తద్వారా హార్ట్‌ స్ట్రోక్ (గుండెపోటు) వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.

ఇది కూడా చదవండి: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Suriya 44: సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Yahya Sinwar: చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
IND vs NZ: బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
Embed widget