By: ABP Desam | Updated at : 11 Aug 2021 07:27 AM (IST)
నిలకడగా ఇంధన ధరలు (ప్రతీకాత్మక చిత్రం)
దేశంలో అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో గత 20 రోజులుగా ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క హైదరాబాద్లో మాత్రం రెండు రోజుల క్రితం స్వల్ప వ్యత్యాసం కనిపించగా మళ్లీ ఇంధన ధరలు నిలకడగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఇంధన మార్కెట్లో రెండు రోజుల క్రితం పెట్రోల్ లీటరుకు రూ.0.15 పైసలు పెరిగింది. డీజిల్ ధర మాత్రం నేడు రూ.0.14 పైసలు చొప్పున తగ్గింది.
తెలంగాణలో ఆగస్టు 11న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.105.83 కాగా.. డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. కరీంనగర్లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.12 పైసలు పెరిగి రూ.105.98గా ఉంది. డీజిల్ ధర రూ.0.11 పైసలు పెరిగి రూ.98.08 కు చేరింది.
ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.53 గా స్థిరంగానే కొనసాగుతూ ఉంది. కొద్దిరోజులుగా వరంగల్లో ఇవే ధరలు నిలకడగా ఉంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇవే ఇంధన ధరలు ఉన్నాయి.
నిజామాబాద్లో పెట్రోల్ ధరలు లీటరుకు సుమారు రూ.0.13 పైసల వరకూ పెరిగింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.11 పైసలు పెరిగింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.72 గా ఉంది. డీజిల్ ధర రూ.99.70గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఏపీలో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో ఇంధన ధరల్లో అతి స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.04 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.108.26 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.03 పైసలు తగ్గి రూ.99.84కు చేరింది.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.95గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.52 పైసలు తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.48 పైసలు తగ్గి రూ.98.57గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో భారీగా పెరుగుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో భారీ మార్పు చోటు చేసుకుంది. పెట్రోల్ లీటరుకు రూ.2.59 తగ్గగా.. డీజిల్ రూ.2.34 తగ్గింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.107.41కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుండగా.. తాజాగా తగ్గింది. ఇక డీజిల్ ధర కూడా రూ.2.34 తగ్గి.. రూ.101.34 అయింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సరం నుంచి మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 11 నాటి ధరల ప్రకారం 59.13 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Adani Group Investment Plan: ఇన్ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు
Train Ticket: కన్ఫర్మ్డ్ ట్రైన్ టిక్కెట్ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్ ప్రయత్నించండి
Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్ ఛెస్ట్ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు
GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
/body>