అన్వేషించండి

EPFO: ఈపీఎఫ్‌వో చట్ట సవరణతో అధిక పింఛన్‌ రూల్స్‌లో అత్యంత కీలక మార్పు

2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా కేంద్ర కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

EPFO: అధిక పింఛను పథకం అనేక అవాంతరాలతో గత ఆరు నెలలుగా వార్తల్లో నలుగుతూనే ఉంది. తాజాగా, EPFO చట్టాన్ని సవరిస్తూ కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. కంపెనీ యాజమాన్యాలు ఇప్పటి వరకు చెల్లించిన 12 శాతం వాటా నుంచే మరో 1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లోకి (EPS) మళ్లించేలా నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్‌ 2014 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా కేంద్ర కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

కార్మిక శాఖ కొత్త నిబంధన ఫలితంగా చందాదార్లపై అదనపు భారం తగ్గుతుంది. అయితే... వేతనం రూ. 15,000 మించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 15,000, అంతకంటే తక్కువ వేతనం ఉన్నవాళ్లకు పాత నిబంధనే అమల్లో ఉంటుంది.

అదనపు 1.16 శాతం చందాపై రగడ
అధిక పింఛను కోసం యాజమాన్యాలతో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులంతా, రూ. 15 వేలకు పైబడిన జీతంపై తమ చందా నుంచి అదనంగా 1.16 శాతం చొప్పున చెల్లించాలని EPFO గతంలో నిర్దేశించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన చందాదార్లు, సుప్రీంకోర్టుకు ఎక్కారు. ఉద్యోగుల వేతనం నుంచి అదనంగా తీసుకోవడం రూల్స్‌కు విరుద్ధమని తీర్పు చెప్పింది. EPFO నిర్ణయాన్ని ఆరు నెలలపాటు నిలిపివేస్తూ ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కు తగ్గిన కార్మిక శాఖ,  1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగి వాటా నుంచి కాకుండా, కంపెనీ యాజమాన్యం జమ చేసే మొత్తం నుంచి తీసుకోవడానికి నిర్ణయించింది, ఆ ప్రకారమే తాజా ప్రకటన జారీ చేసింది.

మారిన వాటాలు ఎలా ఉంటాయి?
పాత నిబంధన ప్రకారం... తన జీతం నుంచి EPFO చందా రూపంలో ఉద్యోగి 12 శాతాన్ని చెల్లిస్తాడు. కంపెనీ యాజమాన్యం కూడా అంతే 12 శాతం మొత్తాన్ని తన వంతుగా జమ చేస్తుంది. కంపెనీ చెల్లించే ఈ 12 శాతంలో... 8.33 శాతం EPSలోకి వెళ్తుంది, మిగిలిన 3.67 శాతం EPFలోకి వెళ్తుంది. వేతనం రూ. 15,000 మించిన వారి కోసం EPFO తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం... యాజమాన్యం చెల్లించే 12 శాతం నుంచే అదనంగా 1.16 శాతం మొత్తాన్ని EPSలోకి మళ్లిస్తారు. అంటే, కంపెనీ యాజమాన్యం చెల్లించే 12 శాతం వాటాలో EPSలోకి (8.33 శాతం బదులు) 9.49 శాతం వెళ్తుంది, EPFలోకి (3.67 శాతం బదులు) 2.51 శాతం వెళ్తుంది.

కొత్త నిబంధన ప్రకారం.. EPFలో జమ అయ్యే మొత్తంలో కంపెనీ వాటా తగ్గుతున్నా, ఉద్యోగిపై అదనపు భారం కూడా ఉండదు. అంటే, అధిక పెన్షన్‌ను ఎంచుకున్నప్పటికీ టేక్ హోమ్ జీతం లేదా ఇన్ హ్యాండ్ జీతంపై ఎటువంటి ప్రభావం ఉండదు.

కొత్త నిబంధనతో కొన్ని నష్టాలు
మారిన నిబంధన ప్రకారం కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అధిక పెన్షన్ ఆప్షన్‌ తీసుకున్నవాళ్లకు కంపెనీ ద్వారా PFలో డిపాజిట్ అయ్యే మొత్తం తక్కువగా ఉంటుంది, ఇది PF ఫండ్‌పై ప్రభావం చూపుతుంది. ఉద్యోగులు PFపై చక్రవడ్డీ ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు PFలో కొంత భాగం EPSకు వెళుతుంది కాబట్టి, చక్రవడ్డీ ప్రయోజనం కూడా తగ్గుతుంది. అదేవిధంగా, పదవీ విరమణ చేసినప్పుడు లేదా ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు PF రూపంలో పొందే మొత్తం ఫండ్‌ కూడా తగ్గుతుంది.

అధిక పింఛను కింద ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదార్లు సమర్పించిన దరఖాస్తులు ఇప్పటికే కంపెనీ యాజమాన్యాల లాగిన్‌లోకి వచ్చాయి. 1.16 శాతం మొత్తం జమపై EPFO క్లారిటీ ఇవ్వడంతో, ఈ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం అవుతుంది. దరఖాస్తుల ప్రక్రియలో ఏదైనా పొరపాటు చేస్తే, దానిని సరి చేసుకునేందుకు ‘డిలీట్‌ అప్లికేషన్‌’ ఆప్షన్‌ను అందుబాటులోకి వచ్చింది. వివరాలు తప్పుగా ఉన్న దరఖాస్తును డిలీట్‌ చేసి, సరైన వివరాలతో కొత్తగా ఆప్షన్‌ ఇచ్చేందుకు అవకాశం వచ్చింది.

అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి గడువు ఈ నెల 3వ తేదీతో ముగియాల్సి ఉండగా, EPFO దీని పెంచింది. చందాదార్లు ఇప్పుడు 26 జూన్ 2023 వరకు అధిక పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

LPG e-KYC: LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
LPG ఇ-KYC చేయని గ్యాస్ కనెక్షన్ నిలిపేస్తారా? అలాంటి వారు ఏం చేయాలి? 
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Special TET 2026 Notification: ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
ఏపీలో టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల- ముఖ్యమైన తేదీలివే
Telangana Assembly Session: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఛాన్స్ కోసం చూస్తున్న విపక్షాలు!
Dhruv Jurel Mentality: మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
మాంబా మెంటాలిటీతో జురెల్ సూపర్ సెంచరీ.. జై జవాన్, జై కిసాన్ టాటుకు అర్థం చెప్పిన ధ్రువ్!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
Grey Hair : జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుందా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
CM Revanth Reddy: కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
కేంద్రం వివక్షను విదేశాల్లో లేవనెత్తితే దోశద్రోహి అని ముద్ర పడేది: సీఎం రేవంత్ రెడ్డి
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్- వారిపై కేసులు నమోదు చేస్తామని వార్నింగ్
Embed widget