By: ABP Desam | Updated at : 12 Jan 2023 06:18 PM (IST)
Edited By: Ramakrishna Paladi
నరేంద్ర మోదీ
PM Narendra Modi:
ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్-19, వాతావరణ మార్పులతో వస్తున్న సహజ విపత్తులు మనపై ఆర్థిక ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. 'వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్' వర్చువల్ సదస్సులో ఆయన మాట్లాడారు. రెండు రోజుల ఈ సదస్సుకు భారతే ఆతిథ్యమిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధంతో మొదలైన అంతర్జాతీయ సమస్యలు, ఆహారం, ఇంధన ఉమ్మడి సమస్యలపై ఇందులో విస్తృతంగా చర్చించనున్నారు.
Sharing my closing remarks at the "Voice of Global South Summit." https://t.co/WXB56kElFZ
— Narendra Modi (@narendramodi) January 12, 2023
ప్రపంచం ఇప్పుడు సంక్షోభ పరిస్థితుల్లో ఉందని మోదీ అన్నారు. ఈ అస్థిరత ఎన్నాళ్లు కొనసాగుతుందో అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలు, యుద్ధాలు, తీవ్రవాదం వంటి సమస్యలే ఇందుకు కారణమని వెల్లడించారు.
'ప్రపంచం సంక్షోభంలో ఉందన్నది స్పష్టం. ఇదెంత కాలం కొనసాగుతుందో తెలియదు. మన దక్షిణాది దేశాలకే భవిష్యత్తులో ఎక్కువ వాటా ఉంటుంది. మనం ఎలాంటి అంతర్జాతీయ సమస్యలను సృష్టించలేదు. కానీ అవి మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి' అని ఆయన వెల్లడించారు.
Addressing the inaugural session of "Voice of Global South Summit." https://t.co/i9UdGR7sYH
— Narendra Modi (@narendramodi) January 12, 2023
ఈ సదస్సులో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలు పాల్గొన్నాయి. మానవుల కేంద్రంగా అభివృద్ధి కోసం గ్లోబల్ సౌత్ గొంతుక థీమ్తో మొదట చర్చించనున్నారు. సమష్టి లక్ష్యం కోసం సమష్టి గొంతుక థీమ్పై ఆఖర్లో ప్రపంచ దేశాధినేతలు మాట్లాడతారు. మొత్తం పది సెషన్లు ఉంటాయి. గురువారం నాలుగు, శుక్రవారం ఆరు జరుగుతాయి. ప్రతి సెషన్లో 10-20 దేశాల నేతలు, మంత్రులు పాల్గొంటారని అంచనా.
Also Read: 5Paisa Capital Q3 Results: కంపెనీ కొంచం - లాభం ఘనం, ఉరుకులు పెట్టిన షేర్ ధర
Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు సురక్షిత భవిష్యత్ + మీకు పన్ను మినహాయింపు - ఈ స్కీమ్తో రెండూ సాధ్యం
Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
LIC Adani Shares: అదానీ వల్ల మీకు-నాకే కాదు, ఎల్ఐసీకి కూడా భారీ నష్టం, రెండ్రోజుల్లో ₹16,580 కోట్లు పోయాయి
Bank Strike: జనవరి 30, 31 తేదీల్లో బ్యాంకులు పని చేస్తాయా, సమ్మెపై ఏ నిర్ణయం తీసుకున్నారు?
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?