అన్వేషించండి

Steel Price: స్టీల్‌ ధరలకు రెక్కలు! సంక్షోభంలో భారత్ ఉక్కు పరిశ్రమ! ప్రమాదంలో MSME రంగాలు!

Steel Price: ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా దాడులు సుదీర్ఘకాలం కొనసాగుతుండటంతో, దిగుమతి చేసుకునే కోకింగ్ కోల్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి పదార్థాల కొరతతో స్టీల్ ధరలు పెరుగుతున్నాయి.
  • ఇరాన్‌పై దాడులు, రవాణా ఖర్చుల పెరుగుదల ధరలకు కారణాలు.
  • MSME రంగం గ్యాస్, ఇంధన కొరతతో తీవ్ర సంక్షోభంలో ఉంది.
  • JSW స్టీల్స్‌ సరఫరా, రవాణా సమస్యలతో గడువు పొడిగింపు కోరింది.

Steel Price: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత్ పారిశ్రామిక రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడులు గ్లోబల్ సప్లై చైన్‌ను దెబ్బ తీయడమే కాకుండా దేశీయంగా స్టీల్‌ ధరలు ఆకాశాన్ని తాకేలా చేస్తున్నాయి. ముడి పదార్థాల కొరత, రవాణా ఖర్చులు పెరగడంతో ఉక్కు కంపెనీలు తమ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. 

ముడి పదార్థాల ధరల పెరుగుదలకు అసలు కారణాలేంటి?

ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా దాడులు సుదీర్ఘకాలం కొనసాగుతుండటంతో, దిగుమతి చేసుకునే కోకింగ్ కోల్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. వాటితోపాటు షిప్పింగ్ ఛార్జీలు కూడా భారమయ్యాయి. ఇది ఉక్కు కంపెనీల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఐరన్ ఓర్‌, ఇంధన ఖర్చులు పెరగడంతో ఉక్కు సంస్థలు ధరలను సవరించాయి. 

గత ఏడాది నవంబర్‌లో టన్నుకు 47వేలుగా ఉన్న డొమెస్టిక్‌ హాట్‌ రోల్ట్‌ కాయిల్ ధరలు ప్రస్తుతం 54వేల నుంచి 58వేల మధ్యకు చేరుకున్నాయి. అంటే కేవలం కొన్ని నెలల్లోనే సుమారు 23 శాతం ధర పెరిగింది. ముడి పదార్థాలైన కోకింగ్ కోల్‌, ఫెర్రో అల్లాయ్స్‌ ధరలు మరింత వేగంగా పెరుగుతుండటంతో ఇంటిగ్రేటెడ్‌ ప్లాంట్లు లేని కంపెనీల లాభాల మార్జిన్ దారుణంగా పడిపోతోంది. రానున్న వారాల్లో టన్నుకు మరో 1000 నుంచి రెండు వేల వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. 

MSME రంగంపై పిడుగు 

భారత్‌ మొత్తం ఉక్కు ఉత్పత్తిలో దాదాపు 40 శాతం వాటా కలిగిన సూక్ష్మ, చిన్న, మధ్యతరగా పరిశ్రమల క్లస్టర్లు ప్రస్తుతం మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్, ఇంధన కొరత ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా పంజాబ్, మహారాష్ట్రవంటి కీలక పారిశ్రామిక హబ్‌లలో గ్యాస్ సరఫరాలో 70 శాతం వరకు కోత విధించడంతో అనేక పరిశ్రమలు షిప్టులను తగ్గించుకున్నాయి. కొన్ని మూతపడే దిశగా ఉన్నాయి. గ్యాస్ కొరత కారణంగా ఇప్పటికే అనేక డౌన్‌స్ట్రీమ్‌ ఉత్పత్తిదారులు యాక్టివిటీస్‌ను నిలిపేశారు. ఇది భవిష్యత్‌లో ఉక్కు డిమాండ్‌ను మరింత తగ్గించే ప్రమాదం ఉంది. 

దిగ్గజ సంస్థల సవాళ్లు 

దేశీయ ఉక్కు దిగ్గజం JSW స్టీల్స్ కూడా ఈ అడ్డంకుల వల్ల ఇబ్బంది పడుతోంది. ఇంధన సరఫరాలో అంతరాయాలు, సముద్ర రవాణాలో సమస్యలు తమ కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయని సంస్థ పేర్కొంది. ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద టిన్‌ప్లేట్‌ సరఫరా చేయాల్సిన బాధ్యత కలిగిన JSW స్టీల్స్‌ కోటెడ్ ప్రొడక్ట్స్‌, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆరు నెలల గడువు పొగింపును కోరుతోంది. పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్‌ వంటి కీలక సరఫరాదారుల నుంచి ఫోర్స్ మెజ్యూర్‌ నోటీసులు అందడం వల్ల ఎల్‌ఎన్‌జీ సరఫరా నిలిచిపోయిందని సంస్థ వెల్లడించింది. 

పెరిగిన రవాణా ఖర్చులు

మైనింగ్, లాజిస్టిక్స్‌ రంగంపై డీజిల్ ధరల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ డీజిల్‌ ధరలు బ్యారెల్‌కు 180 డాలర్లకు చేరుకొని రెట్టింపు కావడంతో, ఉక్క ఉత్పత్తి వ్యయం నేరుగా ప్రభావితమైంది. మైనింక్ కార్యకలాపాల నుంచి ఫ్యాక్టరీ వరకు ముడి సరకును తరలించడం ఇప్పుడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. 

భవిష్యత్‌పై అనిశ్చితి

ఒకవైపు ఖర్చుల ఒత్తిడి వల్ల ఉక్క ధరలు పెరుగుతుంటే మరోవైపు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, తగ్గుతున్న డిమాండ్ మార్కెట్‌ను కలవరపెడుతున్నాయి. ఆటోమోటివ‌, వైట్ గూడ్స్‌ వంటి రంగాలు భారీ ధరల పెరుగుదలను అడ్డుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ధరలు పెరిగితే ఆయా రంగాల్లో అమ్మకాలు పడిపోతాయి. మార్కెట్ ప్రస్తుత అస్థిరత మధ్య కొట్టమిట్టాడుతోంది. 

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ముడి పదార్థాల ధరల పెరుగుదల, సప్లై చైన్‌లో ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కారం కాకపోతే భారత ఉక్కు పరిశ్రమో మరిన్ని ఒడిదుడుకులు తప్పవని స్పష్టమవుతోంది. ఇటు సామాన్యుడిపై నిర్మాణ రంగ ఖర్చుల భారం పడటమే కాకుండా, అటు పారిశ్రామిక వేగంలో కూడా మందగమనం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.  

Frequently Asked Questions

భారత ఉక్కు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం, ఇరాన్‌పై అమెరికా దాడుల వల్ల గ్లోబల్ సప్లై చైన్‌ దెబ్బతింది. దీనివల్ల ముడి పదార్థాల కొరత, రవాణా ఖర్చులు పెరిగాయి.

ముడి పదార్థాల ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

ఇరాన్‌పై అమెరికా దాడుల వల్ల కోకింగ్ కోల్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు పెరిగాయి. షిప్పింగ్ ఛార్జీలు కూడా భారమయ్యాయి.

MSME రంగంపై ఈ ధరల పెరుగుదల ప్రభావం ఏమిటి?

భారత్‌ ఉక్కు ఉత్పత్తిలో 40 శాతం వాటా కలిగిన MSME రంగాలు మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. గ్యాస్, ఇంధన కొరత ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది.

పెరిగిన రవాణా ఖర్చులకు కారణం ఏమిటి?

అంతర్జాతీయ డీజిల్‌ ధరలు బ్యారెల్‌కు 180 డాలర్లకు చేరుకోవడంతో, మైనింగ్, లాజిస్టిక్స్‌ రంగంపై ప్రభావం పడి ఉక్కు ఉత్పత్తి వ్యయం పెరిగింది.

టాప్ హెడ్ లైన్స్

RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget