అన్వేషించండి

Oil Prices: కిచెన్‌ ఖర్చు నుంచి ఊరట, తగ్గిన వంట నూనెల రేట్లు

అన్ని రకాల ధార బ్రాండ్‌ ఎడిబుల్ ఆయిల్ MRPని లీటర్‌కు రూ. 10 తగ్గించాలని నిర్ణయించారు.

Mother Dairy Edible Oil Prices: వేరుశనగ, పొద్దు తిరుగుడు, రైస్‌బ్రాన్‌ సహా చాలా రకాల వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. ధార (dhara) బ్రాండ్ పేరిట వంట నూనెలను (edible oil) విక్రయిస్తున్న మదర్ డెయిరీ, అన్ని ఎడిబుల్ ఆయిల్స్ ధరలను లీటర్‌కు రూ. 10 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలతో కూడిన ఎడిబుల్ ఆయిల్ స్టాక్స్ వచ్చే వారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.
 
అంతర్జాతీయ పరిణామాల కారణంగా గత కొన్ని నెలలుగా వంట నూనెల రేట్లు పెరిగాయి, భారీ ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు, అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా మారి, గ్లోబల్‌ మార్కెట్‌లో నూనెల రేట్లు తగ్గాయి. దీంతో, ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్న కంపెనీల వ్యయాలు తగ్గాయి. తగ్గిన వంట నూనె ధరల ప్రయోజనాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎడిబుల్‌ ఆయిల్‌ రేట్లు తగ్గించేలా ఆయా కంపెనీలకు సూచించాలని ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌ను కోరింది. లీటరు ధర రూ. 8 నుంచి రూ. 12 వరకు తగ్గించాలని సూచించింది. దీనిపై, ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వానికి హామీ లభించింది. ఈ నేపథ్యంలో, ధార బ్రాండ్‌ వంట నూనెల రేట్లు తగ్గిస్తూ మదర్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. మదర్‌ డెయిరీ తన రేట్లను తగ్గించడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ఈ ఏడాది మే నెల మొదటి వారంలో కూడా వివిధ రకాల వంట నూనెల ధరలను మదర్ డెయిరీ తగ్గించింది. 

లీటర్‌కు రూ. 10 తగ్గింపు
మదర్ డెయిరీ సమాచారం ప్రకారం, అన్ని రకాల ధార బ్రాండ్‌ ఎడిబుల్ ఆయిల్ MRPని లీటర్‌కు రూ. 10 తగ్గించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయ మార్కెట్‌లోనూ పంట లభ్యత పెరగడంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

ధార బ్రాండ్‌ నూనెల కొత్త ధరలు
కొత్త రేట్ల ప్రకారం... ధార బ్రాండ్‌ లీటర్‌ ప్యాకెట్ల వంట నూనెల MRP రూ. 140 నుంచి రూ. 230 వరకు ఉంటుంది. ధార రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ రేటు లీటరుకు రూ. 140కి తగ్గగా, రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ MRP రూ. 160కు తగ్గింది. లీటర్‌ రిఫైన్డ్‌ వెజిటలబుల్‌ ఆయిల్‌ రూ. 200, కాచి ఘనీ ఆవాల నూనె లీటరు రూ. 160కి లభిస్తుంది. లీటర్‌ ఆవాల నూనె రూ. 158కు, లీటర్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ. 150కు, లీటర్‌ వేరుసెనగ నూనె - రూ.230గా ఉంటుంది. ఈ ధరలు వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తాయి. మే నెలలో కూడా, ఎడిబుల్ ఆయిల్‌పై లీటరుకు 15 నుంచి 20 రూపాయల వరకు తగ్గించింది. 

మే నెలలోనే మరికొన్ని కంపెనీలు కూడా వంట నూనెల రేట్లు తగ్గించాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పుడు అదే ప్రయత్నాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్లే కంపెనీలు రేట్లు తగ్గిస్తున్నాయి.

మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌ నుంచి సగం పింక్‌ నోట్లు మాయం, ₹500 నోట్లపై కీ అప్‌డేట్‌ 

టాప్ హెడ్ లైన్స్

Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Embed widget