అన్వేషించండి

Mobile Recharge: అరిచి గీపెట్టినా మొబైల్‌ రీఛార్జ్‌ రేట్లు రూపాయి కూడా తగ్గవు - ఒక్క ప్రకటనతో తేల్చేశారు

Mobile Tariff Hike: మన దేశంలోని 3 ప్రైవేట్‌ మొబైల్ కంపెనీలు ఈ నెల నుంచి రీఛార్జ్ ప్లాన్‌ రేట్లను 25 శాతం వరకు పెంచాయి. ఈ రేట్లను తగ్గించే చివరి అవకాశం కూడా ఇప్పుడు మూసుకుపోయింది.

Mobile Tariff Hike In India: మూడు ప్రధాన టెలికాం కంపెనీలు - రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా - తమ మొబైల్ టారిఫ్‌లను పెంచిన అంశం రాజకీయంగా రగడ సృష్టించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్ర విమర్శలకు దిగడంతో, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అధికారిక వివరణను జారీ చేసింది. ప్రపంచంలోని ప్రధాన దేశాలతో పోలిస్తే భారతదేశంలో మొబైల్ సేవలు ఇప్పటికీ చౌకగా ఉన్నాయని స్పష్టం చేసింది.

ప్రభుత్వ జోక్యం ఉండదు, మార్కెట్‌ను బట్టి నిర్ణయం
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ (DoT) విభాగం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశీయ విపణిలో 1 ప్రభుత్వ సంస్థ, 3 ప్రైవేట్ టెలికాం కంపెనీలు పని చేస్తున్నాయని DoT ఆ ప్రకటనలో తెలిపింది. మొబైల్ సేవల మార్కెట్ డిమాండ్ - సప్లై సూత్రానికి అనుగుణంగా పని చేస్తుందని వెల్లడించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) నిర్దేశించిన ఫ్రేమ్‌వర్క్ ప్రకారం టెలికాం కంపెనీలు రేట్లను నిర్ణయిస్తాయని. స్వేచ్ఛా మార్కెట్ నిర్ణయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది.

ఆ ప్రకటన ప్రకారం, టెలికాం కంపెనీలు నిర్ణయించే రేట్లలో పెరుగుదలను TRAI పర్యవేక్షిస్తుంది, ఆ మార్పులు సూచించిన పరిమితుల్లోనే ఉండేలా చూస్తుంది. గత రెండేళ్లుగా, మన దేశంలో, మొబైల్ టారిఫ్‌ల్లో ఎటువంటి మార్పు లేదని, ఆ కాలంలో, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు 5G సేవలను ప్రారంభించడం కోసం భారీగా పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. 5G సేవల ఫలితంగా దేశంలో సగటు ఇంటర్నెట్‌ వేగం 100 Mbps స్థాయికి పెరిగిందని, ఇంటర్నెట్‌ వేగం పరంగా భారతదేశ ర్యాంకింగ్ 2022 అక్టోబర్‌లోని 111 నుంచి ఇప్పుడు 15కు మెరుగుపడిందని పేర్కొంది.

ప్రపంచ దేశాల్లో అమల్లో ఉన్న రేట్లు
DoT ప్రకటనలో ఉన్న సమాచారం ప్రకారం... భారతదేశంలో మొబైల్ సేవల రేట్లు ఇప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల కంటే తక్కువగా ఉన్నాయి. డేటా ప్రకారం, చైనాలో వినియోగదార్లు కనీస మొబైల్‌ సేవల కోసం $8.84 ఖర్చు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో $4.77, భూటాన్‌లో $4.62, బంగ్లాదేశ్‌లో $3.24, నేపాల్‌లో $2.75, పాకిస్థాన్‌లో $1.39 ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అమలవుతున్న రేట్లను పరిశీలిస్తే... అమెరికాలో $49, ఆస్ట్రేలియాలో $20.1, దక్షిణాఫ్రికాలో $15.8, బ్రిటన్‌లో $12.5, రష్యాలో $6.55, బ్రెజిల్‌లో $6.06, ఇండోనేషియాలో $3.29 మరియు ఈజిప్టులో $2.55గా ఉన్నాయి. భారతదేశంలో ఈ రేటు $1.89గా ఉంది. దీనిలోనే యూజర్లు అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 18 GB డేటా ప్రయోజనాన్ని పొందుతున్నారు.

ఈ నెల ప్రారంభంలో రేట్లు పెంచిన టెలికాం కంపెనీలు
ప్రైవేట్‌ రంగంలో పని చేస్తున్న మూడు ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఈ నెల నుంచి రీఛార్జ్‌ ప్లాన్‌ల రేట్లు పెంచాయి. మొబైల్ టారిఫ్‌లను 11 శాతం నుంచి 25 శాతం వరకు ఖరీదుగా మార్చాయి. టారిఫ్ పెంపు వల్ల మొబైల్ వినియోగదార్లపై ఏటా వేల కోట్ల రూపాయల భారం పడుతుందని అంచనా. మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడివిరుస్తోందంటూ ప్రతిపక్షాలు దమ్మెత్తిపోస్తున్నాయి.

మరో ఆసక్తికర కథనం: భారీగా పెరిగిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Desam Smart Ed Conclave 2026: జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉండాలి, రిస్క్ లేకపోతే లైఫ్ లేదు: స్కోప్ సీఈవో అప్పల్ల సాయికిరణ్
జీవితంలో సక్సెస్ కావాలంటే ఈ మూడు ఉంటే చాలు - ABP Desam Smart Ed Conclave లో అప్పల్ల సాయికిరణ్
Tatkal Booking New Rules: రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పులు! సామాన్యులకు గుడ్ న్యూస్; ఏజెంట్ల ఆగడాలకు చెక్!
US Iran Conflict: అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
అమెరికా-ఇరాన్ యుద్ధంతో చమురు సంక్షోభం.. ఇప్పటికే 12% పెరిగిన ధరలు..భారత్ పై ప్రభావం ఎలా ఉండబోతోంది..?
AI for Income : AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు
AIతో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. ఇలా వాడితే డబ్బే డబ్బు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Ustaad Bhagat Singh: వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
వారం ముందుకు పవన్ 'ఉస్తాద్'... బ్యాగ్రౌండ్‌కు తమన్ బదులు డిఎస్పీ?
Embed widget