అన్వేషించండి

No Income Tax: ఈ రాష్ట్ర ప్రజలు ఒక్క రూపాయి ఆదాయపు పన్ను కూడా కట్టరు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ రాష్ట్రంలోని 95 శాతం మంది ప్రజలు ఒక్క రూపాయి ఆదాయపు పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

No Income Tax: భారతదేశంలో, భారత పౌరుడు సంపాదించే ఆదాయం మీద ఆదాయ పన్ను చెల్లించాలి. నిర్దిష్ట పరిమితి కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఆదాయం ఉన్నా, ఆ వ్యక్తి ఆదాయపు పన్ను పత్రాలు (ITR) సమర్పించాలి, (Income Tax) కట్టాలి. 

ప్రస్తుతం, మన దేశంలో రెండు రకాల పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి పాత పన్ను విధానం, మరొకటి కొత్త పన్ను విధానం. పాత పన్ను విధానం ప్రకారం రూ. 5 లక్షల ఆదాయం వరకు ఏ వ్యక్తీ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా, కొత్త పన్ను విధానం ప్రకారం, రూ. 7 లక్షల ఆదాయం వరకు ప్రతి వ్యక్తికీ పన్ను మినహాయింపు ప్రయోజనం అందుబాటులో ఉంది. వీటన్నింటి మధ్య, ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను చెల్లించని రాష్ట్రం దేశంలోనే ఉందని మీకు తెలుసా?, ఆ రాష్ట్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని రాష్ట్ర ప్రజలు  
ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని రాష్ట్రం పేరు సిక్కిం (No Income Tax in Sikkim). దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న సిక్కిం రాష్ట్రం మన దేశంలో, ప్రపంచంలో పకృతి అందాలకు ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రానికి దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. పర్యాటక రంగం రూపంలో ఈ రాష్ట్ర ప్రజలు మంచి ఆదాయం ఆర్జిస్తుంటారు. విశేషం ఏంటంటే... తాము సంపాదించే ఆదాయం మీద ఈ రాష్ట్ర ప్రజలకు మినహాయింపు ఉంది. ఈ రాష్ట్రంలోని 95 శాతం మంది ప్రజలు ఒక్క రూపాయి ఆదాయపు పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి ఒక కారణం ఉంది.

ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఎందుకు?
ఆదాయ పన్ను నుంచి మినహాయింపునకు దశాబ్దాల నాటి కారణం ఉంది. ఇండియన్‌ యూనియన్‌లో సిక్కిం రాష్ట్రం విలీనమైన సమయంలో, భారత ప్రభుత్వంతో ఈ రాష్ట్రం ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం సిక్కిం రాష్ట్ర ప్రజలకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు సౌకర్యం లభించింది. 

ఆర్టికల్ 371A (Article 371A in The Constitution Of India 1949) ప్రకారం సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చింది. దీంతో ఇతర రాష్ట్రాల ప్రజలు ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో, ఈ రాష్ట్రంలోని అసలైన నివాసితులు ఆదాయపు పన్ను 1961లోని సెక్షన్ 10 (26AAA) కింద ఆదాయపు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ప్రయోజనాన్ని పొందుతున్నారు.

పాన్ కార్డ్ విషయంలో కూడా మినహాయింపు 
ఆదాయపు పన్ను చెల్లింపు మినహాయింపుతో పాటు, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా సిక్కిం నివాసితులకు పాన్ కార్డు (Pan Card) వినియోగంపై మినహాయింపు ఇచ్చింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు షేర్ మార్కెట్ (Share Market), మ్యూచువల్ ఫండ్స్‌లో ‍‌(Mutual Fund) పెట్టుబడి పెట్టాలంటే పాన్ కార్డ్ కచ్చితంగా అవసరం. అయితే, ఈ విషయంలో సిక్కిం ప్రజలకు మినహాయింపు ఉంది. వాళ్లు పాన్ కార్డ్ లేకుండా కూడా షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget