అన్వేషించండి

EPFO: ఈపీఎఫ్‌వో చట్ట సవరణతో అధిక పింఛన్‌ రూల్స్‌లో అత్యంత కీలక మార్పు

2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా కేంద్ర కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

EPFO: అధిక పింఛను పథకం అనేక అవాంతరాలతో గత ఆరు నెలలుగా వార్తల్లో నలుగుతూనే ఉంది. తాజాగా, EPFO చట్టాన్ని సవరిస్తూ కేంద్ర కార్మిక శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. కంపెనీ యాజమాన్యాలు ఇప్పటి వరకు చెల్లించిన 12 శాతం వాటా నుంచే మరో 1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌లోకి (EPS) మళ్లించేలా నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్‌ 2014 సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వస్తుంది. 2022 నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశానికి అనుగుణంగా కేంద్ర కార్మిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 

కార్మిక శాఖ కొత్త నిబంధన ఫలితంగా చందాదార్లపై అదనపు భారం తగ్గుతుంది. అయితే... వేతనం రూ. 15,000 మించిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. రూ. 15,000, అంతకంటే తక్కువ వేతనం ఉన్నవాళ్లకు పాత నిబంధనే అమల్లో ఉంటుంది.

అదనపు 1.16 శాతం చందాపై రగడ
అధిక పింఛను కోసం యాజమాన్యాలతో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగులంతా, రూ. 15 వేలకు పైబడిన జీతంపై తమ చందా నుంచి అదనంగా 1.16 శాతం చొప్పున చెల్లించాలని EPFO గతంలో నిర్దేశించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన చందాదార్లు, సుప్రీంకోర్టుకు ఎక్కారు. ఉద్యోగుల వేతనం నుంచి అదనంగా తీసుకోవడం రూల్స్‌కు విరుద్ధమని తీర్పు చెప్పింది. EPFO నిర్ణయాన్ని ఆరు నెలలపాటు నిలిపివేస్తూ ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో వెనక్కు తగ్గిన కార్మిక శాఖ,  1.16 శాతం మొత్తాన్ని ఉద్యోగి వాటా నుంచి కాకుండా, కంపెనీ యాజమాన్యం జమ చేసే మొత్తం నుంచి తీసుకోవడానికి నిర్ణయించింది, ఆ ప్రకారమే తాజా ప్రకటన జారీ చేసింది.

మారిన వాటాలు ఎలా ఉంటాయి?
పాత నిబంధన ప్రకారం... తన జీతం నుంచి EPFO చందా రూపంలో ఉద్యోగి 12 శాతాన్ని చెల్లిస్తాడు. కంపెనీ యాజమాన్యం కూడా అంతే 12 శాతం మొత్తాన్ని తన వంతుగా జమ చేస్తుంది. కంపెనీ చెల్లించే ఈ 12 శాతంలో... 8.33 శాతం EPSలోకి వెళ్తుంది, మిగిలిన 3.67 శాతం EPFలోకి వెళ్తుంది. వేతనం రూ. 15,000 మించిన వారి కోసం EPFO తీసుకొచ్చిన కొత్త నిబంధన ప్రకారం... యాజమాన్యం చెల్లించే 12 శాతం నుంచే అదనంగా 1.16 శాతం మొత్తాన్ని EPSలోకి మళ్లిస్తారు. అంటే, కంపెనీ యాజమాన్యం చెల్లించే 12 శాతం వాటాలో EPSలోకి (8.33 శాతం బదులు) 9.49 శాతం వెళ్తుంది, EPFలోకి (3.67 శాతం బదులు) 2.51 శాతం వెళ్తుంది.

కొత్త నిబంధన ప్రకారం.. EPFలో జమ అయ్యే మొత్తంలో కంపెనీ వాటా తగ్గుతున్నా, ఉద్యోగిపై అదనపు భారం కూడా ఉండదు. అంటే, అధిక పెన్షన్‌ను ఎంచుకున్నప్పటికీ టేక్ హోమ్ జీతం లేదా ఇన్ హ్యాండ్ జీతంపై ఎటువంటి ప్రభావం ఉండదు.

కొత్త నిబంధనతో కొన్ని నష్టాలు
మారిన నిబంధన ప్రకారం కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అధిక పెన్షన్ ఆప్షన్‌ తీసుకున్నవాళ్లకు కంపెనీ ద్వారా PFలో డిపాజిట్ అయ్యే మొత్తం తక్కువగా ఉంటుంది, ఇది PF ఫండ్‌పై ప్రభావం చూపుతుంది. ఉద్యోగులు PFపై చక్రవడ్డీ ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు PFలో కొంత భాగం EPSకు వెళుతుంది కాబట్టి, చక్రవడ్డీ ప్రయోజనం కూడా తగ్గుతుంది. అదేవిధంగా, పదవీ విరమణ చేసినప్పుడు లేదా ఉద్యోగాన్ని విడిచిపెట్టినప్పుడు PF రూపంలో పొందే మొత్తం ఫండ్‌ కూడా తగ్గుతుంది.

అధిక పింఛను కింద ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదార్లు సమర్పించిన దరఖాస్తులు ఇప్పటికే కంపెనీ యాజమాన్యాల లాగిన్‌లోకి వచ్చాయి. 1.16 శాతం మొత్తం జమపై EPFO క్లారిటీ ఇవ్వడంతో, ఈ దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం అవుతుంది. దరఖాస్తుల ప్రక్రియలో ఏదైనా పొరపాటు చేస్తే, దానిని సరి చేసుకునేందుకు ‘డిలీట్‌ అప్లికేషన్‌’ ఆప్షన్‌ను అందుబాటులోకి వచ్చింది. వివరాలు తప్పుగా ఉన్న దరఖాస్తును డిలీట్‌ చేసి, సరైన వివరాలతో కొత్తగా ఆప్షన్‌ ఇచ్చేందుకు అవకాశం వచ్చింది.

అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి గడువు ఈ నెల 3వ తేదీతో ముగియాల్సి ఉండగా, EPFO దీని పెంచింది. చందాదార్లు ఇప్పుడు 26 జూన్ 2023 వరకు అధిక పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget