By: ABP Desam | Updated at : 01 Sep 2021 10:49 AM (IST)
ఎల్పీజీ సిలిండర్ ధరలు
ఎల్పీజీ సిలిండర్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. కోట్లాది సామాన్యులకు వంటగ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. ఇటీవల రూ.25 చొప్పున పెంచారు.. 15 రోజుల్లోనే మరోసారి రూ.25 పెంచేశారు. తాజాగా పెరిగిన ధరలు నేటి (సెప్టెంబర్ 1) నుంచి అమలు కానున్నాయి. అదే సమయంలో కమర్షియల్ సిలిండర్ ధరలు సైతం భారీగానే పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో రూ.50 మేర ఎల్పీజీ ధరలు పెరగడం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోంది.
కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై రూ.75 చొప్పున పెరిగింది. 14.2 కేజీల సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.884.50 అయింది. తాజా ధరల ప్రకారం హైదరాబాద్లో ఎల్పీజీ ధర రూ.912 కు చేరింది. సబ్సిడీ లేని సిలిండర్లపై ఆగస్టు 17నే రూ.25 మేర పెంచడం తెలిసిందే. అంతకు ముందు జులై ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్ల ధరలు సవరించారు. అప్పుడు ఒక్కో సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్లపై రూ.25.50 మేర పెంచారు. ముంబైలో సిలిండర్ ధర రూ.884 అయింది. ఇక కోల్కతాలో సిలిండర్ ధర రూ.886కు చేరింది. చెన్నైలో అయితే సిలిండర్ ధర రూ.900 గా ఉంది.
Also Read: Gold-Silver Price: రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. పసిడి బాటలోనే వెండి పయనం.. నేటి ధరలు ఇలా..
ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాని మోదీ ప్రభుత్వంలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఏడేళ్ల కాలంలో సిలిండర్ ధరలు అంతకంతకు పెరిగాయి. మార్చి 1, 2014లో రూ.410.50గా ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధరలు నేడు రూ.884.50కు చేరాయి. ఏడేళ్లలో రెట్టింపు కన్న అధిక ధరలకు ఎల్పీజీ సిలిండర్ ధరలు చేరుకున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 14.2 కేజీల సిలిండర్లు ఏడాదికి 12 మేర సబ్సిడీ అందిస్తోంది. సబ్సిడీ నగదు మొత్తాన్ని వినియోగదారుల బ్యాంకు ఖాతాకు జమచేయనుంది.
Also Read: Bank Holidays In September: సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు... ఏఏ తేదీల్లో అంటే!
కాగా, ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.694గా ఉండేది. సెప్టెంబర్ 1 నాటికి అది రూ.884.50కు చేరింది. ఫిబ్రవరిలో రూ.719, ఆపై 15వ తేదీన రూ.769 అయింది. మార్చి నెలలో రూ.794కు పెంచారు. మే, జూన్ నెలలో ధరలలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో ఎల్పీజీ రూ.884.50కు విక్రయిస్తారు. హైదరాబాద్లో తాజాగా పెరిగిన ధర రూ.912కు చేరింది. జిల్లాల్లో అంతకంటే అధిక ధరలకు ఎల్పీజీ సిలిండర్ విక్రయాలు జరగనున్నాయి. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 2.7 కోట్ల సిలిండర్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చారు.
Stock Market News Today: రెండు నిమిషాల్లో రూ.4 లక్షల కోట్ల లాభం - మార్కెట్ ర్యాలీ వెనకున్న శక్తులు ఇవే
Share Market Opening Today 04 December 2023: మార్కెట్లో మహా విస్ఫోటనం - సరికొత్త రికార్డ్లో సెన్సెక్స్, నిఫ్టీ
Latest Gold-Silver Prices Today 04 December 2023: చుక్కలు దాటిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Stocks To Watch Today 04 December 2023: ఈ రోజు మార్కెట్ ఫోకస్లో ఉండే 'కీ స్టాక్స్' LIC, Granules, CAMS, Hero
Petrol-Diesel Price 04 December 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్జాం - తీరం దాటేది ఏపీలోనే!
/body>