By: ABP Desam | Updated at : 30 Sep 2021 07:01 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో ఇటీవల ప్రధాన మెట్రో నగరాల్లోనూ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. తెలంగాణలో మాత్రం హైదరాబాద్, వరంగల్ నగరాల్లో కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న ధరల్లో తాజాగా వ్యత్యాసం కనిపిస్తోంది.
తెలంగాణలో సెప్టెంబరు 30న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్లో ఇంధన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. దీంతో తాజాగా పెట్రోల్ ధర రూ.105.48 అయింది. డీజిల్ ధర కూడా రూ.97.74 గా ఉంది. ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.15 పైసలు తగ్గి రూ.105.02గా ఉంది. డీజిల్ ధర రూ.0.14 పైసలు తగ్గి రూ.97.30 గా ఉంది. వరంగల్లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా స్వల్పంగా తగ్గాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.15 పైసలు తగ్గి రూ.105.02గా ఉంది. డీజిల్ ధర రూ.0.27 పైసలు తగ్గి రూ.97.61కు చేరింది. నిజామాబాద్లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.107.56 గా ఉంది. డీజిల్ ధర రూ.99.67 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటుండగా తాజాగా స్థిరంగా ఉన్నాయి.
Also Read: చీకట్లో చైనా.. పరిశ్రమలకు చిక్కులు.. ఇక ప్రపంచానికి చుక్కలు!
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం రూ.107.62 గా ఉంది. డీజిల్ ధర రూ.99.33కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.69గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.08 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.98.43కి తగ్గింది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. కానీ, తాజాగా స్వల్ప మార్పులే కనిపించాయి.
తిరుపతిలో ఇంధన ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.19 పైసలు పెరిగి రూ.107.92 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.99.60గా ఉంది.
Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.4 వేలకు పైగా తగ్గింపు.. ఫీచర్లు అదుర్స్!
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 30 నాటి ధరల ప్రకారం 74 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: జోరు పెంచిన హెచ్డీఎఫ్సీ.. ఒక్క నెల్లోనే 4లక్షల క్రెడిట్ కార్డుల జారీ! ఎందుకీ వేగం?
Investment Tips: మహిళల కోసం గోల్డెన్ టిప్స్ - బంగారం, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ - ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
Adani Stocks: మూడో రోజూ రఫ్ఫాడిస్తున్న అదానీ స్టాక్స్ - 10లో 9 షేర్లకు గ్రీన్ టిక్, మిగిలిన ఆ ఒక్కటి ఏది?
RBI MPC Meet: బ్యాంక్ వడ్డీ రేట్లు పెరుగుతాయా, తగ్గుతాయా?, ఆర్బీఐ మీటింగ్ ప్రారంభం
Latest Gold-Silver Prices Today 06 December 2023: రెండోరోజూ పసిడి పతనం - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Petrol-Diesel Price 06 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్నే ఫాలో కానుందా? కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
Pavan Babu Meet : చంద్రబాబుతో పవన్ భేటీ - అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!
CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం
AP High Court: ఎస్ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
/body>