అన్వేషించండి

GST Tax Hike: తూచ్‌, అవన్నీ ఊహాగానాలే - పన్ను పోటు వార్తలు నమ్మొద్దన్న సర్కారు

GST Council News: జీఎస్‌టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి (rationalization) సామ్రాట్ చౌదరి అధ్యక్షతన ఏర్పడిన GoM, లగ్జరీ వస్తువులపై జీఎస్టీని పెంచాలని సిఫార్సు చేసినట్లు వార్తలు వచ్చాయి.

GST Rate Hike Reports Speculative CBIC : దుస్తులు, గడియారాలు, సిగరెట్లు, పొగాకు, శీతల పానీయాలు సహా 148 వస్తువులపై టాక్స్‌ రేట్లను పెంచడానికి మంత్రుల బృందం సిఫార్సు చేసిందన్న వార్త అబద్ధమని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించిన విషయాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ & ఎక్సైజ్ కస్టమ్స్' (CBIC) ట్వీట్‌ చేసింది. GST రేటును పెంచుతున్నట్లు వచ్చిన వార్తలను పుకారుగా పేర్కొంది. ఇదే విషయంపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) కూడా ఓ ట్వీట్‌ చేశారు.

GoM నివేదిక అందలేన్న సీబీఐసీ
జీఎస్టీ రేట్లలో మార్పులకు సంబంధించి, మంత్రుల బృందం (GoM) ఇంకా తన నివేదికను సిద్ధం చేసి కౌన్సిల్ పరిశీలనకు సమర్పించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ పెంపుపై మీడియాలో వచ్చిన వార్తలు పుకార్లని స్పష్టం చేసింది.

GST కౌన్సిల్‌, వివిధ వస్తువులపై GST రేట్లను హేతుబద్ధీకరించడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో.. బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ ఆర్థిక మంత్రులు సభ్యులు. బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి GoM చైర్మన్. GST కౌన్సిల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు. అన్ని రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఇందులో సభ్యులుగా ఉంటారు. GST రేట్లలో మార్పులు చేయడానికి కౌన్సిల్‌కు అధికారం ఉంది. మంత్రుల బృందం తన సిఫార్సులను మాత్రమే సమర్పించగలదు, నిర్ణయాలు తీసుకోలేదు. CBIC వెల్లడించిన ప్రకారం.. GST కౌన్సిల్ ఇంకా GST రేట్లలో మార్పుల గురించి ఆలోచించలేదు, GoM సిఫార్సులు ఇంకా కౌన్సిల్‌ వద్దకు చేరలేదు.

ఆర్థిక మంత్రి ట్వీట్‌
దేశంలో గందరగోళానికి, విమర్శలకు తావిచ్చిన జీఎస్‌టీ వార్తలపై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ కూడా స్పందించారు. ఆ వార్తలను సమయానుకూలంగా ఖండించినందుకు CBICకి కృతజ్ఞతలు చెప్పారు. "మంత్రుల బృందంలోని వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు GST రేట్లలో మార్పులను పరిశీలిస్తున్నారు. ఆ నివేదిక అందిన తర్వాత, అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్‌టి కౌన్సిల్, తదుపరి సమావేశంలో ఆ సిఫార్సులను పరిశీలిస్తుంది. ప్రజలు ఊహాగానాలకు దూరంగా ఉండటం మంచిది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

GST రేట్లను హేతుబద్ధీకరించే ప్రయత్నం!
రేట్లను హేతుబద్ధీకరించేందుకు (rationalization) బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం.. సిగరెట్లు, పొగాకు &సంబంధిత ఉత్పత్తులు, ఎరేటెడ్ బేవరేజెస్‌ (శీతల పానీయాలు సహా)పై జీఎస్‌టీ రేటును 35 శాతానికి పెంచాలని ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి, ఈ రేటు ప్రస్తుతం 28 శాతంగా ఉంది. రూ.1,500 దాటిన దుస్తులపైనా జీఎస్‌టీ రేటు మార్పునకు ప్రతిపాదించినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి.

మరో ఆసక్తికర కథనం: స్థిరంగా బంగారం, వెండి మెరుపులు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు కొత్త ధరలు ఇవీ 

టాప్ హెడ్ లైన్స్

RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget