అన్వేషించండి

Ambani vs Elon Musk: మస్క్‌ vs అంబానీ! కొట్లాటకు సిద్ధమైన ప్రపంచ కుబేరులు!

Ambani vs Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ పరస్పరం పోటీకి దిగనున్నారు!

Ambani vs Elon Musk:  

ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ పరస్పరం పోటీకి దిగనున్నారు! అత్యంత వేగంగా స్టార్ లింక్‌ సాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను భారత్‌కు పరిచయం చేయాలని మస్క్‌ తొందరపడుతున్నాడు. అయితే రిలయన్స్‌ జియోను నడిపిస్తున్న అంబానీ దానిని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారని తెలిసింది.

ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడి బిజినెస్‌ టైకూన్స్‌తో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో స్టార్‌ లింక్‌ సాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మస్క్‌ మంగళవారం ప్రకటించారు. అక్కడి గ్రామీణ ప్రాంతాలకు అత్యధిక వేగంగా ఇంటర్నెట్‌ అందించేందుకు ఇదెంతో ఉపయోగపడుతుందని నొక్కి చెప్పారు. అయితే లైసెన్సింగ్‌ ఫీజు తీసుకొని అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. దీనిని రిలయన్స్‌ జియో వ్యతిరేకిస్తోందని తెలిసింది. అలా చేస్తే కాంపిటీషన్ ఆరోగ్యకరంగా ఉండదని, భారత కంపెనీలు వెనకబడతాయని అంబానీ అంటున్నారు. కాబట్టి సాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఎలన్‌ మస్క్‌ స్టార్‌ లింక్‌ సేవల్ని మొదలు పెట్టారు. ఇందుకోసం ఆ దేశాలు కేవలం లైసెన్సింగ్‌ ఫీజును వసూలు చేశాయి. సాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ సహజ వనరు అని వేలం నిర్వహిస్తే జియోగ్రాఫికల్‌ రిస్ట్రిక్షన్స్‌తో సేవల ధరలు మరింత పెరుగుతాయని మస్క్‌ అంటున్నారు. దాంతో విదేశీ కంపెనీల డిమాండ్లకు తలొగ్గొద్దని అంబానీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఏదేమైనా విదేశీ కంపెనీలు పోటీకి రాకుండా అడ్డుకోవాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం రిలయన్స్‌ జియోకు 43.9 కోట్ల మంది టెలికాం యూజర్లు ఉన్నారు. కంపెనీ మార్కెట్‌ లీడర్‌గా ఉంది. ఇక 80 లక్షల బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లతో 25 శాతం మార్కెట్‌ వాటాను దక్కించుకుంది. భారత సాటిలైట్‌ స్పెక్ట్రమ్‌ వేలంపై పారిశ్రామిక వర్గాల నుంచి అభిప్రాయాలు కోరగా 64 మంది స్పందించారు. 48 మంది లైసెన్సింగ్‌, 12 మంది వేలానికి ఓటేశారు. మిగిలిన వాళ్లు తటస్థంగా ఉన్నారని తెలిసింది. సాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు స్టార్‌ లింక్‌తో పాటు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌, వన్‌ వెబ్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలన్ మస్క్ బుధవారం (జూన్ 21) ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధానిని ప్రశంసించారు. న్యూయార్క్‌లో ఆయనతో సమావేశం అయ్యాక మీడియాతో మాట్లాడారు. భారత ప్రధానికి దేశాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. దేశంలో పెట్టుబడులు పెట్టడానికి టెస్లాను రమ్మని ఆహ్వానించారని అన్నారు.

మోదీతో మీటింగ్ తర్వాత మాట్లాడిన ఎలన్ మస్క్... తాను మోదీకి అభిమానినని చెప్పారు. ప్రధాని మోదీతో సమావేశం చాలా ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగిందన్న మస్క్..త్వరలో భారత్ పర్యటనను రానున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్ ఇంటర్నెట్ ను ఇండియాకు తీసుకురావటం ద్వారా మారుమూల పల్లె ప్రాంతాలకు ఇంటర్నేట్ సేవలను అందించేందుకు అవకాశంపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు మస్క్ తెలిపారు.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget