అన్వేషించండి

ED Raid: పేటీఎంకు గట్టి దెబ్బ - ఈడీ తనిఖీలు, రూ.17 కోట్లు స్వాధీనం

చైనా వ్యక్తుల నియంత్రిస్తున్న ఈ సంస్థల మర్చంట్‌ ఐడీలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉంచిన రూ.17 కోట్ల విలువైన నిధులను స్వాధీనం చేసుకుంది.

ED Raid: ఇన్‌స్టంట్‌ లోన్స్‌, డిజిటల్‌ లోన్స్‌.. పేరు ఏదైనా, తీసుకున్నవాడి పీకల మీదకు వస్తోందా అప్పు. 3 నిమిషాల్లో లోన్‌ ఇస్తామంటూ కబుర్లు చెప్పి, వసూలు చేసే సమయంలో మాత్రం 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి స్మార్ట్‌ఫోన్‌ బేస్‌డ్‌ లోన్‌ యాప్స్‌. రూపాయికే రుణాలంటూ ఆశ చూపి, తీర్చే సమయానికి అసలు కంటే వడ్డీనే ఎక్కువగా పిండేస్తున్నాయి. అంతేకాదు, లోన్ వసూళ్లను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించి, వాళ్లతో గూండాగిరీ చేయిస్తున్నాయి. ఇవన్నీ దాదాపుగా చైనా యాప్సే కావడం విశేషం. ఈ మొబైల్‌ యాప్‌ లోన్స్‌ వసూళ్ల దందాలపై ఫిర్యాదులు పెరిగి పోవడంతో ఒకవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దర్యాప్తులు చేపట్టాయి.

అక్రమ లోన్లను ఈడీ సీరియస్‌గా తీసుకుంది. శుక్రవారం, బెంగళూరులోని రజోర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ వంటి ఆన్‌లైన్ పేమెంట్‌ గేట్‌వేల కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

చైనా సంస్థలు లేదా చైనీస్‌ వ్యక్తులు నియంత్రిస్తున్న "చట్టవిరుద్ధ" ఇన్‌స్టాంట్‌ స్మార్ట్‌ఫోన్ బేస్డ్‌ రుణాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా సోదాలు నిర్వహించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కూడా వెల్లడించింది. 

చైనా వ్యక్తుల నియంత్రిస్తున్న ఈ సంస్థల మర్చంట్‌ ఐడీలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉంచిన రూ.17 కోట్ల విలువైన నిధులను స్వాధీనం చేసుకుంది.

లోన్‌ యాప్స్‌ నిర్వహణ కోసం భారతీయులకు సంబంధించిన నకిలీ పత్రాలను ఉపయోగించారు. ఆ పత్రాల్లో ఉన్న పేర్లను డైరెక్టర్లుగా చూపి, అక్రమ ఆర్జనకు తెర తీశారు. ఈ సంస్థలన్నీ చైనా వ్యక్తుల నియంత్రణలో నడుస్తున్నాయని ఈడీ తెలిపింది. అంతేకాదు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో లేదా ఆయా సంస్థలు పేర్కొన్న చిరునామాలకు వెళ్లి చూస్తే అక్కడేమీ ఉండదు. ఇచ్చిన చిరునామాల నుంచి అవి పనిచేయవు, ఎందుకంటే అవన్నీ నకిలీ అడ్రస్‌లుగా ఏజెన్సీ పేర్కొంది.

బెంగళూరులో, మొబైల్ లోన్‌ యాప్స్‌ ద్వారా రుణాలు తీసుకుని, సదరు యాజమాన్యాలు లేదా వసూళ్ల గ్యాంగ్‌ చేతుల్లో దోపిడీకి, వేధింపులకు, అవమానాలకు గురైన బాధితులు అనేక సంస్థలు లేదా వ్యక్తుల మీద ఇప్పటికే పోలీసులకు అనేక ఫిర్యాదులు చేశారు. బెంగళూరు పోలీస్‌ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో దాఖలయిన కనీసం 18 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీనిని మనీలాండరింగ్ కేసుగా అభివర్ణించింది. 

రుణగ్రహీతల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్‌బీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. దీనిలో భాగంగా, కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను పాటించి తీరాల్సిందేనని అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (ఎన్‌బీఎఫ్‌సీలు) ఆర్‌బీఐ ఆదేశించింది. కొత్తగా ఇచ్చే లోన్లేగాక, ఇప్పటికే ఇచ్చిన రుణాలను కూడా కొత్త నిబంధనల పరిధిలోకి మార్చాలని స్పష్టం చేసింది. పాత లోన్లను నవంబరు 30లోగా కొత్త మార్గదర్శకాల కిందకు తీసుకురావాలని గడువు విధించింది. 

కొత్త నిబంధనల ప్రకారం, ఒక బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఇచ్చే రుణాలను నేరుగా రుణగ్రహీత బ్యాంక్‌ ఖాతాలోనే జమ చేయాలి తప్ప ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ గేట్‌ల ద్వారా మళ్లించకూడదు. బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ మధ్యే రుణ వ్యవహారం జరగాలి తప్ప, మధ్యలో రుణ సేవల సంస్థలను (ఎల్‌ఎస్‌పీ) తీసుకురాకూడదు. ఎల్‌ఎస్‌పీలకు చెల్లించే ఫీజులను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలే భరించాలి, ఆ మొత్తం కోసం రుణగ్రహీత జేబుకు చిల్లు పెట్టకూడదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget