అన్వేషించండి

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌

Pension Hike: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం ఇంకా చల్లారలేదు. అధికార ప్రతిపక్షాలు పైచేయి కోసం వ్యూహప్రతివ్యూహలతో విరుచుకపడుతున్నారు. పింఛన్‌ పంపిణీ సందర్భంగా ఈ వార్ మరింత పీక్స్‌కు వెళ్లింది.

NDA Vs YSRCP In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి నెల రోజులైంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు వారాలే అయింది. కానీ రాజకీయ కాక మాత్రం ఎన్నికల హడావుడిని తలపిస్తోంది. ఈసారి కూడా సామాజిక పింఛన్‌పై అధికార ప్రతిపక్షం మధ్య వార్ నడుస్తోంది. అయితే ఈ యుద్ధం చాలా విభిన్నంగా సాగుతోంది. చాలా సైలెంట్‌గా ఒకరిపై ఒకరు నెగిటివిటినీ ప్రచారం చేసుకుంటున్నారు. 

వలంటీర్లు లేకుండా ఏ పని సాధ్యం కాదని... వందనాల పేరుతో వందల కోట్లు గత ప్రభుత్వం వారి కింద ఖర్చు పెట్టింది. వారి వల్ల సంక్షేమ పథకాలు సంక్షేమంగా లబ్ధిదారులకు చేరుతున్నట్టు కలరింగ్ ఇచ్చింది. ఎన్నికల టైంలో కూడా పింఛన్ల పంపిణీపై రగడ జరిగింది. వారిని విధుల నుంచి ఈసీ తప్పించడంతో మిగతా వారితో పంపిణీ సాధ్యం కాదని అధికారులు చెప్పేశారు. లబ్ధిదారులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిప్పించారు. 

అప్పటి సీఎస్‌ ఇతర ఉన్నతాధికారుల తీరును టీడీపీ తప్పుపట్టింది. సచివాలయ సిబ్బందితో ఎందుకు పంపిణీ చేపట్టలేరంటూ ప్రశ్నించింది. అయితే దీనికి కౌంటర్‌గా వైసీపీ కూడా విమర్సలు చేసింది. అతి ముఖ్యమైన వలంటీర వ్యవస్థను తప్పించి ప్రజల వ్యతిరేకత వస్తుందని టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆరోపించింది. వ్యతిరేకత తగ్గించుకునేందుకు ఇలాంటి లేఖలు రాస్తోందని స్వయంగా జగనే దుమ్మెత్తి పోశారు. 

సీన్ కట్ చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చింది. వలంటీర్లను ఇంత వరకు రీ రిక్రూట్ చేసుకోలేదు. మొదటి నెల పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారో అని వైసీపీ చాలా ఆసక్తిగా చూసింది. అయితే వలంటీర్ల ప్రమేయం లేకుండానే ప్రభుత్వ యంత్రాంగంతోనే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది కలిసి ఈ కార్యక్రమాన్ని 95 శాతం విజయవంతం చేశారు. 

ఇప్పుడు సాధ్యమైంది అప్పట్లో ప్రభుత్వం ఎందుకు చేయలేదని సీఎం, డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. అప్పట్లో కావాలనే ప్రజలను ఇబ్బంది పెట్టాలనే సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయలేదని ఆరోపించారు. దీనికి అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఇగోనే కారణమని చెప్పుకొచ్చారు చంద్రబాబు. 

దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. జగన్‌ పత్రికలో ఫ్రంట్‌పేజ్‌లో యాడ్ ఇచ్చింది. చంద్రబాబు పెన్షన్‌లపై ఇన్ని అబద్దాలా అంటూ విరుచుకుపడింది. 2014-19 వరకు టీడీపీ ఇచ్చిన పింఛన్లు, 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఇచ్చిన పింఛన్లు బేరీజు వేస్తూ చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడింది. అంతే కాకుండా వివిధ కార్యాలయల వద్ద గుమిగూడిన లబ్ధిదారుల ఫొటోలతో వార్త రాశారు. 
అంటే గత ప్రభుత్వం అనవసరమైన ఖర్చు పెట్టిందని... ప్రభుత్వ సిబ్బందితో జరపాల్సిన పనులను కూడా వలంటీర్ల పేరుతో భారీగా ఖర్చులు చేసిందని వైసీపీపై నెగిటివిటీని అధికార కూటమి ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ముందు పోలవరం, తర్వాత అమరావతి, ఇప్పుడు వంలటీర్ వ్యవస్థ. 

ప్రభుత్వ ఆలోచనలకు తగ్గట్టుగానే కొందరు నేతలు కూడా వలంటీర్ వ్యవస్థతో అనవసరమైన ఖర్చే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని చెబుతున్నారు. ఇంత వరకు ఈ వ్యవస్థపై అనేక విమర్శలు చేసిన పవన్ కల్యాణ్ కూడా వారి అవసరం లేదన్నట్టుగానే మాట్లాడారు. అయితే వారికి ప్రత్యామ్నాయం చూపిస్తామని మాత్రం చెప్పారు. ఇంత జరుగుతున్నా ఈ వ్యవస్థపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

మరోవైపు గత ప్రభుత్వంతో పోలుస్తూ వైసీపీ అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. క్రమంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. కార్యాలయాలపై దాడుల విషయంలోతప్ప వేరే విషయాలపై ఆ పార్టీ నేతలు ఫోకస్ చేయడం లేదు. అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యక్తిగత దాడిని మాత్రమే ప్రజల ముందు ఉంచుతున్నారు. వారి అనుకూల మీడియాలో పథకాలపై కథనాలు, వ్యక్తిగత, భౌతిక దాడులు జరుగుతున్నాయని ప్రచారం చేస్తోంది. కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇలా ఒకరిపై ఒకరు సైలెంట్‌గా నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: పెరంబూర్ నుంచి విజయ్ పోటీ - డీఎంకే కంచుకోటలో దళపతి సాహసం!
పెరంబూర్ నుంచి విజయ్ పోటీ - డీఎంకే కంచుకోటలో దళపతి సాహసం!
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Manifestos of Tamil parties: ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?
ఉచితాల మ్యానిఫెస్టోలతో హోరెత్తిస్తున్న తమిళ పార్టీలు - ప్రజలు ఓటింగ్ ప్రాతిపదిక ఈ వరాలేనా?

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
Maharashtra Minister Video: ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
Watermelon Storage Tips : పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
పుచ్చకాయను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చా? అలా తింటే మంచిదేనా?
Tadipatri Crime News: బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
బీర్ బాటిల్‌తో పోలీసులపై నిందితుడు దాడి- కాల్పులు జరిపి అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు
Embed widget