![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Petrol-Diesel Price, 22 September: పెరిగిన ఇంధన ధరలు.. ఈ నగరాల్లో భారీగా.. ఇక్కడ మాత్రం స్థిరం
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.105.26 కాగా.. డీజిల్ ధర రూ.96.69 గా ఉంది. కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.06 పైసలు తగ్గి రూ.105.38గా ఉంది.
![Petrol-Diesel Price, 22 September: పెరిగిన ఇంధన ధరలు.. ఈ నగరాల్లో భారీగా.. ఇక్కడ మాత్రం స్థిరం Petrol Diesel Price Today 22 September 2021 know rates fuel price in your city Telangana Andhra Pradesh Amaravati Hyderabad Petrol-Diesel Price, 22 September: పెరిగిన ఇంధన ధరలు.. ఈ నగరాల్లో భారీగా.. ఇక్కడ మాత్రం స్థిరం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/15/ca11dc32888a63674e51d16dd9f90191_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో హైదరాబాద్, ముంబయి, చెన్నై, ఢిల్లీ సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు గత నెల రోజులకు పైగా స్థిరంగానే ఉంటున్నాయి. డీజిల్ ధరల విషయంలో కూడా స్థిరత్వమే కొనసాగుతోంది. తెలంగాణలో వరంగల్ నగరంలో కూడా పెట్రోల్ ధరలు నిలకడగానే ఉంటున్నాయి.
తెలంగాణలో సెప్టెంబరు 22న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.105.26 కాగా.. డీజిల్ ధర రూ.96.69 గా ఉంది. కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.06 పైసలు తగ్గి రూ.105.38గా ఉంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు పెరిగి రూ.96.80కు పెరిగింది.
ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.104.77గానే కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ.96.23 గా ఉంది. వరంగల్లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్లో పెట్రోల్ ధరలో ఏ మార్పూ కనిపించలేదు. పెట్రోల్ ధర రూ.0.25 పైసలు పెరిగి రూ.106.95 గా కొనసాగుతోంది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.23 పైసలు పెరిగి రూ.98.26 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగానే హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్! పెరిగిన ధరలు.. వెండి మాత్రం కిందికి..
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర రూ.0.32 పైసలు పెరిగి.. ప్రస్తుతం రూ.108.01 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.28 పైసలు పెరిగి రూ.98.89కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో గత పది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.55గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.30 పైసలు పెరిగింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.28 పైసలు పెరిగి రూ.97.50గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు షాక్! పెరిగిన ధరలు.. వెండి మాత్రం కిందికి..
తిరుపతిలో స్వల్పంగా పెరుగుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.32 పైసలు పెరిగి రూ.107.98 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర కూడా రూ.0.29 పైసలు పెరిగి రూ.98.82గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా సెప్టెంబరు 22 నాటి ధరల ప్రకారం 71 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)