అన్వేషించండి

ICC World Cup Cricket 2023: విమాన ప్రయాణాల్లో సరికొత్త రికార్డ్‌, ఏవియేషన్‌ ఇండస్ట్రీని నిలబెట్టిన క్రికెట్‌

సాధారణ రోజుల్లో రూ.4 వేలు రూ.6 వేల వరకు ఉండే ఫ్లైట్‌ టిక్కెట్‌, ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా రూ.45 వేలకు వరకు వెళ్లింది.

ICC World Cup Cricket 2023 Final Match: దీపావళి పండుగ కూడా సాధించలేని రికార్డ్‌ను క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌ సాధించింది. వరల్డ్‌ కప్‌ ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను (ఆదివారం, 19 నవంబర్‌ 2023) ప్రత్యక్షంగా చూడడానికి, మన దేశంలో ఒక్క రోజులో విమానాల్లో ప్రయాణించిన వ్యక్తుల సంఖ్య సరికొత్త శిఖరానికి చేరింది. మ్యాచ్‌కు ముందు రోజు (శనివారం, 18 నవంబర్‌ 2023), దేశవ్యాప్తంగా సుమారు 4.6 లక్షల మంది విమాన ప్రయాణం చేశారు, ఇది ఇప్పటివరకు రికార్డ్‌ నంబర్‌. ఈ ఏడాది దీపావళి (Divali 2023) సందర్భంగా ప్రయాణికుల సంఖ్య ‍‌(flight passengers number) పెరిగింది. కానీ, భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం ప్రజల్లో కనిపించింది, సరికొత్త రికార్డును సృష్టించింది. 

అసాధారణంగా పెరిగిన విమాన టిక్కెట్ల రేటు
భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ పుణ్యమాని, ఛార్జీలను అతి భారీగా పెంచిన విమానయాన సంస్థలు చాలా డబ్బు సంపాదించాయి. దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి అహ్మదాబాద్‌ చేరడానికి సాధారణ రోజుల్లో రూ.4 వేలు రూ.6 వేల వరకు ఉండే ఫ్లైట్‌ టిక్కెట్‌, ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా రూ.45 వేలకు వరకు వెళ్లింది. 

ఈ పండుగ సీజన్‌లో, ఒక్క రోజులో దేశీయ విమానాల్లో ప్రయాణించిన వాళ్ల సంఖ్య (domestic flight passengers number) ఎప్పుడూ 4 లక్షలకు చేరుకోలేదు. దీనికి విమానయాన సంస్థలే కారణం. పెరుగుతున్న డిమాండ్‌కు ఆశపడి చాలా ఏవియేషన్‌ కంపెనీలు దీపావళికి ఒక నెల ముందు నుంచి విమాన ఛార్జీలను పెంచాయి. అంత ఎక్కువ డబ్బు పెట్టలేక పెద్ద సంఖ్యలో ప్రజలు రైల్లో ఏసీ క్లాస్ టిక్కెట్లకు మారారు. దీంతో, పండుగ సమయంలోనూ ఎయిర్‌ పాసెంజర్స్‌ సంఖ్య ఆశించినంతగా పెరగలేదు. కానీ, వరల్డ్ కప్ ఫైనల్ కోసం విమానాల వైపు మళ్లిన జనం, ఒక్కో విమాన టిక్కెట్‌ మీద రూ.20 వేల నుంచి రూ.45 వేల వరకు ఖర్చు చేశారు.

సింధియా, అదానీ ఆనందం
భారత విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, నవంబర్ 18న భారతీయ విమానయాన పరిశ్రమ చరిత్ర సృష్టించిందని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. ఆ రోజున 4,56,748 మంది ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తాము తీసుకెళ్లామని వెల్లడించారు. శనివారం నాడు, ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి కూడా రికార్డ్‌ స్థాయిలో ప్రయాణించారు. శనివారం ఒక్కరోజులోనే 1.61 లక్షల మంది ప్రయాణికులు ముంబై విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇది తమకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఎక్స్‌లో తెలిపారు. 

పండుగ సీజన్‌, వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని... విమానయాన సంస్థలు సెప్టెంబర్ చివరి వారం నుంచే అడ్వాన్స్ బుకింగ్ ఛార్జీలను పెంచడం ప్రారంభించాయి. ఈ నిర్ణయం తొలిరోజుల్లో బెడిసికొట్టి రైల్వేలు లాభపడ్డాయి. కానీ, దీపావళి, ఛత్ పూజ, క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాక ప్రజలు ఎయిర్‌లైన్స్ పర్సు నింపారు. 

ఈ రోజు (సోమవారం), అహ్మదాబాద్ నుంచి ముంబైకి విమాన టిక్కెట్లు రూ.18,000 నుంచి రూ.28,000 వరకు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి దిల్లీకి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతున్నాయి. 

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rupee Crash: రోజురోజుకు మరింత పడిపోతున్న రూపాయి! పశ్చిమాసియా సంక్షోభం, ముడిచమురు సెగతో కనిష్టంలో ఆల్‌టైం రికార్డు!
రోజురోజుకు మరింత పడిపోతున్న రూపాయి! పశ్చిమాసియా సంక్షోభం, ముడిచమురు సెగతో కనిష్టంలో ఆల్‌టైం రికార్డు!
Petrol Diesel Excise Duty: పెట్రోల్, డీజిల్‌పై లీటర్ కి రూ.10 ట్యాక్స్ తగ్గించిన కేంద్రం.. మనకు రేట్లు తగ్గుతాయా ?
పెట్రోల్, డీజిల్‌పై లీటర్ కి రూ.10 ట్యాక్స్ తగ్గించిన కేంద్రం.. మనకు రేట్లు తగ్గుతాయా ?
Gold and Silver Price Today: ఈరోజు బంగారం, వెండి ధర పెరిగిందా లేదా తగ్గిందా? ఈరోజు కొనాలంటే ఎంత ఖర్చు చేయాలి? 
ఈరోజు బంగారం, వెండి ధర పెరిగిందా లేదా తగ్గిందా? ఈరోజు కొనాలంటే ఎంత ఖర్చు చేయాలి? 
Retirement Planning Tips: చిట్కాలు పాటిస్తే పదవీ విరమణపై ఆందోళన ఉండదు! ఈ ప్రణాళిక వేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు! 
చిట్కాలు పాటిస్తే పదవీ విరమణపై ఆందోళన ఉండదు! ఈ ప్రణాళిక వేసుకుంటే ఎలాంటి సమస్యలు రావు! 

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Meeting CMs: నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు! రాష్ట్రాలకు ప్రధానమంత్రి కీలక ఆదేశాలు!
Harshaveena: న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ముందే ఆత్మహత్య- అరవ శ్రీధర్ బాధితురాలి సంచలన వీడియో
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
PM E-Drive Schemes:పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
పీఎం ఈడ్రైవ్ స్కీమ్‌ గురించి తెలుసా? 2 లక్షల పెట్టుబడితో నెలకు 5 లక్షల వరకు సంపాదన!ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై కేంద్రం సబ్సిడీ!
Tunguska Missile System: భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
భారత రక్షణ రంగం మరింత బలోపేతం, రష్యా నుంచి తుంగస్కా క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు ఒప్పందం!
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
Embed widget