అన్వేషించండి

Twitter: బ్రేక్‌-ఈవెన్‌ స్థితికి చేరుకున్న బుల్లి పిట్ట, పెరిగిన కంపెనీ ఆదాయం

ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలతో పాటు, కంపెనీ ఖర్చులను తగ్గించడానికి వేలాది మంది ఉద్యోగులను ఎలాన్‌ మస్క్‌ ఉన్నఫళంగా ఇళ్లకు పంపేశారు.

Elon Musk -Twitter: సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను కొని నానా తిప్పలు పడుతున్న ఎలాన్‌ మస్క్‌, ఎట్టకేలకు ఆ నష్టాల నుంచి బయటపడే దారిలో ఉన్నారు. 

సోషల్ మీడియా సంస్థ "దాదాపు బ్రేకింగ్ ఈవెన్" స్థాయిలో ఉందని అని, ప్రకటనదార్లు (advertisers) చాలా మంది తిరిగి వచ్చారని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Twitter Inc CEO Elon Musk) చెప్పారు. ఒక వ్యాపారంలో ప్రారంభ నష్టాలు తగ్గి, లాభనష్టాలు లేని స్థితికి చేరడాన్ని బ్రేక్‌-ఈవెన్‌గా పిలుస్తారు. బ్రేక్‌-ఈవెన్‌ స్థితిని కూడా దాటితే, లాభాలు రావడం ప్రారంభం అవుతుంది.

బీబీసీకి ఎలాన్‌ మస్క్‌ ఇంటర్వ్యూ 
BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ ముఖాముఖిని ట్విట్టర్ స్పేసెస్‌లో (Twitter Spaces) ప్రత్యక్ష ప్రసారం చేయగా, 30 లక్షలకు పైగా వీక్షకులు చూశారు.

గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొన్నారు. అప్పటి నుంచి ట్విట్టర్ ప్రకటనల ఆదాయం భారీగా తగ్గింది. ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలతో పాటు, కంపెనీ ఖర్చులను తగ్గించడానికి వేలాది మంది ఉద్యోగులను ఎలాన్‌ మస్క్‌ ఉన్నఫళంగా ఇళ్లకు పంపేశారు.

కాలానుగుణంగా ప్రకటనల వ్యయం తగ్గిందని, "రాజకీయ" కారణాలు కూడా దీనికి తోడడయ్యాయని మస్క్ చెప్పారు. ఇప్పుడు, ప్రకటనదార్లలో చాలా మంది తిరిగి వచ్చారని బీబీసీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అప్పుడు 7,000 - ఇప్పుడు 1,500 
ట్విటర్‌లో ఇప్పుడు దాదాపు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారన్న మస్క్‌, తాను కొనుగోలు చేయడానికి ముందు దాదాపు 7,000 మంది ఉన్నారని చెప్పారు. ఆ నంబర్‌తో పోలిస్తే ఇప్పటి నంబర్‌ చాలా తగ్గిందని వెల్లడించారు.

ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఆ సంస్థ స్థిరత్వంపై ఆందోళనలు విస్తృతంగా వ్యాప్తి చెందాయి. ట్విట్టర్‌ సేవల్లో అంతరాయాలను పరిష్కరించే చాలా మంది ఇంజినీర్లు కూడా ఆందోళన వ్యక్తం చేసినవాళ్లలో ఉన్నారు. అయితే.. మస్క్‌ ఈ విమర్శలను అస్సలు పట్టించుకోలేదు, యథాప్రకారం తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ట్విట్టర్‌ కొనుగోలు తర్వాత వచ్చిన పని ఒత్తిడి కారణంగా తాను నిద్రకు కూడా దూరమయ్యానని గతంలో ఒకసారి ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. మొత్తానికి.. సీఈవో మస్క్‌, కంపెనీ ఉద్యోగుల కృషి ఫలితంగా బ్రేక్‌-ఈవెన్‌ స్థాయికి ట్విట్టర్‌ చేరుకుంది.

ఎక్స్‌ యాప్‌లో ట్విట్టర్‌ విలీనం
ఇటీవలే, ఒక కోర్టు కేసు విచారణ సందర్భంగా, ట్విటర్‌ అనే స్వతంత్ర కంపెనీ మనుగడలో లేదని ఆ సంస్థ వెల్లడించి ఆశ్చర్యపరిచింది. ఎక్స్‌ అనే యాప్‌లో ట్విటర్‌ను కలిపేసినట్లు న్యాయస్థానానికి తెలిపింది. దీనిని ధృవీకరిస్తూ..  ‘X’ అక్షరాన్ని మస్క్‌ మంగళవారం (11 ఏప్రిల్‌ 2023) నాడు ట్వీట్‌ చేశారు. ఎక్స్‌ అనేది ఒక సూపర్‌ యాప్‌. ట్విటర్‌ను ఎక్స్‌ యాప్‌లో విలీనం చేయడం ద్వారా.. మెసేజింగ్‌, కాలింగ్‌, పేమెంట్స్‌ వంటి పనులన్నీ ఒకే యాప్‌ ద్వారా చేపట్టేలా చూడాలన్నది ఎలాన్‌ మస్క్‌ లక్ష్యం. ప్రస్తుతం, చైనాకు చెందిన ‘వీచాట్‌’ ఇదే తరహా సేవలను అందిస్తోంది. ఎక్స్‌ యాప్‌ను తన దీర్ఘకాల వ్యాపార ప్రణాళికగా మస్క్‌ అభివర్ణించారు.

టాప్ హెడ్ లైన్స్

Bank Holidays in August: ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
ఆగస్టు 2026లో 14 రోజులు సెలవులు.. బ్యాంక్ పని ఉంటే హాలిడేస్ చెక్ చేసుకోండి
Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget